Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Megastar Chiranjeevi: జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు చిరంజీవి శుభాకాంక్షలు..

2 August 2025

Gedela Tuhin Kumar,AP High Court మరో కొత్త జడ్జి నియామకం.. తుహిన్ కుమార్ గేదెల బ్యాగ్రౌండ్ ఇదే – gedela tuhin kumar appointed as andhra pradesh high court additional judge

2 August 2025

PM Kisan: రైతులకు శుభవార్త.. బ్యాంకు అకౌంట్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఇలా చెక్‌ చేసుకోండి!

2 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pradhan Mantri Fasal Bima Yojana Premium Payment,ఏపీలో రైతులకు అలర్ట్.. ఆగస్ట్ 15వ తేదీనే లాస్ట్.. త్వరపడండి.. – pradhan mantri fasal bima yojana premium payment deadline will end on august 15
ఆంధ్రప్రదేశ్

Pradhan Mantri Fasal Bima Yojana Premium Payment,ఏపీలో రైతులకు అలర్ట్.. ఆగస్ట్ 15వ తేదీనే లాస్ట్.. త్వరపడండి.. – pradhan mantri fasal bima yojana premium payment deadline will end on august 15

.By .1 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pradhan Mantri Fasal Bima Yojana Premium Payment,ఏపీలో రైతులకు అలర్ట్.. ఆగస్ట్ 15వ తేదీనే లాస్ట్.. త్వరపడండి.. – pradhan mantri fasal bima yojana premium payment deadline will end on august 15
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలోని రైతులకు అలర్ట్.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఆగస్ట్ 15వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రైతులు త్వరపడాలని ఆ గడువులోగా ప్రీమియం చెల్లించి తమ పంటలకు బీమా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రీమియం చెల్లించి పంటలకు బీమా చేయించుకున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం వాటిల్లితే… ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‍‌లోని రైతులకు ముఖ్య గమనిక. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నమోదు గడువు త్వరలోనే ముగియనుంది. ఆగస్ట్ 15వ తేదీతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నమోదు గడువు ముగుస్తుందని.. రైతులకు ఈ విషయాన్ని గమనించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అతివృష్టి, ఆనావృష్టి వంటి ప్రకృతి విపత్తులతో పాటుగా పంటలకు చీడపీడలు వంటివి వచ్చిన సమయంలో రైతన్నలు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేస్తోంది. పంటల బీమాకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (PMFBY), పునర్నిర్మించిన వాతావరణ పంటల బీమా (RWBCIS) అనే రెండు పథకాలను కేంద్రం అమలు చేస్తోంది.
అయితే వీటిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఆగస్ట్ 15వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రైతులు త్వరగా బీమా ప్రీమియం చెల్లించి ఈ పథకం ప్రయోజనాలు అందుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. పంటను అనుసరించి బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించిన రైతులకు.. పంట నష్టం సంభవిస్తే ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించి వారిని ఆదుకుంటారు. తుపానులు, అగ్నిప్రమాదాలు, వడగండ్ల వానలు, ఈదురు గాలులు, వరద ముంపు, చీడపీడలు వంటివి సంభవించినప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. పంట నష్టం సంభవించిన రెండురోజుల్లోగా రైతులు సంబంధిత బ్యాంక్‌ అధికారులకు, బీమా కంపెనీకి, వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించి ప్రయోజనం పొందవచ్చు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన – కావాల్సిన పత్రాలు

మరోవైపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియంను రైతులు రైతు సేవా కేంద్రాలలో చెల్లించవచ్చు. ఆధార్‌ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబర్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌, పంట ధ్రువీకరణ పత్రం తీసుకుని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి బీమా ప్రీమియం చెల్లించి నమోదు చేయించుకోవాలి. కౌలుదారులు అయితే అదనంగా ప్రభుత్వం ఇచ్చిన కౌలుకార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. బీమా ప్రీమియం గడువు ఆగస్ట్ 15తో ముగుస్తుందని.. పంట వేసిన ప్రతి రైతు కూడా ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లించి తమ పంటలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి