AP High Court Judge Gedela Tuhin Kumar: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో కొత్త జడ్జిని నియమించారు. తుహిన్ కుమార్ గేదెలను హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపగా, కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది. తాజాగా తుహిన్ కుమార్ నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్న తుహిన్ కుమార్ త్వరలో అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
హైలైట్:
- ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి నియామకం
- అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు

జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు
విశాఖపట్నంలో సీనియర్ న్యాయవాది మంగు రామదాసు వద్ద జూనియర్ లాయర్గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ హైకోర్టుకు ప్రాక్టీసు మార్చి సీనియర్ లాయర్ కౌతూరు వినయ్కుమార్ ఆఫీసులో జూనియర్గా చేరారు. అనంతరం 2000 నుంచి 2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ లాయర్గా పనిచేశారు. అనంతరం సీనియర్ లాయర్ సరసాని సత్యంరెడ్డి, మరో సీనియర్ లాయర్ శ్రీనివాసబాబా ఆఫీసులకు సంబంధించిన కేసుల్ని హైకోర్టులో వాదించారు తుహిన్ కుమార్. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తరపున 2010-14 మధ్య హైకోర్టులో స్టాండింగ్ కౌన్సెల్గా పనిచేశారు. 2016-17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. అన్ని రకాల కేసులను వాదించిన అనుభవం ఆయనకు ఉంది. త్వరలోనే ఆయన ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు.