Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్.. కేసు నమోదు చేయాలని ఆదేశం

2 August 2025

Prakash Raj: అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా ??

2 August 2025

Manam Movie: మనం సినిమా రీరిలీజ్.. అక్కడ నాగ్ క్రేజ్ చూస్తే మెంటలెక్కాల్సిందే..

2 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Gedela Tuhin Kumar,AP High Court మరో కొత్త జడ్జి నియామకం.. తుహిన్ కుమార్ గేదెల బ్యాగ్రౌండ్ ఇదే – gedela tuhin kumar appointed as andhra pradesh high court additional judge
ఆంధ్రప్రదేశ్

Gedela Tuhin Kumar,AP High Court మరో కొత్త జడ్జి నియామకం.. తుహిన్ కుమార్ గేదెల బ్యాగ్రౌండ్ ఇదే – gedela tuhin kumar appointed as andhra pradesh high court additional judge

.By .2 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gedela Tuhin Kumar,AP High Court మరో కొత్త జడ్జి నియామకం.. తుహిన్ కుమార్ గేదెల బ్యాగ్రౌండ్ ఇదే – gedela tuhin kumar appointed as andhra pradesh high court additional judge
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP High Court Judge Gedela Tuhin Kumar: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో కొత్త జడ్జిని నియమించారు. తుహిన్ కుమార్ గేదెలను హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపగా, కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది. తాజాగా తుహిన్ కుమార్ నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్న తుహిన్ కుమార్ త్వరలో అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

హైలైట్:

  • ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి నియామకం
  • అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు
ఏపీ హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్ గేదెల
ఏపీ హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్ గేదెల (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కొత్తగా మరో న్యాయమూర్తి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెలను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నియామకాన్ని ఆమోదించగా.. కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెల 2న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం తుహిన్ కుమార్ పేరును సిఫార్సు చేసింది. ఈ నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది. తుహిన్ కుమార్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు. న్యాయవాదిగా ఆయనకు ఎంతో అనుభవం ఉంది.. వివిధ విభాగాలకు సంబంధించిన కేసులను ఆయన వాదించారు. తుహిన్ కుమార్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి (ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా). ఆయన తల్లిదండ్రులు సరోజినినాయుడు, కృష్ణమూర్తినాయుడు. తుహిన్ కుమార్ విశాఖపట్నంలోనే విద్యాభ్యాసం చేశారు. సెయింట్ ఎలోషియస్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కృష్ణా కళాశాలలో ఇంటర్ చదివారు. లాసెట్‌లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. విశాఖపట్నం ఎన్‌బీఎం లా కాలేజీ నుంచి నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1994 మార్చి 9న తుహిన్ కుమార్ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.

జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు

విశాఖపట్నంలో సీనియర్ న్యాయవాది మంగు రామదాసు వద్ద జూనియర్ లాయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌ హైకోర్టుకు ప్రాక్టీసు మార్చి సీనియర్ లాయర్ కౌతూరు వినయ్‌కుమార్ ఆఫీసులో జూనియర్‌గా చేరారు. అనంతరం 2000 నుంచి 2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ లాయర్‌గా పనిచేశారు. అనంతరం సీనియర్ లాయర్ సరసాని సత్యంరెడ్డి, మరో సీనియర్ లాయర్ శ్రీనివాసబాబా ఆఫీసులకు సంబంధించిన కేసుల్ని హైకోర్టులో వాదించారు తుహిన్‌ కుమార్. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తరపున 2010-14 మధ్య హైకోర్టులో స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు. 2016-17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. అన్ని రకాల కేసులను వాదించిన అనుభవం ఆయనకు ఉంది. త్వరలోనే ఆయన ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి