Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!

4 August 2025

Kohinoor: కోహినూర్‌ పుట్టింది ఎక్కడ ?? అది బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది ??

4 August 2025

IND vs ENG : భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో తోపులు వీళ్లే.. టాప్ 1లో మనోడే

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Free Bus For Ladies In Ap Latest News,AP Free Bus: ఆగస్ట్ 15 నుంచి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 3 రోజుల ముందు ఏంటిది? – apsrtc nmua workers calls for dharna on august 12 and 13th before free bus travel scheme for women
ఆంధ్రప్రదేశ్

Free Bus For Ladies In Ap Latest News,AP Free Bus: ఆగస్ట్ 15 నుంచి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 3 రోజుల ముందు ఏంటిది? – apsrtc nmua workers calls for dharna on august 12 and 13th before free bus travel scheme for women

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Free Bus For Ladies In Ap Latest News,AP Free Bus: ఆగస్ట్ 15 నుంచి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 3 రోజుల ముందు ఏంటిది? – apsrtc nmua workers calls for dharna on august 12 and 13th before free bus travel scheme for women
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


APSRTC NMUA Workers calls for dharna: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభానికి అడుగులు చక చకా పడుతున్నాయి. ఆగస్ట్ 15 నుంచి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించునున్నారు. ఇందుకోసం ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి.. అందులో ఏ బస్సుల కండీషన్ ఎలా ఉందనే దానిపై సమీక్షలు, కసరత్తులు జరుపుతున్నారు. అయితే ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు కానుండగా.. అందుకు మూడు రోజుల ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆగస్ట్ 15 నుంచి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆగస్ట్ 15 నుంచి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (ఫోటోలు– Samayam Telugu)

APSRTC NMUA Workers calls for dharna: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్న సంగతి తెలిసిందే. స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులు కసరత్తు జరుపుతున్నారు. మరో పదిరోజుల్లో పథకం అమలు చేయనున్న నేపథ్యంలో డిపోలో అందుబాటులో ఉన్న బస్సుల వివరాలు, ఏ మేరకు కండీషన్‌లో ఉన్నాయనే దానిపై దృష్టిసారించారు. అయితే ఆగస్ట్ 15వ తేదీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్న వేళ.. ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగుతూ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

*ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలు గుర్తించుకోవాల్సిన రూల్స్ ఇవే..

ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన సెటిల్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాలు చేపట్టనున్నారు. ఈ డిమాండ్లతో పాటుగా ఆర్టీసీ సంస్థ ఆస్తులను పరిరక్షించాలంటూ ఆగస్ట్ 12, 13 తేదీలలో ధర్నాలకు దిగుతున్నట్లు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (NMUA) ఆదివారం ప్రకటన జారీ చేసింది. ఈ డిమాండ్లతో ఆగస్ట్ 12, 13వ తేదీలలో రాష్ట్రంలోని అన్ని యూనిట్ల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు ఎన్ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. విజయవాడలో లులు మాల్ ఏర్పాటు కోసం ఆర్టీసీ స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు విలువచేసే సంస్థ ఆస్తులను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని ఎన్ఎంయూఏ డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరింది.

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏయే బస్సులలో అంటే?

మహిళా సాధికారతను ప్రోత్సహించడంతో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయనుంది. ఏపీఎస్ఆర్టీసీ వద్ద ప్రస్తుతం 11,449 బస్సులు ఉన్నాయి. వీటిలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసే బస్సులు అయిన.. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల వాటా 8,548 (74 శాతం). ఈ బస్సులతో పాటుగా విద్యార్థుల కోసం ఆర్టీసీ నడుపుతున్న బస్సులు, డిపోలలోని స్పేర్ బస్సులను కూడా పథకం కోసం ఉపయోగించనున్నారు.

టికెట్ తీసుకోమంటే.. చంద్రబాబు వీడియో చూపించారు.. ఇదేందమ్మా?

ఉచిత బస్సు ప్రయాణం – కావాల్సిన గుర్తింపు పత్రాలు

ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కోసం గుర్తింపు కార్డులు తప్పనిసరి. కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి వాటితో మహిళలు నిర్దేశించిన బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. పథకం అమల్లో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. ఈ టికెట్లలో ప్రయాణ వివరాలు, ఎంత డబ్బులు ఆదా అయ్యాయనే వివరాలు పొందుపరచనున్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలు అందరికీ ఈ పథకం వర్తింపచేయనున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి