Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Mrunal Thakur: సింపుల్‌గా కనిపించినా.. తన బర్త్‌ డే పార్టీలో మృణాళ్ ధరించిన ఈ డ్రెస్ ఎన్ని లక్షలో తెలుసా?

4 August 2025

COOLIE Pre-Release Event: రజినీకాంత్ గారిని చూసి చాలా నేర్చుకున్నా : నాగార్జున

4 August 2025

వంటలకు మాత్రమే కాదు.. బట్టలకు కూడా వెనిగర్ తో మస్తు లాభాలు ఉన్నాయి..!

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Father Avoid Footwear From 10 Years For Son,తిరుమల వెంకన్న సాక్షిగా.. పదేళ్లుగా చెప్పులు వేసుకోని తండ్రి.. మూడో ప్రయత్నంలో కొడుకు సక్సెస్ చూసి – father didnt wear shoes until son got police constable job in tirupati district
ఆంధ్రప్రదేశ్

Father Avoid Footwear From 10 Years For Son,తిరుమల వెంకన్న సాక్షిగా.. పదేళ్లుగా చెప్పులు వేసుకోని తండ్రి.. మూడో ప్రయత్నంలో కొడుకు సక్సెస్ చూసి – father didnt wear shoes until son got police constable job in tirupati district

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Father Avoid Footwear From 10 Years For Son,తిరుమల వెంకన్న సాక్షిగా.. పదేళ్లుగా చెప్పులు వేసుకోని తండ్రి.. మూడో ప్రయత్నంలో కొడుకు సక్సెస్ చూసి – father didnt wear shoes until son got police constable job in tirupati district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirupati Father Avoid Footwear From 10 Years: తన కొడుకు పోలీసు అధికారి కావాలని ఆ తండ్రి కలలు కన్నారు. కొడుకు ఉద్యోగం వచ్చే వరకు చెప్పులు వేసుకోనని తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. దాదాపు పదేళ్లుగా చెప్పులు లేకుండానే ఉన్నారు.. కొడుకు రెండుసార్లు పరీక్షల్లో ఫెయిల్ అయినా, మూడో ప్రయత్నంలో పోలీసు ఉద్యోగం సాధించాడు. దీంతో తిరుపతి జిల్లాకు చెందిన ఆ తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

హైలైట్:

  • కొడుకు కోసం చెప్పులు వేసుకోని తండ్రి
  • పదేళ్లుగా చెప్పులు లేకుండానే తిరిగారు
  • చివరికి కొడుకు లక్ష్యం నేరవేరడంతో
పదేళ్లుగా కొడుకు కోసం చెప్పులు వేసుకోని తండ్రి
పదేళ్లుగా కొడుకు కోసం చెప్పులు వేసుకోని తండ్రి (ఫోటోలు– Samayam Telugu)

కొడుకు కోసం పదేళ్లుగా తండ్రి చెప్పులు వేసుకోలేదు.. నా కొడుకు అనుకున్నది సాధించే వరకు చెప్పులు వేసుకోను అంటూ ఛాలెంజ్ చేశారు. ఒకటి, రెండు ప్రయత్నాల్లో కొడుకు సక్సెస్ కాలేదు.. అయితే చివరికి కొడుకు లక్ష్యం నెరవేరడంతో పదేళ్ల తర్వాత చెప్పులు ధరించాడు ఆ తండ్రి. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా.. తిరుపతి జిల్లాకు చెందిన ఓ తండ్రి, కొడుకుల స్టోరీ.. గంగిరెడ్డిపల్లి పంచాయతీ పద్మావళిపురానికి చెందిన రఘు, రాజేశ్వరి భార్యాభర్తలు.. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రఘుకు భూమి లేకపోయినా పాల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించారు. ప్రతి రోజూ వేకువజామునే పాలు తీసి తిరుపతికి వెళ్లి విక్రయించేవాడు.. ఇలా ఇద్దరు కొడుకుల్ని కష్టపడి చదివించారు.పెద్దకుమారుడు మునికుమార్‌ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశారు.. 2010, 2011, 2012లో ప్రయత్నించి విఫలమయ్యారు. పెద్ద కుమారుడికి పోలీస్ ఉద్యోగం రాకపోవడంతో ఆ తండ్రి చిన్నకుమారుడు చిరంజీవిపై ఆశలు పెట్టుకున్నారు.. చిన్న కొడుకును పోలీస్‌‌గా చూడాలని కలలు కన్నారు. తన కొడుక్కు పోలీస్ ఉద్యోగం రావాలని తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు.. తన కుమారుడికి ఉద్యోగం వచ్చేవరకు చెప్పులు ధరించకూడదు అనుకున్నారు. అయితే చిరంజీవి రెండు ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు.. మూడో ప్రయత్నంలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఇటీవల విడుదల చేసిన చిరంజీవి కానిస్టేబుల్‌ పరీక్షలో 139 మార్కులు సాధించడంతో పాటుగా.. ఏకంగా జిల్లాలో11వ ర్యాంకు కూడా వచ్చింది.

గండికోటను సందర్శించిన సీఎం చంద్రబాబు.. అబ్బో ఇన్ని సమస్యలు ఉన్నాయా!

చిరంజీవి ఎంబీఏ పూర్తి చేశారు.. 2016, 2018 సంవత్సరాల్లో కానిస్టేబుల్‌ పరీక్ష రాసినా ఒక్క మార్కు తేడాతో ఉద్యోగానికి దూరమయ్యారు. అలాగే ఎస్సై పోస్ట్ కోసం పరీక్షలు రాసినా.. కొద్దిలో తప్పిపోయింది. తాజాగా విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఉద్యోగాన్ని సంపాదించారు. కుమారుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికకావడంతో తండ్రి రఘు ఆనందంలో ఉన్నారు. పదేళ్ల క్రితం వదిలేసిన చెప్పులు ఇప్పుడు తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించి ధరించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసి ఎదిగానని.. వారి కష్టాలను తీర్చేందుకు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నించానన్నారు చిరంజీవి. రెండుసార్లు ఉద్యోగం రాకపోయినా నిరాశచెందకుండా తన సోదరుడి సహకారంతో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించినట్లు చిరంజీవి చెబుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి