Andhra Pradesh July Record Gst Collection: ఈ ఏడాది జులైలో రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధిక రాబడిని పొందింది. 2018 నుంచి 2025 వరకు జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.3,803 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. గత జులై నెలలతో పోలిస్తే ఈ జులైలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి. స్థూలంగా చూసినా, నికరంగా లెక్కించినా ఇదే రికార్డు అని అధికారులు తెలిపారు. ఈసారి జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది.
హైలైట్:
- జీఎస్టీ వసూళ్లలో ఏపీ అదరగొట్టింది
- జీఎస్టీ రాబడిలో రికార్డు సృష్టించింది
- రూ.3,803 కోట్ల స్థూల వసూళ్లు నమోదు

ఇది గత ఏడాది కంటే 12.12 శాతం ఎక్కువ.. అలాగే 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక వసూలు. ఏప్రిల్ నుంచి జులై వరకు జీఎస్టీ పెరుగుతూ వస్తోంది.. వసూళ్ల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో మొదటి స్థానంలో, దేశంలో మూడవ స్థానంలో ఉంది. ఎస్జీఎస్టీ వసూళ్లు కూడా 14.47శాతం వృద్ధి చెందాయి. ఇది గతేడాది జులై కంటే 10.69 శాతం ఎక్కువ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయి.. చంద్రబాబు సమీక్షలు కూాడా నిర్వహించారు. గత రెండు నెలలుగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి.. చంద్రబాబు అనుకున్నది సాధించారు.
ఈ ఏడాది జులైలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి.. 2024 జులైతో పోలిస్తే 12.12% ఎక్కువ వసూళ్లు వచ్చాయి. జీఎస్టీ మొత్తం వసూళ్లలో 14% వృద్ధి కనిపించింది. వస్తువులు, సేవలు ఎక్కువగా కొనడం వల్ల, పన్నుల శాఖ బాగా చూసుకోవడం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. గత జులైతో పోలిస్తే ఈ జులైలో ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.1,226 కోట్లు ఎక్కువ వచ్చాయి. ఇది 14.47% పెరుగుదల. వాణిజ్య పన్నుల శాఖ ఈ ఫలితాలను విశ్లేషిస్తోంది. రాష్ట్రానికి ఐజీఎస్టీ సర్దుబాటు తర్వాత రూ.1,704 కోట్లు వచ్చాయి. గతేడాది జులైతో పోలిస్తే ఇది 10.69% ఎక్కువ. అంటే, పన్నుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం బాగా పెరిగిందని చెప్పవచ్చు.
ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..
పన్ను ఎగవేతలను అరికట్టడం, ఐజీఎస్టీ సర్దుబాట్లు మెరుగుపరచడం, పెట్రోలియం ఉత్పత్తులపై రాబడి పెరగడం వల్ల ఇది సాధ్యమైందని వాణిజ్య పన్నుల శాఖ తెలిపింది. పన్నులు ఎగ్గొట్టకుండా నిఘా పెంచడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ బాబు అన్నారు. ఐజీఎస్టీ సర్దుబాట్లను సరిచేయడం, పెట్రోలియం ఉత్పత్తులపై రాబడి పెరగడం కూడా కలిసొచ్చాయని వివరించారు. వృత్తి పన్నులో 55% వసూళ్లు సాధించామని ఆయన తెలిపారు.