Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. లైవ్

1 August 2025

LIC: ఎల్‌ఐసీ నుంచి అద్భుత పథకం.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 7వేలు.. అర్హులు ఎవరంటే..?

1 August 2025

PF ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. ఎటువంటి పత్రాలు అవసరం లేకుండానే..

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Annadata Sukhibhava Scheme 2025 Pending Farmers,అన్నదాత సుఖీభవ పథకం.. వారందరికి రూ.7వేలు రావు, వెంటనే ఇలా చేయండి.. చాలా సింపుల్ – andhra pradesh government alert farmers on annadata sukhibhava scheme 2025 aadhar problems
ఆంధ్రప్రదేశ్

Annadata Sukhibhava Scheme 2025 Pending Farmers,అన్నదాత సుఖీభవ పథకం.. వారందరికి రూ.7వేలు రావు, వెంటనే ఇలా చేయండి.. చాలా సింపుల్ – andhra pradesh government alert farmers on annadata sukhibhava scheme 2025 aadhar problems

.By .1 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Annadata Sukhibhava Scheme 2025 Pending Farmers,అన్నదాత సుఖీభవ పథకం.. వారందరికి రూ.7వేలు రావు, వెంటనే ఇలా చేయండి.. చాలా సింపుల్ – andhra pradesh government alert farmers on annadata sukhibhava scheme 2025 aadhar problems
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Annadata Sukhibhava Scheme 2025 Pending: ఏపీ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ఈ నెల 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.. ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 2 నుంచి రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు ఇప్పటికి అన్నదాత సుఖీభవ పథకం విషయంలో ఇబ్బందిపడుతున్నారు.. వారందరికి ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది.

హైలైట్:

  • అన్నదాత సుఖీభవ పథకంపై అలర్ట్
  • కొందరు రైతుల పేర్లు జాబితాలో లేవు
  • ఆధార్ సహా సమస్యలు ఉన్నాయి
అన్నదాత సుఖీభవ పథకం 2025
అన్నదాత సుఖీభవ పథకం 2025 (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరాయపాలెంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఈ మేరకు ఒక్కో రైతు అకౌంట్‌లోకి రూ.7వేల చొప్పున జమ చేయనున్నారు. ఇప్పటికే అర్హుల జాబితాలను ప్రదర్శించగా.. ఇప్పటికి పలువురు రైతులు కొన్ని కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో తమ పేర్లు అర్హుల జాబితాలో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆధార్ వివరాలు సరిగా లేకపోవడంతో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. లక్షల మంది రైతుల ఆధార్ కార్డు వివరాలు వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలతో సరిపోలడం లేదు. పేర్లు తప్పుగా ఉండడం, చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అన్నదాత సుఖీభవ పథకం అర్హులైన రైతులు నష్టపోకుండా చూడాలని సూచించింది. రైతుల వివరాల్లో తప్పులు ఉండటంతో తహసీల్దార్ల లాగిన్‌లలో చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం జిల్లాల అధికారులకు తెలిపింది. రికార్డుల్లోని వివరాల ఆధారంగా అర్హులకు న్యాయం చేయాలని కోరింది. ఆధార్ కార్డుల్లో మార్పులు ఉంటే, వీఆర్వోల సహాయంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. అర్హుల జాబితాలో పేర్లు లేనివాళ్లు, డబ్బులు జమకాని వాళ్లు వెంటనే ఈ తప్పుల్ని సరిచేసుకోవాలని సూచించారు.

ఏపీ ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీలలో భాగంగా ‘పీఎం కిసాన్‌- అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో మొత్తం 46,85,838 మంది రైతులు లబ్ధి పొందుతారు. మొదటి విడతలో కేంద్రం ‘పీఎం కిసాన్‌’ పథకం కింద రూ.2 వేలు సాయానికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7వేలు చొప్పున బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,342.92 కోట్లు జమ చేస్తుంది. దీనికి అదనంగా కేంద్రం రూ.831.51 కోట్లు అందిస్తుంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం రైతులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పింది.. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6వేలకు.. ఏపీ ప్రభుత్వం రూ.14వేలు కలిపి రూ.20 వేలు ఇస్తోంది.

Chandrababu: కుర్రాడికి క్లాస్ పీకిన చంద్రబాబు.. మంత్రిని చూపిస్తూ, ఆసక్తికర సీన్

రైతులు అన్నదాత సుఖీభవ పథకం గురించి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం 155251 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ అన్నదాతా సుఖీభవ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయం, పంచాయతీలు, మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో అన్నదాతసుఖీభవ పథకం ప్రారంభోత్స కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలన్నారు. అన్నదాతా సుఖీభవ అందుకునే రైతుల మొబైల్స్‌కు ఒకరోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సమాచారం పంపాలని సూచించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి