Simhachalam Temple Anna Prasadam Donation: తిరుమల తరహాలో పలు ఆలయాల్లో ఉచిత అన్నప్రసాద పథకం నడుస్తోంది. అయితే సింహాచలం అప్పన్న దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు.. అక్కడ కూడా భక్తులు అన్నప్రసాదానికి విరాళాలు అందజేయొచ్చు. రూ.10వేల పైన విరాళం అందజేస్తే ఆ భక్తులకు స్వామివారి ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు. ఈ మేరకు విరాళాలు అందజేసే భక్తుల్ని నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
- తిరుమల తరహాలో అక్కడా అన్నప్రసాదం
- భక్తులు విరాళాలను అందజేయొచ్చు
- రూ.10వేల పైన్ అందజేస్తే ప్రత్యేక దర్శనం

సింహాచలం దేవస్థానం రూ.10 వేలు పైబడి విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేక దర్శనం ఉంటుంది.. ధ్రువపత్రంతో పాటు విరాళం కార్డు అందజేస్తారు. విరాళం ఇచ్చిన రోజున అంతరాలయంలో దర్శనం కల్పిస్తారు.. ఆ తర్వాత ఏడాదికి ఒకసారి స్వామిని దర్శించుకోవచ్చు. వేద పండితులు ఆశీర్వదిస్తారు. స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలతో సత్కరిస్తారు. అలాగే ఏడాదిలో ఒకసారి కుటుంబ సమేతంగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఏడాదిలో ఒకరోజు (భక్తులు కోరిన రోజున) వారి గోత్రనామాలతో అన్నదానం చేస్తారు.. ఆ రోజు దాతల వివరాలను అన్నదాన సత్రంలో బోర్డుపై ప్రదర్శిస్తారు. సింహాచలం ఆలయంలో భక్తులు విరాళాలు సమర్పించడానికి సింహగిరిపై మూడు కౌంటర్లు ఉన్నాయి.. ఆలయం వెలుపల, P.R.O కార్యాలయం, అన్నప్రసాద భవనం దగ్గర ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులు విరాళాలకు సంబంధించిన సమాచారం కావాలంటే 93987 34612 నంబర్ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
సింహాచలం ప్రమాదంపై త్రిసభ్య కమిషన్ రిపోర్ట్.. వారంలో గోడ నిర్మాణం..
సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు విరాళాలను సమర్పిస్తుంటారు.. ఇలా దాదాపు రూ.36.45 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఈ డబ్బులపై వచ్చే వడ్డీ రూ.2 కోట్లతో ఏడాది పొడవునా భక్తులకు అన్నప్రసాదం పెడతారు. సింహాచలం ఆలయానికి భక్తులు ఇచ్చిన విరాళాలను వేరే అవసరాలకు ఉపయోగించరు. రూ.10 వేలు పైబడిన విరాళాలను శాశ్వత పథకం కింద బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. ప్రతి నెలలో లక్షమంది వరకు ఉదయం, సాయంత్రం కలిపి అన్నప్రసాదం అందిస్తున్నారు. ఎవరైనా భక్తులు అన్నప్రసాదం కోసం విరాళాలను అందజేయొచ్చు.