Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

AP Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏం ఉండాలి.? ఏం ఉండకూడదు.? వివరాలివిగో

1 August 2025

Hyderabad: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..

1 August 2025

ప్రకృతికి పెన్నిధి పులులు.. ఒకసారి తింటే 30 గంటలు నిద్రపోయే ఈ జీవుల గురించి మీకు తెలుసా..

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Liquor Scam Seized Money,ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్‌లో పట్టుబడిన నగదుపై కోర్టు సంచలన నిర్ణయం – acb court key direction to sit for ap liquor scam case seized money rs 11 crore from hyderabad farm house
ఆంధ్రప్రదేశ్

Ap Liquor Scam Seized Money,ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్‌లో పట్టుబడిన నగదుపై కోర్టు సంచలన నిర్ణయం – acb court key direction to sit for ap liquor scam case seized money rs 11 crore from hyderabad farm house

.By .31 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Liquor Scam Seized Money,ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్‌లో పట్టుబడిన నగదుపై కోర్టు సంచలన నిర్ణయం – acb court key direction to sit for ap liquor scam case seized money rs 11 crore from hyderabad farm house
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో దీనిపై దర్యాప్తునకు సిట్‌ను నియమించారు. సిట్ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో డొంక కదిలింది. శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో ఏసీబీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అట్టపెట్టల్లో దాచిన ఈ మొత్తాన్ని రూ.11 కోట్లుగా అధికారలు తేల్చారు.

హైలైట్:

  • గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు
  • ఏ 40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో డబ్బు సీజ్
  • బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం
ఫామ్‌హౌస్ నగదు
ఫామ్‌హౌస్ నగదు (ఫోటోలు– Samayam Telugu)

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో సీజ్ చేసిన నగదు విషయంలో అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) న్యాయస్థానం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాధీనం చేసుకున్న ఈ నగదు మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని సిట్‌ను ఆదేశించింది. విజయవాడ ఎస్బీఐ మాచవరం బ్రాంచ్‌లో ఈ మొత్తం డిపాజిట్ చేయాలని జారీ కోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌ శంషాబాద్‌ సమీపంలోని కాచారంలో ఓ ఫామ్‌హౌస్ నుంచి అట్టపెట్టలో దాచిన రూ. 11 కోట్ల నగదు బుధవారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీని గురించి కోర్టులో మెమో దాఖలు చేసిన సిట్ అధికారులు.. నగదు గురించి తెలియజేశారు. ఈ క్రమంలో న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో రూ. 11 కోట్ల నగదును మాచవరం ఎస్బీఐ బ్రాంచ్‌లో డిపాజిట్ చేయనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సిట్‌తో దర్యాప్తు చేయిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు పలువుర్ని విచారించారు. ఆ క్రమంలో ఏ 40 వరుణ్‌ ఇచ్చిన సమాచారంతో శంషాబాద్‌ శివారులోని సులోచన ఫార్మ్‌ గెస్ట్‌ హౌస్‌లో రూ.11 కోట్ల నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. నగదుకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించడంతో న్యాయమూర్తి పైవిధంగా ఆదేశించారు. కాగా, నగదు లభ్యమైన ఫామ్‌హౌస్ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కేసిరెడ్డిదిగా చెబుతున్నారు. కాగా, సిట్ ఛార్జ్‌షిట్‌లో పలు ప్రముఖ లిక్కర్ బ్రాండ్లు పేర్లను చేర్చింది.

ఏపీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు.. 12 అట్ట పెట్టెల్లో 11 కోట్లు

ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులైన రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వారిని విచారించిన సిట్ అధికారులు.. విచారణలో వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువుర్ని అదుపులో తీసుకున్నారు. వారిలో బునేటి చాణక్య, వరుణ్, వినయ్ తదితరులు ఉన్నారు. రాజంపేట ఎంపీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, వైసీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. కాగా, ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు విదేశాల్లో ఉన్నారని, వారిని సైతం వెనక్కి రప్పిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కథనాలు, రాజకీయాలతో పాటు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.గతంలో ప్రముఖ మీడియా సంస్థలో ఎడ్యుకేషన్ డెస్క్‌లో పనిచేశారు. ముఖ్యమైన సందర్భాల్లో లైవ్ బ్లాగ్, లైవ్ పేజీల ద్వారా పాఠకులకు నిరంతరాయంగా సమాచారం అందించిన అనుభవం ఆయనకు ఉంది. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు టర్మ్‌లు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. గతంలో రాశి ఫలాలు, ఆధ్యాత్యిక వార్తలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను ఆయన అందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జీవీఎన్ అప్పారావు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.… ఇంకా చదవండి