Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Amarnath Yatra 2025: అమర్‌నాథ్ యాత్ర విధుల్లో ఉన్న అధికారులు జమ్మూకు తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశాలు.. ఎందుకంటే

5 August 2025

Ind vs Eng: రికార్డులే కాదు అంతకుమించి.. చరిత్రకే వణుకు పుట్టించిన టెండూల్కర్ – ఆండర్సన్ ట్రోఫీ

5 August 2025

Tollywood : ఎంప్లాయిస్ ఫెడరేషన్ Vs ప్రొడ్యూసర్స్.. చర్చలు కొలిక్కి వచ్చేనా..?

5 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Rains,ఏపీలో మరోసారి భారీ వర్షాలు.. ఈ జిల్లాలను హెచ్చరించిన వాతావరణశాఖ – imd predicts andhra pradesh weather report that heavy to moderate rains in these districts for next three days
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Rains,ఏపీలో మరోసారి భారీ వర్షాలు.. ఈ జిల్లాలను హెచ్చరించిన వాతావరణశాఖ – imd predicts andhra pradesh weather report that heavy to moderate rains in these districts for next three days

.By .5 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Rains,ఏపీలో మరోసారి భారీ వర్షాలు.. ఈ జిల్లాలను హెచ్చరించిన వాతావరణశాఖ – imd predicts andhra pradesh weather report that heavy to moderate rains in these districts for next three days
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Weather Today: ఏపీలో గత నెలలో కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి.. గత ఒకటి, రెండు రోజులుగా వానలు మళ్లీ ఊపందుకున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షలు కురుస్తున్నాయి.. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతంది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయంటున్నారు. వచ్చే మూడు రోజులు ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణశాఖ అధికారుల.

హైలైట్:

  • ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక
  • మూడు రోజుల పాటూ వర్షాలు
  • ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉత్తర తమిళనాడు దగ్గర నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు, ఉత్తర తమిళనాడు మీదుగా బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 36 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడుతున్నాయి.. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి. అటు వర్షాలు పడుతుంటే.. కోస్తాలోని పలు జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి.. అయితే మంగళవారం నుంచి రాయలసీమ, కోస్తాలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బుధవారం కూడా కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయని.. . కొన్ని చోట్ల భారీ వానలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. శుక్రవారం వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తూనే ఉంటాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.

‘మంగళవారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పిడుగుపాటు సమయంలో చెట్ల క్రింద ఉండరాదని హెచ్చరించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి నెల్లూరు జిల్లా వెలగపాడులో 73మిమీ, చిత్తూరు జిల్లా యడమర్రిలో 67మిమీ, నెల్లూరు జిల్లా గుడ్లదోనలో 57.5మిమీ కాకినాడ జిల్లా కరపలో 51మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన భారీ వాహనాలు

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 97.6 మిల్లీ మీటర్లు, నంద్యాల జిల్లా కోయిలకుంట్లలో 65.8, ప్రకాశం జిల్లా పొదిలిలో 65.4, పార్వతీపురంలో 64.5, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 61.2, చిత్తూరు జిల్లా పుంగనూరులో 52.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పార్వతీపురం జిల్లా కొమరాడలో 40, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 40 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి