Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భారత్‌ది డెడ్‌ ఎకానమీనా? ChatGPT, Grok చెప్పింది వింటే.. ట్రంప్‌ తలకాయ ఎక్కడపెట్టుకుంటాడో?

2 August 2025

New Roads In Ap,ఆ జిల్లాలో రహదారులకు మహర్దశ.. ఆ రెండు రోడ్లూ రూపురేఖలు మారిపోతాయ్.. – ap government plans to develop roads in kavali and kandukur

2 August 2025

Rajinikanth Coolie : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన నాగార్జున

2 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rs 20000 Crore Investments In Ap,ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు.. ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్..! – ap government land allotment to five it companies in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Rs 20000 Crore Investments In Ap,ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు.. ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్..! – ap government land allotment to five it companies in visakhapatnam

.By .2 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rs 20000 Crore Investments In Ap,ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు.. ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్..! – ap government land allotment to five it companies in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Five IT Companies Comes to Visakhapatnam: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ఐదు ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రభుత్వం వీటికి భూములు కేటాయించింది. ఐదు కంపెనీలు కలిపి రూ.19 వేలకు పైచిలుకు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారుగా 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు చెప్తున్నారు. ఐదు ఐటీ సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు.. ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్..
ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు.. ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్.. (ఫోటోలు– Samayam Telugu)

Five IT Companies Comes to Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ఐదు ఐటీ కంపెనీలు రానున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీసీఎస్, కాగ్నిజెంట్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. తాజాగా మరో ఐదు ఐటీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ఐదు కంపెనీలు కూడా విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించగా.. తాజాగా వీటికి ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోషన్స్ బోర్డు (SIPB)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు ఐటీ కంపెనీలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో ఈ ఐదు కంపెనీలు కలిపి రూ.19,223 కోట్లు పెట్టుబడులు పెట్టనుండగా.. సుమారుగా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు అధికారులు చెప్తున్నారు.

సిఫీ ఇన్ఫినిటీ స్పేషెస్ లిమిటెడ్ అనే సంస్థ విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రూ.15,226 కోట్లతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో పరదేశీపాలెంలో సిఫీ సంస్థకు ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున 25 ఎకరాలు కేటాయించారు. అలాగే మధురవాడ ఐటీ సెజ్‌లో ఎకరా కోటి రూపాయల చొప్పున 3.6 ఎకరాలు కేటాయించారు. ఈ పెట్టుబడుల ద్వారా 600 మందికి ఉపాధి దక్కనుంది. ఇక సత్వ డెవలపర్స్ అనే సంస్థ విశాఖలో రూ.1500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మధురవాడలో ఎకరా కోటిన్నర చొప్పున 30 ఎకరాలు కేటాయించారు. సత్వ పెట్టుబడులతో సుమారుగా 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఇక ఏఎన్ఎస్‌ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వేయి కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఐటీ సెజ్‌లో ఎకరా 99 పైసల చొప్పున 10.29 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ పెట్టుబడులతో పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.పేనమ్‌ పీపుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు మధురవాడలోని హిల్‌-2లో 45 సెంట్లు, రుషికొండ ఐటీ పార్క్‌లో 4 ఎకరాలు మొత్తంగా ఎకరా రూ.4.05 కోట్లతో 4.45 ఎకరాలు కేటాయించారు.

పేనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.207.5 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీనిద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక బీవీఎం ఎనర్జీ అండ్‌ రెసిడెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఎండాడ వద్ద ఎకరా రూ.1.5 కోట్ల ధరతో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. బీవీఎం ఎనర్జీ సంస్థ రూ.1,250 కోట్ల పెట్టుబడితో 15000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి