Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ENG: ఓవల్ టెస్ట్ హీరోకి ఊహించని సర్‌ప్రైజ్.. కాసుల వర్షం కురిపించిన బీసీసీఐ.. ఎంతంటే?

5 August 2025

Target BRS: ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా.. ముప్పేట దాడితో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..!

5 August 2025

Business Ideas: ఉద్యోగం పోయిందా.? డోంట్ వర్రీ.. ఈ వ్యాపారంతో నెలకు రూ. 2 లక్షల వరకు గ్యారంటీ

5 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Students Free Neet Iit Coaching,ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. వారందరికి ఉచితంగా ‘నీట్‌, ఐఐటీ’ శిక్షణ.. వివరాలివే – andhra pradesh government provides free neet and iit coaching for students studying in gurukuls
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Students Free Neet Iit Coaching,ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. వారందరికి ఉచితంగా ‘నీట్‌, ఐఐటీ’ శిక్షణ.. వివరాలివే – andhra pradesh government provides free neet and iit coaching for students studying in gurukuls

.By .5 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Students Free Neet Iit Coaching,ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. వారందరికి ఉచితంగా ‘నీట్‌, ఐఐటీ’ శిక్షణ.. వివరాలివే – andhra pradesh government provides free neet and iit coaching for students studying in gurukuls
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Free NEET IIT Coaching: తల్లిదండ్రులు తమ పిల్లలను NEET, IIT శిక్షణ కోసం కార్పొరేట్ కాలేజీల్లో చేర్చాలని అనుకుంటున్నారు. కొందరు లక్షలు పెట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తున్నారు. అయితే అందరి దగ్గర డబ్బులు ఉండవు. అందుకే పేద పిల్లల కోసం ప్రభుత్వం IIT, NEET కోచింగ్ ఇస్తోంది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో ప్రత్యేక తరగతులు మొదలు పెట్టింది.ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ తరగతులు మొదలయ్యాయి.

హైలైట్:

  • ఏపీలో విద్యార్థులకు తీపికబురు
  • ఉచితంగా నీట్, ఐఐటీలో శిక్షణ
  • గురుకులాల్లో ప్రత్యేక తరగతులు
ఆంధ్రప్రదేశ్ ఉచితంగా నీట్ ఐఐటీ శిక్షణ
ఆంధ్రప్రదేశ్ ఉచితంగా నీట్ ఐఐటీ శిక్షణ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో తల్లిదండ్రులు నీట్, ఐఐటీలో సీట్ల కోసం ప్రయత్నిస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలని కోరుకుంటారు. వైద్య వృత్తిలో స్థిరపడాలని ఆశిస్తారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తారు.. కానీ పేదవాళ్లు ఆ ఫీజులు కట్టే ఆర్థిక పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో పేద పిల్లలకు కూడా IIT, NEETకు సంబంధించి శిక్షణకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నుంచి గురుకులాల్లో ప్రత్యేక తరగతులు మొదలు పెడుతున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లోనిగురుకులాలలో IIT, నీట్ శిక్షణను మళ్ళీ ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం బాలికల గురుకులంలో IIT, నీట్ శిక్షణ కోసం ప్రత్యేక తరగతులు ఉన్నాయి. ఒక్కో తరగతిలో 40 మంది విద్యార్థినులు ఉంటారు. మొత్తం 160 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. వీళ్ళని సీనియర్, జూనియర్ బ్యాచ్‌లుగా విభజించారు. గతంలో గురుకుల పాఠశాలల్లో చదివిన వాళ్ళు, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్లకు పరీక్ష పెట్టారు. పరీక్షలో ప్రతిభ చూపించినవారిని IIT, నీట్ శిక్షణకు ఎంపిక చేశారు. ఇంటర్ విద్యార్థులకు వేరే తరగతులు జరుగుతున్నాయి.. IIT, నీట్ చదివే వాళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

ఈ మేరకు ప్రభుత్వం నీట్, ఐఐటీ కోచింగ్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమిస్తోంది. ఇంటర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లతో శిక్షణ ఇస్తే సరిగ్గా ఫలితాలు రావట్లేదు. అందుకే ప్రత్యేకంగా బోధించేవాళ్లను తీసుకుంటున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉన్న లెక్చరర్లను తీసుకుంటున్నారు. బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు ఇద్దరిని, మ్యాథ్స్ కు ఒకరిని తీసుకుంటారు. ప్రభుత్వ కళాశాలల్లో నీట్, ఐఐటీ వంటి పరీక్షలకు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

పేద విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో చదివే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వ కాలేజీల్లో కార్పొరేట్ కళాశాలల స్థాయిలో శిక్షణ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. దీని ద్వారా నీట్, ఐఐటీ వంటి పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించవచ్చు అంటున్నారు. పేద విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. పేద పిల్లలు ఈ శిక్షణ తీసుకుంటే చాలా ఖర్చు అవుతుందని.. అలాంటి వారికి ఉచితంగా శిక్షణ అందించడ మంచి నిర్ణయం అంటున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి