Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. లైవ్

1 August 2025

LIC: ఎల్‌ఐసీ నుంచి అద్భుత పథకం.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 7వేలు.. అర్హులు ఎవరంటే..?

1 August 2025

PF ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. ఎటువంటి పత్రాలు అవసరం లేకుండానే..

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Supreme Court Quashes Fir On Mohan Babu,మోహన్‌బాబు, మంచు విష్ణులకు భారీ ఊరట.. ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో – supreme court quashes fir on manchu mohan babu and manchu vishnu
ఆంధ్రప్రదేశ్

Supreme Court Quashes Fir On Mohan Babu,మోహన్‌బాబు, మంచు విష్ణులకు భారీ ఊరట.. ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో – supreme court quashes fir on manchu mohan babu and manchu vishnu

.By .1 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Supreme Court Quashes Fir On Mohan Babu,మోహన్‌బాబు, మంచు విష్ణులకు భారీ ఊరట.. ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో – supreme court quashes fir on manchu mohan babu and manchu vishnu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Mohan Babu Get Relief From Supreme Court: మంచు మోహన్‌బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019 నుంచి వెంటాడుతున్న కేసుli కోర్టు కొట్టివేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై ధర్నా చేసినందుకు ఈ కేసు నమోదైంది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈకేసుతో సంబంధం ఉన్న అన్ని చర్యలను రద్దు చేస్తున్నామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ తీర్పుతో మంచు కుటుంబానికి రిలీఫ్ దక్కింది.

హైలైట్:

  • మంచు మోహన్‌బాబు, విష్ణుకు ఊరట
  • కీలక తీర్పును వెల్లడించిన సుప్రీం కోర్టు
  • వారిపై నమోదు కేసులు కొట్టేసిన కోర్టు
మోహన్‌బాబు మంచు విష్ణులపై కేసు కొట్టివేత
మోహన్‌బాబు మంచు విష్ణులపై కేసు కొట్టివేత (ఫోటోలు– Samayam Telugu)

సినీ నటులు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గతంలో తమ విద్యా సంస్థకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ధర్నా చేసినందుకు వారిపై అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు చంద్రగిరిలో 2019లో నమోదైన ఒక కేసులో ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్‌ను కొట్టివేసింది. ఈ కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్‌లను కలిపి చదివినా, సెక్షన్లు ఎలా వర్తిస్తాయో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ధర్నా సమయంలో ప్రజలకు హాని కలిగేలా వారు ఏమీ చేయలేదని కోర్టు అభిప్రాయపడింది.. వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు చూపలేకపోయారని అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పును వెల్లడించింది. ఏపీ హైకోర్టు ఈ కేసును కొట్టేయడానికి నిరాకరించగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి కొట్టేసింది. వీరిద్దర్ని 2019 నుంచి ఈ కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే.. చివరికి ఊరట దక్కింది.

సారీ సోదరా.. తొందరపడ్డాను.. జర్నలిస్టుకు క్షమాపణ చెప్పిన మోహన్ బాబు

2019 మార్చి 22న శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మోహన్ బాబు, విష్ణు ధర్నాకు దిగిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా విద్యానికేతన్ విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులతో కలిసి తిరుపతి-మదనపల్లె రోడ్డుపై ర్యాలీ చేశారు. ఈ ధర్నా కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని.. అదే సమయంలో ఎన్నికలో నోటిఫికేషన్ రావడంతో.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మోహన్‌బాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. తమకు ఎన్నికల కోడ్ వర్తించదని, అయినా సరే తమపై కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాము ఎవరికి ఇబ్బంది లేకుండా ధర్నా చేస్తే అన్యాయంగా కేసులు పెట్టారని కోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు కేసుల్ని కొట్టేసేందకు నిరాకరించడంతో ఈ ఏడాది మార్చిలో మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. మొత్తానికి ఈ కేసులో విముక్తి లభించింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి