Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. లైవ్

1 August 2025

LIC: ఎల్‌ఐసీ నుంచి అద్భుత పథకం.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 7వేలు.. అర్హులు ఎవరంటే..?

1 August 2025

PF ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. ఎటువంటి పత్రాలు అవసరం లేకుండానే..

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ntr Bharosa Pension Scheme 2025 Spouse Money,ఏపీలో వారందరికి శుభవార్త.. కొత్తగా పింఛన్‌, నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు – andhra pradesh government give rs 4000 to ntr bharosa pension scheme 2025 spouse category beneficiaries
ఆంధ్రప్రదేశ్

Ntr Bharosa Pension Scheme 2025 Spouse Money,ఏపీలో వారందరికి శుభవార్త.. కొత్తగా పింఛన్‌, నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు – andhra pradesh government give rs 4000 to ntr bharosa pension scheme 2025 spouse category beneficiaries

.By .1 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ntr Bharosa Pension Scheme 2025 Spouse Money,ఏపీలో వారందరికి శుభవార్త.. కొత్తగా పింఛన్‌, నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు – andhra pradesh government give rs 4000 to ntr bharosa pension scheme 2025 spouse category beneficiaries
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ntr Bharosa Pension Scheme Spouse Category: ఏపీ ప్రభుత్వం వారందరికి తీపికబురు చెప్పింది.. ఈ నెల నుంచి ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున పింఛన్ డబ్బులు అందిస్తారు. వాస్తవానికి జూన్ నెల నుంచి డబ్బులు ఇవ్వాలని భావించారు.. కానీ జులైలో ఇస్తామని చెప్పిని కుదరలేదు. అయితే ఆగస్టు నుంచి డబ్బులు ఇస్తున్నారు. ఈ మేరకు నిధులు విడుదలయ్యాయి.. ఈ నెల నుంచి ప్రతి నెలా రూ.4వేలు అందిస్తారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీలో వారందరికి తీపికబురు
  • ఈ నెల నుంచి పింఛన్ డబ్బులు
  • నెలకు రూ.4వేలు చొప్పున ఇస్తారు
ఏపీలో స్పౌజ్‌ పింఛన్లు ఇస్తారు
ఏపీలో స్పౌజ్‌ పింఛన్లు ఇస్తారు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,09,155 మంది వితంతువులకు స్పౌజ్‌ కేటగిరీ కింద పింఛన్ల మంజూరు చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల నుంచి ఒక్కొక్కరికి రూ.4వేలు చొప్పున అందిస్తారు.. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ భరోసా కింద ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.2,750 కోట్లు విడుదల చేసింది. స్పౌజ్ కేటగిరి పింఛన్‌లకు సంబంధించి.. గతేడాది నవంబరు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా హామీ ఇచ్చారు. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే చనిపోయిన వారి భార్యలకు మరుసటి నెల నుంచి పింఛన్ అందిస్తారు. ఈ మేరకు 2023 నుంచి పింఛన్ తీసుకుంటూ చనిపోయిన భర్తను కోల్పోయిన మహిళలకు పింఛన్ మంజూరు కాలేదని తెలుసుకున్నారు. ఈ మేరకు అలాంటి వారిని గుర్తించి స్పౌజ్ కేటగిరి కింద పింఛన్ మంజూరు చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో స్పౌజ్ కేటగిరిలో పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరిలో పింఛన్ తీసుకొచ్చింది. పింఛను తీసుకునే భర్త చనిపోయిన భార్యకు ఆ మరుసటి నెల నుంచే పింఛన్‌ అందిస్తారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పింఛను తీసుకుంటూ చనిపోయిన వారి భార్యలకు ఆ పింఛను బదిలీ చేయడానికి ప్రభుత్వం ఏప్రిల్ 24న చర్యలు మొదలుపెట్టింది. చనిపోయిన వ్యక్తి వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రం, జీవిత భాగస్వామి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో తీసుకుని.. అక్కడ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. కొత్త పింఛన్లకు సంబంధించి జూన్‌లో పంపిణీ చేయాలని ప్లాన్ చేశారు కానీ వాయిదా పడింది.. జులై నెలలో కూడా కుదరలేదు.. చివరికి ఈ నెలలో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. స్పౌజ్ కేటగిరిలో అర్హులైన అందరికీ రూ.4 వేల చొప్పున ఇంటికి వెళ్లి అందిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉండవల్లి నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడ నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో పర్యటిస్తారు. అక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. మధ్యాహ్నం టీడీపీ నేతలతో సమావేశం అవుతారు.. అనంతరం గండికోటకు వెళ్లి అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత స్టేక్‌ హోల్డర్స్, ప్రాజెక్టు డెవలపర్లతో సమావేశం అవుతారు. అనంతరం గండికోట నుంచి బయల్దేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి వస్తారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి