Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Horoscope Today: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.. 12రాశుల వారి రాశిఫలాలు

2 August 2025

National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. లైవ్

1 August 2025

LIC: ఎల్‌ఐసీ నుంచి అద్భుత పథకం.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 7వేలు.. అర్హులు ఎవరంటే..?

1 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Konaseema 30 Feet Digging,కోనసీమ: ఓ ఇంట్లో 30 అడుగుల గొయ్యి తవ్వారు.. కారణం తెలిసి వణికిపోయిన జనాలు – 30 feet digging in a house near kothapeta konaseema district
ఆంధ్రప్రదేశ్

Konaseema 30 Feet Digging,కోనసీమ: ఓ ఇంట్లో 30 అడుగుల గొయ్యి తవ్వారు.. కారణం తెలిసి వణికిపోయిన జనాలు – 30 feet digging in a house near kothapeta konaseema district

.By .1 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Konaseema 30 Feet Digging,కోనసీమ: ఓ ఇంట్లో 30 అడుగుల గొయ్యి తవ్వారు.. కారణం తెలిసి వణికిపోయిన జనాలు – 30 feet digging in a house near kothapeta konaseema district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Kothapeta 30 Feet Digging:

కోనసీమ 30 అడుగుల గొయ్యి తవ్వి క్షుద్రపూజలు
కోనసీమ 30 అడుగుల గొయ్యి తవ్వి క్షుద్రపూజలు (ఫోటోలు– Samayam Telugu)

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగింది.. ఓ ఇంట్లో ఏకంగా 30 అడుగుల గోతిని తవ్వడం కలకలం రేపింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల జనాలు భయంతో వణికిపోయారు. కొత్తపేట మండలం వానపల్లి గాంధీబొమ్మ కూడలి దగ్గర ఓ ఇంట్లో కొద్దిరోజులగా గొయ్యిని తవ్వుతున్నారు. ఏకంగా 30 అడగుల లోతు వరకు తవ్వేశారు. ముందు స్థానికులు ఆ గొయ్యి గురించి పట్టించుకోలేదు. అయితే నాలుగు రోజులుగా ఆ గోతిలో క్షుద్రపూజలు కూడా చేస్తున్నారు. అయితే స్థానికులకు అనుమానం వచ్చింది. అందరూ కలిసి మాట్లాడుకుని ఆ ఇంటిని చుట్టుముట్టారు. అక్కడ పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో సహా పూజా సామాగ్రి ఉండటాన్ని గమనించారు.

ఆ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తు్న్న ఆరుగురు అనుమానితులను పట్టుకుని ప్రశ్నించారు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. వీరందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తులు ఎవరు.. ఈ పూజల వెనక ఉద్దేశం ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వానపల్లిలో ఈ క్షుద్రపూజల వ్యవహారం సంచలనంగా మారింది.. గ్రామంలో ఆందోళన నెలకొంది. అమలాపురానికి చెందిన ఓ వ్యక్తి పూజలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇంటి యజమాని పొంతన లేకుండా మాట్లాడటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుప్త నిధుల కోసమే ఇలా గొయ్యిని తవ్వి ఉంటారని అనుమానిస్తున్నారు.

మన దేశంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా సరే ఇలా క్షుద్రపూజలు, గుప్తనిధుల తవ్వకాల పేరుతో మూఢ నమ్మకాలను నమ్మేస్తున్నారు. ఇటీవల కాలంలో గుప్తనిధులపై కొంతమందికి ఆశ కలిగి ఇలా ఎక్కడపడితే అక్కడ తవ్వేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆలయాలను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో గుప్త నిధుల తవ్వకాలు జరిపే ముఠాలు పోలీసులకు దొరికిపోయాయి.. అయినా సరే ఇప్పటికే కొందరు పద్దతి మార్చుకోవడం లేదు గుప్తు నిధుల పేరుతో జనాలను నమ్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన కూడా జరిగిందని చెప్పాలి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి