Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips: వామ్మో.. రాత్రిపూట పెరుగు తింటే ఇన్ని సమస్యలా..? తెలిస్తే షాకే..

4 August 2025

Saudi Arabia: సౌదీలో ఆ పని చేస్తే.. ఉరిశిక్షే..!

4 August 2025

Shubman Gill: ఒకే సిరీస్‌తో ఆ దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేసి గిల్.. ఇంకా ఎన్నో అద్భుతాలు..

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Whatsapp Governance Number,ఇక గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు.. అన్నీ ఇంటి నుంచే.! – ap government plans to increase mana mitra whatsapp governance services to 700 by august 15
ఆంధ్రప్రదేశ్

Ap Whatsapp Governance Number,ఇక గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు.. అన్నీ ఇంటి నుంచే.! – ap government plans to increase mana mitra whatsapp governance services to 700 by august 15

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Whatsapp Governance Number,ఇక గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు.. అన్నీ ఇంటి నుంచే.! – ap government plans to increase mana mitra whatsapp governance services to 700 by august 15
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో పౌరసేవలను 700లకు పెంచాలని నిర్ణయించింది. ఆగస్ట్ 15వ తేదీ నాటికి 700 పౌర సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను జనవరిలో ప్రారంభించారు. 161 సేవలతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం కాగా.. ఈ సేవలను క్రమంగా వేయికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు.. అన్నీ ఇంటి నుంచే.!
ఇక గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు.. అన్నీ ఇంటి నుంచే.! (ఫోటోలు– Samayam Telugu)

పాలనలో టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో పౌరసేవలు సెల్ ఫోన్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 500 వరకూ పౌరసేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నారు. అయితే ఆగస్ట్ 15వ తేదీ నాటికి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల సంఖ్యను 700లకు పెంచాలని నిర్ణయించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులను ఆదేశించారు. 9552300009 నంబర్ ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు, ప్రజలకు రేషన్ కార్డుల సేవలు, తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకం స్టేటస్, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకునే వెసలుబాటు కల్పించారు.

*ఏపీలోని కల్లుగీత కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

అలాగే ఆర్టీసీ బస్ టికెట్ల నుంచి దేవాలయాల సేవల వరకూ.. రెవెన్యూ సేవల నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపుల వరకూ అనేక సేవలు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నారు. 2025 జనవరిలో 161 సేవలతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ మొదలైంది. క్రమంగా ఈ సేవల సంఖ్యను ప్రస్తుతం 500లకు చేర్చారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ఈ సంఖ్యను 700 సేవలకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..

*ఏపీలో ఆ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు.! కనీసం రూ.5 లక్షలు ఆదా..

మరోవైపు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ శాఖలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. అలాగే కుటుంబాలను యూనిట్‌గా తీసుకుని పథకాలు రూపొందించాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,871 సాధించాలని.. అలాగే 2029 నాటికి రూ. 5.42 లక్షలు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

*డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు.. రాత్రి పూట జరిగే యవ్వారాన్ని కనిపెట్టేశాడుగా!

అలాగే ఒక కంపెనీలో తయారైన వేస్టేజీ మరో కంపెనీలో ముడిసరుకుగా ఉపయోగపడేలా సర్క్యులర్ ఎకానమీ రూపొందించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా మార్చేలా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని.. ఆ దిశగా స్వల్ప, మధ్య, దీర్ఘ స్థాయి లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని చంద్రబాబు సూచించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి