Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Srisailam: ఏకంగా 12సార్లు హుండీ సొమ్ము కాజేసిన ఉద్యోగి.. శ్రీశైలం చోరీ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..

1 August 2025

Lionel Messi: ధోని, కోహ్లీలతో కలిసి ఆడనున్న మెస్సీ.. ఎక్కడో కాదు భారత్‌లోనే.. ఎప్పుడంటే.?

1 August 2025

Vayalar Ramavarma: వాయలార్ రామవర్మ 50వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో గాన సంధ్య కార్యక్రమం..

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: పచ్చని పొలాల్లో బుల్లెట్ల వర్షం.. రక్తపు మడుగులో వ్యక్తి.. ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: పచ్చని పొలాల్లో బుల్లెట్ల వర్షం.. రక్తపు మడుగులో వ్యక్తి.. ఏం జరిగిందంటే..?

.By .31 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: పచ్చని పొలాల్లో బుల్లెట్ల వర్షం.. రక్తపు మడుగులో వ్యక్తి.. ఏం జరిగిందంటే..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పచ్చని పల్లెటూరు.. ప్రశాంత వాతావరణం. ఒక్కసారిగా గన్ ఫైరింగ్. బుల్లెట్స్ శబ్దానికి ఊరంతా ఉలిక్కిపడింది. పరుగుపరుగున కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లిన గ్రామస్తులకు భయంకర ఘటన కళ్ల ముందు కనిపించింది..ఇంతకీ అక్కడ ఏమి జరిగింది.? కాల్పులమోతకు కారణమేంటి? ఇదే అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం పల్లపుదుంగాడ గిరిజన గ్రామం. ఊరంతా ఎవరి పనిలో వారుండగా ఒక్కసారిగా గన్ ఫైరింగ్ శబ్దం రావడంతో గ్రామస్తులు అంతా హడావుడిగా అక్కడకు చేరుకున్నారు. అలా వెళ్లి చూడగా రక్తపుమడుగులో సీదిరి రాము అనే గిరిజనుడు పడి ఉన్నాడు. అదే సమయంలో అక్కడ సీదిరి నాగరాజు తుపాకీ చేతిలో పట్టుకొని కనిపించాడు. పరిస్థితి గమనించిన మృతుడు రాము కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సీదరి రాము తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి చిట్టెంపాడులో నివసించేవాడు. ఈ క్రమంలోనే రాము భార్య చనిపోగా.. ఇద్దరు కూతుళ్ల కు వివాహాలు జరగడంతో రాము ఒంటరయ్యాడు. దీంతో రాము తరచూ తన కూతుళ్ల వద్దకు వచ్చి వెళ్తుంటాడు. అయితే రాముకు గ్రామంలో రెండెకరాల భూమి ఉంది. ఆ భూమిని తనకు ఇవ్వాలని రాము అన్న కుమారుడు నాగరాజు అడుగుతుండేవాడు. అయితే ఆ భూమి తన ఇద్దరు ఆడపిల్లలకు ఇస్తానని నీకు ఇవ్వడం కుదరదని అతడు చెప్పాడు. తరుచూ భూమి విషయంలో రాముతో నాగరాజు గొడవపడుతూ ఉండేవాడు. అలా నాగరాజు బెదిరింపులు తట్టుకోలేక మూడు నెలల క్రితం రాము తన చిన్న కూతురు నివసిస్తున్న పల్లపుదుంగాడ గ్రామానికి వెళ్లి అక్కడే ఉండిపోయాడు. కానీ నాగరాజు మాత్రం తన పెదనాన్న గ్రామానికి వస్తే ఏదోలా భూమి కాజేయాలని ప్లాన్ చేసుకున్నాడు. నాగరాజు గ్రామంలో పొలం పనులు చేసుకోవడంతో పాటు నాటుతుపాకీతో కొండ ప్రాంతంలో జంతువులను కూడా వేటాడి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు.

చిట్టెంపాడు నుండి పల్లపుదుంగాడ వెళ్లిన రాము ఎంతకి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నాగరాజు ఉన్న నాటు తుపాకీ తీసుకొని రాము ఉంటున్న పల్లపుదుంగాడ గ్రామానికి వెళ్లాడు. అక్కడ రాము ఆచూకీ కోసం ఎంక్వైరీ చేశాడు. రాము గ్రామ సమీపంలోని పొలంలో పనులు చేస్తున్నట్లు తెలుసుకొని అక్కడకి వెళ్లాడు. అక్కడ పొలం విషయంలో రాముతో నాగరాజు మరోసారి గొడవపడ్డాడు. ఆ తరువాత కాసేపటికి తనతో తెచ్చుకున్న నాటు తుపాకీ తో రాముపై కాల్పులు జరిపాడు. ఆ దాడిలో రాము రక్తపు మడుగులో పడి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి గమనించిన రాము కుమార్తె నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాము హత్య జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతేకాకుండా ఏజెన్సీలో ఇంకా ఎవరైనా నాటు తుపాకి లు కలిగి ఉన్నారేమో అన్న అనుమానంతో పోలీసులు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Srisailam: ఏకంగా 12సార్లు హుండీ సొమ్ము కాజేసిన ఉద్యోగి.. శ్రీశైలం చోరీ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..

1 August 2025

Pradhan Mantri Fasal Bima Yojana Premium Payment,ఏపీలో రైతులకు అలర్ట్.. ఆగస్ట్ 15వ తేదీనే లాస్ట్.. త్వరపడండి.. – pradhan mantri fasal bima yojana premium payment deadline will end on august 15

1 August 2025

Plastic Water Bottles Ban In Ap Secretariat,ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆగస్ట్ 15 నుంచి వాటిపై పూర్తిగా నిషేధం.. తొలుత అక్కడే.. – plastic water bottles banned in andhra pradesh secretariat from august 10

1 August 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Srisailam: ఏకంగా 12సార్లు హుండీ సొమ్ము కాజేసిన ఉద్యోగి.. శ్రీశైలం చోరీ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..

1 August 2025

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయంలో పూజలు చేసే పరిచారకుడు దొంగగా అవతారమెత్తాడు. విలాసవంతమైన జీవితం…

Lionel Messi: ధోని, కోహ్లీలతో కలిసి ఆడనున్న మెస్సీ.. ఎక్కడో కాదు భారత్‌లోనే.. ఎప్పుడంటే.?

1 August 2025

Vayalar Ramavarma: వాయలార్ రామవర్మ 50వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో గాన సంధ్య కార్యక్రమం..

1 August 2025

గంభీర్, గిల్ వద్దని ఛీకొట్టారు.. ఇంగ్లండ్ నుంచి పంపేశారు.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా ఎంట్రీతో ఊహించని షాకిచ్చిన టీమిండియా ప్లేయర్

1 August 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Srisailam: ఏకంగా 12సార్లు హుండీ సొమ్ము కాజేసిన ఉద్యోగి.. శ్రీశైలం చోరీ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..

1 August 2025

Lionel Messi: ధోని, కోహ్లీలతో కలిసి ఆడనున్న మెస్సీ.. ఎక్కడో కాదు భారత్‌లోనే.. ఎప్పుడంటే.?

1 August 2025

Vayalar Ramavarma: వాయలార్ రామవర్మ 50వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో గాన సంధ్య కార్యక్రమం..

1 August 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025168

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.