Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

COOLIE Pre-Release Event: రజినీకాంత్ గారిని చూసి చాలా నేర్చుకున్నా : నాగార్జున

4 August 2025

వంటలకు మాత్రమే కాదు.. బట్టలకు కూడా వెనిగర్ తో మస్తు లాభాలు ఉన్నాయి..!

4 August 2025

Vitamin-D: సప్లిమెంట్స్ ఎందుకు సూర్య రశ్మి ఉండగా.. ఏ సమయంలో విటమిన్ డి అధికంగా ఉంటుందంటే..

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Simhachalam Temple Special Darshan,తిరుమల తరహాలో ఆ ఆలయంలో భక్తులకు అద్భుత అవకాశం.. ఏడాదికి ఒకసారి ప్రత్యేక దర్శనం ఉచితం – simhachalam temple devotees can get special darshan with donation to anna prasadam
ఆంధ్రప్రదేశ్

Simhachalam Temple Special Darshan,తిరుమల తరహాలో ఆ ఆలయంలో భక్తులకు అద్భుత అవకాశం.. ఏడాదికి ఒకసారి ప్రత్యేక దర్శనం ఉచితం – simhachalam temple devotees can get special darshan with donation to anna prasadam

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Simhachalam Temple Special Darshan,తిరుమల తరహాలో ఆ ఆలయంలో భక్తులకు అద్భుత అవకాశం.. ఏడాదికి ఒకసారి ప్రత్యేక దర్శనం ఉచితం – simhachalam temple devotees can get special darshan with donation to anna prasadam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Simhachalam Temple Anna Prasadam Donation: తిరుమల తరహాలో పలు ఆలయాల్లో ఉచిత అన్నప్రసాద పథకం నడుస్తోంది. అయితే సింహాచలం అప్పన్న దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు.. అక్కడ కూడా భక్తులు అన్నప్రసాదానికి విరాళాలు అందజేయొచ్చు. రూ.10వేల పైన విరాళం అందజేస్తే ఆ భక్తులకు స్వామివారి ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు. ఈ మేరకు విరాళాలు అందజేసే భక్తుల్ని నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • తిరుమల తరహాలో అక్కడా అన్నప్రసాదం
  • భక్తులు విరాళాలను అందజేయొచ్చు
  • రూ.10వేల పైన్ అందజేస్తే ప్రత్యేక దర్శనం
సింహాచలం ఆలయం అన్నప్రసాదం విరాళం
సింహాచలం ఆలయం అన్నప్రసాదం విరాళం (ఫోటోలు– Samayam Telugu)

ఏపీలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా పలు ఆలయాల్లో అన్నప్రసాదాన్ని ఉచితంగా భక్తులకు అందిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని ఆలయాల్లో కూడా భక్తులకు ఉచిత అన్నప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అన్నప్రసాదం అందించే ఆలయాల్లో భక్తులు కూడా వారికి తోచిన విధంగా విరాళాలను అందజేయొచ్చు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న స్వామి వారి నిత్య అన్నదాన పథకానికి భక్తులు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. సింహాచలం ఆలయంలో 1989 ఆగస్టు 14న దేవస్థానం ఉద్యోగులు ఈ పథకాన్ని మొదలుపెట్టారు.. ఇప్పటి వరకు (36 ఏళ్లు) భక్తులకు ఆహారం అందిస్తున్నారు. ఈ మేరకు సింహాచలం ఆలయంలో అన్నప్రసాద పథకానికి విరాళాలు ఇచ్చే వారిని నాలుగు రకాలుగా విభజించారు. రూ.లక్షకు పైగా విరాళం ఇచ్చిన వారిని “మహారాజ పోషకులు” అంటారు. రూ.50 వేలకు పైగా విరాళం ఇచ్చిన వారిని “రాజ పోషకులు” అంటారు. రూ.10 వేలు దాటి విరాళం ఇచ్చిన వారిని “పోషకులు” అంటారు. ఇక రూ.1,116 లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చిన వారిని “దాతలు” అంటారు. ఇలా విరాళాలను అందజేసిన వారిని దాతలను గౌరవిస్తారు.. ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

సింహాచలం దేవస్థానం రూ.10 వేలు పైబడి విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేక దర్శనం ఉంటుంది.. ధ్రువపత్రంతో పాటు విరాళం కార్డు అందజేస్తారు. విరాళం ఇచ్చిన రోజున అంతరాలయంలో దర్శనం కల్పిస్తారు.. ఆ తర్వాత ఏడాదికి ఒకసారి స్వామిని దర్శించుకోవచ్చు. వేద పండితులు ఆశీర్వదిస్తారు. స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలతో సత్కరిస్తారు. అలాగే ఏడాదిలో ఒకసారి కుటుంబ సమేతంగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఏడాదిలో ఒకరోజు (భక్తులు కోరిన రోజున) వారి గోత్రనామాలతో అన్నదానం చేస్తారు.. ఆ రోజు దాతల వివరాలను అన్నదాన సత్రంలో బోర్డుపై ప్రదర్శిస్తారు. సింహాచలం ఆలయంలో భక్తులు విరాళాలు సమర్పించడానికి సింహగిరిపై మూడు కౌంటర్లు ఉన్నాయి.. ఆలయం వెలుపల, P.R.O కార్యాలయం, అన్నప్రసాద భవనం దగ్గర ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులు విరాళాలకు సంబంధించిన సమాచారం కావాలంటే 93987 34612 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

సింహాచలం ప్రమాదంపై త్రిసభ్య కమిషన్ రిపోర్ట్.. వారంలో గోడ నిర్మాణం..

సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు విరాళాలను సమర్పిస్తుంటారు.. ఇలా దాదాపు రూ.36.45 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఈ డబ్బులపై వచ్చే వడ్డీ రూ.2 కోట్లతో ఏడాది పొడవునా భక్తులకు అన్నప్రసాదం పెడతారు. సింహాచలం ఆలయానికి భక్తులు ఇచ్చిన విరాళాలను వేరే అవసరాలకు ఉపయోగించరు. రూ.10 వేలు పైబడిన విరాళాలను శాశ్వత పథకం కింద బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. ప్రతి నెలలో లక్షమంది వరకు ఉదయం, సాయంత్రం కలిపి అన్నప్రసాదం అందిస్తున్నారు. ఎవరైనా భక్తులు అన్నప్రసాదం కోసం విరాళాలను అందజేయొచ్చు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి