Tdp Mla Naseer Video Viral Social Media,ఓ మహిళతో టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్.. సోషల్ మీడియాలో వైరల్, ఇంతకీ ఎవరామె? – tdp mla mohammed naseer video call with a woman goes viral
Tdp Mla Mohammed Naseer Video Viral Social Media: ఏపీలో మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. రెండున్నర నిమిషాల పాటూ ఆమెతో వీడియో కాల్లో మాట్లాడిన వీడియో ఇది. అయితే ఆమె టీడీపీకి చెందిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నసీర్ స్పందించాల్సి ఉంది.
హైలైట్:
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే నసీర్
మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ
సోషల్ మీడియాలో వీడియో వైరల్
టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్ (ఫోటోలు– Samayam Telugu)
గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. ఒక మహిళతో ఎమ్మెల్యేతో వీడియోలో సైగలు చేస్తూ కనిపించారు. ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తన కార్యాలయంలో ఉండగా.. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా వీడియో కాల్చేసి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో రెండున్నర నిమిషాల వరకు ఉంది. ఆ వీడియోలో ఆడియో వినపడటం లేదు.. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.. అసలు మహిళ ఎవరు.. నసీర్ వీడియో కాల్లో ఏం మాట్లాడారన్నది క్లారిటీ లేదు. ఆమె గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేస్తోంది. ఈ వివాదంపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పందించాల్సి ఉంది.కొన్ని నెలల క్రితం మరో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతున్నట్లుగా వీడియోలు వైరల్ అయ్యాయి.. అయితే ఆ తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. అయితే ఈ వివాదంపై వీడియోలో ఉన్న మహిళ హైకోర్టును ఆశ్రయించారు.. అయితే ఆ వెంటనే ఆమె తన పిటిషన్ను వెనక్కు తీసుకోవడంతో ఈ వివాదం ముగిసింది. తాజాగా మహమ్మద్ నసీర్ వివాదంలో చిక్కుకున్నారు.
మహమ్మద్ నసీర్ టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటిచేసి ఓడిపోయారు.. మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాదు ఇటీవల నసీర్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి 2025-26కి ఉభయ సభల సంయుక్త కమిటీలలో మైనారిటీ వర్గాల సంక్షేమ కమిటీ ఛైర్మన్గా నియమించారు. వక్ఫ్ బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు.
జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు
గతంలో వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ అనంతబాబులు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. వీరు కూడా మహిళలతో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇదంతా కుట్రని ఆ ఇద్దరు నేతలు కొట్టిపారేశారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల్ని కూడా అలాంటి వివాదాలు వెంటాడుతున్నాయి.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి