Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. లైవ్

1 August 2025

LIC: ఎల్‌ఐసీ నుంచి అద్భుత పథకం.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 7వేలు.. అర్హులు ఎవరంటే..?

1 August 2025

PF ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. ఎటువంటి పత్రాలు అవసరం లేకుండానే..

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap School Students Transport Allowance Guidelines,ఏపీలో స్కూల్ విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.6వేలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా – andhra pradesh sarva shiksha abhiyan director released guidelines for school students transport allowance 2025
ఆంధ్రప్రదేశ్

Ap School Students Transport Allowance Guidelines,ఏపీలో స్కూల్ విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.6వేలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా – andhra pradesh sarva shiksha abhiyan director released guidelines for school students transport allowance 2025

.By .1 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap School Students Transport Allowance Guidelines,ఏపీలో స్కూల్ విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.6వేలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా – andhra pradesh sarva shiksha abhiyan director released guidelines for school students transport allowance 2025
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh School Students Transport Allowance Guidelines 2025: ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం విద్యాహక్కు చట్టం ప్రకారం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అందిస్తోంది.. నెలకు రూ.600 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది.. మొత్తం పది నెలలకు గాను రూ.6వేలు ఇస్తారు. అయితే తాజాగా సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీలో విద్యార్థులకు సూపర్ న్యూస్
  • ఒక్కొక్కరికి రూ.6వేలు లెక్కన ఇస్తారు
  • మార్గదర్శకాలు కూడా జారీ చేశారు
ఏపీ స్కూల్ విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్
ఏపీ స్కూల్ విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు అద్భుత అవకాశం కల్పించింది. రవాణా ఖర్చుల కోసం ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది.. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ ఏడాది దాదాపు 79,860 మంది విద్యార్థులకు మొత్తం రూ.47.91 కోట్లు రవాణా భత్యంగా చెల్లిస్తారు. పాఠశాల దూరం ఎక్కువగా ఉంటే ఈ డబ్బులు ఇస్తారు. ఎవరూ బడి దూరం అనే కారణంతో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (టీఏ) ఇస్తోంది. గతంలో డబ్బులు ఒకేసారి ఇచ్చేవారు.

విద్యా హక్కు చట్టం ప్రకారం.. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు టీఏ (ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్) పొందే అవకాశం ఉంది. పిల్లలు ఉండే చోటు నుంచి ప్రాథమిక పాఠశాల ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం ఉంటే డబ్బులు ఇస్తారు. ప్రాథమికోన్నత పాఠశాల మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే కూడా డబ్బులు ఇస్తారు. సెకండరీ పాఠశాల ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే రవాణా భత్యం ఇస్తారు. ఒక్కో విద్యార్థికి నెలకి రూ.600 చొప్పున అందిస్తారు.. ఏడాదికి అయితే రూ.6 వేలు ఇస్తారు. ఈ డబ్బుల్ని విద్యార్థులు స్కూల్‌కు వెళ్లడానికి బస్సు లేదా ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకోవచ్చు. ఈ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌ను నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు అకౌంట్‌కు జమ చేస్తారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాదు.

అమరావతిని సింగపూర్ చేయడమే చంద్రబాబు ధ్యేయం.. అదే పర్యటన ఉద్దేశం: రాంప్రసాద్ రెడ్డి

పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అర్హులైన విద్యార్థులను గుర్తించి.. వారి వివరాలను లీప్‌ యాప్‌లో నమోదు చేసింది. అనంతరం ఎంఈవోలు పరిశీలిస్తే సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ధృవీకరిస్తారు. ఆగస్టు 10 నాటికి లబ్ధిదారుల తుది జాబితాను అధికారులు ఖరారు చేస్తారు.. త్వరలోనే అర్హులైన విద్యార్థులకు టీఏ జమ చేస్తారు. ప్రతి ఏటా 10 నెలల పాటూ ఈ ట్రావెల్ అలవెన్స్ అందజేస్తారు. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి