పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. ఇందులో సెకండ్ హీరోయిన్గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. దీంతో తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుంది. దీంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఈ బ్యూటీ చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది.
సంయుక్త మీనన్ తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ కంప్లీట్ చేసిన చిరు.. ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలసిందే. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండగా.. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీతో చిరు ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్టును కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కేరళ కుట్టి సంయుక్త మీనన్ కథానాయికగానటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న సంయుక్తకు చిరు సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే ఈ అమ్మడు కెరీర్ మలుపు తిప్పినట్లే ఇక.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?