కర్ణాటకలోని కోలార్లో ఒక శాస్త్రీయ అద్భుతం వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన ఒక మహిళకు ప్రపంచంలో మరెవరిలోనూ కనిపించని అరుదైన రక్త వర్గం ఉందని వెలుగులోకి వచ్చింది. 38 ఏళ్ల మహిళను కొన్ని రోజుల క్రితం గుండె శస్త్రచికిత్స కోసం కోలార్లోని ఆసుపత్రిలో చేర్చారు. ఆమె రక్త నమూనాను పరీక్షించిన తర్వాత వైద్యులు ఆశ్చర్యపోయారు. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే షాకింగ్ విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఆమె బ్లడ్ గ్రూప్ ఇంతకు ముందు ప్రపంచంలోనే ఎన్నడూ చూడది. ఆ మహిళ బ్లడ్ గ్రూప్ O Rh +. ఇది సాధారణంగా అందరిలోనూ కనిపిస్తుంది. కానీ ప్రత్యేకత ఏమిటంటే అందుబాటులో ఉన్న O+ రక్తం ఆమె రక్తంతో అనుకూలంగా లేదు. అందువల్ల ఆమె రక్త నమూనాను తదుపరి పరీక్ష కోసం రోటరీ బెంగళూరు TTK బ్లడ్ సెంటర్లోని అడ్వాన్స్డ్ ఇమ్యునోహెమటాలజీ రిఫరెన్స్ లాబొరేటరీకి పంపారు.
అత్యాధునిక ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు, ఆమె రక్తం పాన్-రియాక్టివ్ గా గుర్తించారు. అన్ని టెస్టుల తర్వాత ఇది వేరే ఏ వ్యక్తి రక్తంతోనూ సరిపోని బ్లడ్గ్రూప్ అని తేలింది. దాంతో వారి కుటుంబంలోని మరో 20 మంది సభ్యుల నుండి రక్త నమూనాలను సేకరించి అనుకూలత కోసం పరీక్షించారు. అయినప్పటికీ, ఆమె రక్తం మరే ఇతరుల బ్లడ్ గ్రూప్తోను మ్యాచ్ కాలేదని తేలింది. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, ఆమె గుండె శస్త్రచికిత్స రక్తం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా జరిగిందని రోటరీ బెంగళూరు చిటికే బ్లడ్ సెంటర్ డైరెక్టర్ అంకిత్ మాథుర్ తెలిపారు.
సదరు మహిళ, ఆమె కుటుంబం రక్త నమూనాను అంతర్జాతీయ రక్త గ్రూప్ రిఫరెన్స్ లాబొరేటరీకి పంపగా, చరిత్రలో ఎప్పుడూ నమోదు కాని కొత్త యాంటిజెన్ వారి రక్తంలో ఉందని తేలింది. 10 నెలల నిరంతర పరీక్ష, ప్రయోగాల తర్వాత ఇది కనుగొనబడింది. దీనిని క్రోమర్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ అని పిలిచే కొత్త రకం బ్లడ్గ్రూప్గా వర్గీకరించారు. దీనిని CRIB అనే సంక్షిప్త రూపం ద్వారా గుర్తించవచ్చు. CR అంటే క్రోమర్, IB అంటే భారతదేశం, బెంగళూరు. జూన్లో ఇటలీలోని మిలన్లో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ 35వ ప్రాంతీయ సమావేశంలో ఈ అపూర్వమైన పరిశోధన ప్రకటించబడింది. ప్రపంచంలో ఈ రక్త వర్గం ఉన్న ఏకైక వ్యక్తి ఆ మహిళ ఒక్కరే.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..