Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ENG : ఇదే ఫస్ట్ కాదు.. ఇంతకు ముందు కూడా భారత్ ఇలాగే గెలిచింది

4 August 2025

Isabgol Benefits: మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. సైలియం పొట్టు చక్కటి పరిష్కారం.. ఎలా తీసుకోవాలంటే..

4 August 2025

రూ.500 నోట్లు బంద్‌..? బ్యాంక్‌కు పరుగులుపెట్టిన ప్రజలు.. కేంద్రం క్లారిటీ!

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Farmer Gps Tracker Thieves Anantapur,డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు.. రాత్రి పూట జరిగే యవ్వారాన్ని కనిపెట్టేశాడుగా! – ap farmer uses gps to track down thieves who stole drip pipe at penukonda in anantapur district
ఆంధ్రప్రదేశ్

Farmer Gps Tracker Thieves Anantapur,డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు.. రాత్రి పూట జరిగే యవ్వారాన్ని కనిపెట్టేశాడుగా! – ap farmer uses gps to track down thieves who stole drip pipe at penukonda in anantapur district

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Farmer Gps Tracker Thieves Anantapur,డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు.. రాత్రి పూట జరిగే యవ్వారాన్ని కనిపెట్టేశాడుగా! – ap farmer uses gps to track down thieves who stole drip pipe at penukonda in anantapur district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Farmer uses GPS to track down thieves: తన పొలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు అతన్ని ఆవేదనకు గురిచేశాయి. పదే పదే తన పొలంలోని డ్రిప్పు పైపులను చోరీచేస్తున్న వారి సంగతి చూడాలనుకున్నాడు. గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవటంతో ఈసారి తనే సొంతంగా ప్లాన్ చేసుకున్నాడు. పక్కాగా ప్లాన్ అమలు చేసి.. చోరీ చేసిన వ్యక్తులను పట్టేసుకున్నాడు. పోలీసులకు అప్పగించాడు. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన అశోక్ రెడ్డి అనే రైతు చేసిన పనిపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు.. రాత్రి పూట జరిగే యవ్వారాన్ని కనిపెట్టేశాడుగా!
డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు.. రాత్రి పూట జరిగే యవ్వారాన్ని కనిపెట్టేశాడుగా! (ఫోటోలు– Samayam Telugu)

Farmer uses GPS to track down thieves: ఎండనకా, వాననకా, పగలనకా, రేయనకా.. వానలొచ్చినా, వారదలొచ్చినా.. వరుణ దేవుడు ముఖం చాటేసినా, రేపటి మీద నమ్మకంతో, భవిష్యత్ మీద భరోసాతో.. వచ్చే అత్తెసరు లాభం కోసం నిరంతరం శ్రమించే వాడే.. రైతు. అందుకే రైతును దేశానికి వెన్నెముక అని అంటారు. పరీక్షల్లో ఒక్కసారి, రెండుసార్లు తప్పితేనే డీలా పడిపోతారు నేటి విద్యార్థులు.. ఒకట్రెండు ప్రయత్నాల్లో ఉద్యోగం రాకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది యువత. కానీ కాలం ఎన్నిసార్లు ఎదురుతన్నినా.. హలం వదలని ధీశాలి, ధైర్యశాలి, ఆత్మవిశ్వాసం పుణికిపుచ్చుకున్నవాడే అన్నదాత.. అలాంటి రైతును తక్కువగా అంచనా వేశారు కొంతమంది దొంగలు. కానీ ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో.. చేసి చూపించాడు ఆ రైతు.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఆ రైతు చేసిన పని ఇప్పుడు స్థానికంగా ప్రశంసలు కురిపిస్తోంది..

*పైకి నవ్వుతూ కనిపించే హెచ్ఆర్ ఉద్యోగం.. లోపల మాత్రం.. భర్తే అనుకుంటే, మామ కూడానా?

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సత్తారుపల్లికి చెందిన అశోక్‌రెడ్డికి కొంత వ్యవసాయ పొలం ఉంది. అందులో పంటలు సాగుచేస్తుంటారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో మొక్కజొన్న వేయాలని నిర్ణయించుకున్నారు. మొక్కజొన్న నాటేందుకు కూలీలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే అదే రోజు రాత్రి అశోక్ రెడ్డి పొలంలో దొంగలు పడ్డారు. పొలంలో ఉన్న డ్రిప్పు పైపును చోరీ చేశారు. అయితే అశోక్ రెడ్డి పొలంలో డ్రిప్పు పైపులు, కేబుల్ వైర్లు చోరీ చేయడం అదే మొదటిసారి కాదు. 2020లో ఓసారి, 2022 సంవత్సరంలో మరోసారి కూడా ఇలాగే పొలంలో ఉన్న డ్రిప్పు పైపులు చోరీకి గురయ్యాయి. లక్ష రూపాయలు విలువ చేసే డ్రిప్పు పైపులు దొంగతనం కావటంతో గతంలో అశోక్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో ఒకటికి మూడుసార్లు తన పొలంలో డ్రిప్పులు చోరీకి గురౌతూ ఉండటంతో.. ఈసారి ఎలాగైనా దొంగలను పట్టుకోవాలని తానే ప్లాన్ చేశారు అశోక్ రెడ్డి..

*దివ్యాంగులకు శుభవార్త.. పూర్తి ఉచితంగా, రూపాయి కట్టక్కర్లేదు.. మూడ్రోజులే ఛాన్స్..

లెక్చరర్‌కు షాకిచ్చిన అమ్మాయి.. ప్రియుడితో కలిసి

ఇంటర్నెట్‌లో వెతికి జీపీఎస్ ట్రాకర్ కొనుగోలు చేశారు. ఈ జీపీఎస్‌ను డ్రిప్పు పైపు మధ్యలో ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలియని దొంగలు శనివారం రాత్రి చోరీకి వచ్చి మనోడు వేసిన ప్లాన్‌తో అడ్డంగా దొరికిపోయారు. పొలంలో ఉన్న డ్రిప్పు పైపులను శనివారం రాత్రి దొంగలు చోరీ చేశారు. ఆదివారం ఉదయాన్నే పొలానికి వచ్చిన అశోక్ రెడ్డి.. పైపులు చోరీ అయిన విషయం గుర్తించారు. వెంటనే జీపీఎస్ సాయంతో ఎక్కడ వెళ్తున్నాయనే సంగతి తెలుసుకున్నారు.

*ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలు గుర్తించుకోవాల్సిన రూల్స్ ఇవే..

ఇతర రైతుల సాయంతో ఎన్ఎస్ గేట్ సమీపంలో ఉన్న వాహనాన్ని, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అశోక్ రెడ్డి పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నా్రు. మరోవైపు ఇప్పటి వరకూ తమ పొలాల్లో చోరీ అయిన డ్రిప్పు పైపులను రికవరీ చేయించి ఇవ్వాలని మిగతా రైతులు పోలీసులను కోరుతున్నారు. అయితే ఆ చోరీలు కూడా వీరి పనేనా, వేరే వారి హస్తం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి