Mohan Babu Get Relief From Supreme Court: మంచు మోహన్బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019 నుంచి వెంటాడుతున్న కేసుli కోర్టు కొట్టివేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై ధర్నా చేసినందుకు ఈ కేసు నమోదైంది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈకేసుతో సంబంధం ఉన్న అన్ని చర్యలను రద్దు చేస్తున్నామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ తీర్పుతో మంచు కుటుంబానికి రిలీఫ్ దక్కింది.
హైలైట్:
- మంచు మోహన్బాబు, విష్ణుకు ఊరట
- కీలక తీర్పును వెల్లడించిన సుప్రీం కోర్టు
- వారిపై నమోదు కేసులు కొట్టేసిన కోర్టు

సారీ సోదరా.. తొందరపడ్డాను.. జర్నలిస్టుకు క్షమాపణ చెప్పిన మోహన్ బాబు
2019 మార్చి 22న శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మోహన్ బాబు, విష్ణు ధర్నాకు దిగిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా విద్యానికేతన్ విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులతో కలిసి తిరుపతి-మదనపల్లె రోడ్డుపై ర్యాలీ చేశారు. ఈ ధర్నా కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని.. అదే సమయంలో ఎన్నికలో నోటిఫికేషన్ రావడంతో.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మోహన్బాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. తమకు ఎన్నికల కోడ్ వర్తించదని, అయినా సరే తమపై కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాము ఎవరికి ఇబ్బంది లేకుండా ధర్నా చేస్తే అన్యాయంగా కేసులు పెట్టారని కోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు కేసుల్ని కొట్టేసేందకు నిరాకరించడంతో ఈ ఏడాది మార్చిలో మోహన్బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. మొత్తానికి ఈ కేసులో విముక్తి లభించింది.