Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

BAPS: బీఏపీఎస్ డా. జ్ఞానవత్సలదాస్ స్వామికి అమెరికాలో విశేష గౌరవం

31 July 2025

Tollywood: ఈ ఇద్దరిలో ఒకరు పాన్ ఇండియా హీరోయిన్.. తెలుగులో చేసిన సినిమాలన్నీ హిట్టే.. ఎవరో గుర్తు పట్టారా?

31 July 2025

శ్రావణ మాసంలో వచ్చే కలలకు అర్థం ఏంటో తెలుసా..? ఈ రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి..!

31 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Airport Haj Embarkation Point 2026,ఏపీలో ముస్లింలకు కేంద్రం శుభవార్త.. ఇకపై హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరంలేదు – union ministry of minority affairs restored vijayawada as an embarkation point for haj 2026
ఆంధ్రప్రదేశ్

Vijayawada Airport Haj Embarkation Point 2026,ఏపీలో ముస్లింలకు కేంద్రం శుభవార్త.. ఇకపై హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరంలేదు – union ministry of minority affairs restored vijayawada as an embarkation point for haj 2026

.By .31 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Airport Haj Embarkation Point 2026,ఏపీలో ముస్లింలకు కేంద్రం శుభవార్త.. ఇకపై హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరంలేదు – union ministry of minority affairs restored vijayawada as an embarkation point for haj 2026
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Vijayawada Haj Embarkation Point For 2026: ఆంధ్రప్రదేశ్ నుండి మక్కాకు వెళ్లే ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హజ్ యాత్ర ఎంబార్కేషన్ పాయింట్‌గా గుర్తించింది. దీని ద్వారా యాత్రికులకు ప్రయాణ ఖర్చు, సమయం ఆదా అవుతాయని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రం నుంచే హజ్ యాత్ర ప్రారంభించవచ్చు.

హైలైట్:

  • ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు వచ్చింది
  • విజయవాడ హజ్ ఎంబార్కేషన్ పాయింట్‌‌
  • ముస్లింలకు డబ్బుతో పాటూ సమయం ఆదా
విజయవాడ ఎయిర్‌పోర్ట్ హజ్ ఎంబార్కేషన్ పాయింట్
విజయవాడ ఎయిర్‌పోర్ట్ హజ్ ఎంబార్కేషన్ పాయింట్ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌ నుంచి మక్కాకు వెళ్లే ముస్లింలకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఇకపై మక్కాకు నేరుగా వెళ్లేందుకు అవకాశం వచ్చింది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హజ్ ఎంబార్కేషన్ పాయింట్‌‌గా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎంబార్కేషన్‌ పాయింట్లు కలిగిన 17 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఉంటే.. వీటిలో విజయవాడ విమానాశ్రయం కూడా ఉంది. ఈ నిర్ణయంతో హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు డబ్బు, సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సీఎం చంద్రబాబు, మంత్రి ఫరూక్‌, హజ్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసినందుకు ఆనందరం వ్యక్తం చేశారు. హజ్ యాత్ర చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ‘గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంబార్కేషన్ పాయింట్‌ను పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు స్పందిస్తూ.. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజయవాడను హజ్ ఎంబార్కేషన్ పాయింట్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. విజయవాడను తిరిగి ఎంబార్కేషన్ పాయింట్‌గా చేర్చడం ముస్లిం యాత్రికులకు పెద్ద ఊరట. ముస్లిం సోదరులు ఇకపై హజ్ యాత్ర కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. మన రాష్ట్రం నుంచే హజ్ యాత్ర ప్రారంభించవచ్చు’.

ఈ నిర్ణయంతో మన రాష్ట్రంలోని యాత్రికులకు ప్రయాణ శ్రమ తగ్గుతుంది. భవిష్యత్తులో విజయవాడ హజ్ ఎంబార్కేషన్ పాయింట్ వద్ద మరిన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా కృషి చేస్తారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ కు, ముఖ్యంగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ హర్షం వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్ కోడ్ ఉల్లంఘించారు.. సీఎం చంద్రబాబు ఫైర్

దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌‌లలో ఈ హజ్ ఎంబార్కేషన్ పాయింట్ ఉంటుంది.. ఈ పాయింట్లను కొన్ని విమానాశ్రయాలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఈ ఎంబార్క్ పాయింట్ల దగ్గర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు అవసరమైన అన్ని లాంఛనాలు (వీసా, పాస్‌పోర్ట్, బ్యాగేజ్, సెక్యూరిటీ వంటి తనిఖీలు) పూర్తి చేస్తారు. హజ్ యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ఎంబార్కేషన్ పాయింట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు వారి ప్రయాణాన్ని ప్రారంభించడానికి కేటాయించిన ఎయిర్‌పోర్ట్ టెర్మినల్.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి