సనాతన ధర్మంలో గృహస్తునికి కొన్ని ధర్మలున్నాయని పేర్కొంది. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం, ఆకలి అన్నవారికి భోజనం పెట్టడం వంటివి గృహస్త ధర్మాలే. ఇలా అవసరం ఉన్నవారికి సాయం చేయడం అనేది మంచి కర్మ అని.. ఇటువంటి కర్మలకు శుభఫలితాలు పొందుతారని పురాణాలు పేర్కొన్నాయి. అదే విధంగా ఆకలి అని అడగలేని మూగ జీవులకు సేవ చేయడం, ఆహారాన్ని అందించడం కూడా పుణ్యప్రదమైన కార్యం. పిల్లలు లేని దంపతులు, డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న వారు ఏ రకమైన జీవికి ఎటువంటి ఆహారాన్ని అందిస్తే సమస్యలు తీరతాయో ఈ రోజు తెలుసుకుందాం..