Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి తెలుగబ్బాయ్ ఔట్.. రంగంలోకి గంభీర్ ప్రియ శిష్యుడు ఎంట్రీ..

5 August 2025

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. మూడు రోజులు బ్యాంకులు బంద్‌!

5 August 2025

Andhra: ఫస్ట్‌నైట్ కోసం స్వీట్లు తెచ్చేందుకు వెళ్లిన వరుడు.. తిరిగి గదిలోకి వచ్చే సరికి..

5 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Talliki Vandanam Scheme 2025 Payment In September,ఏపీలో తల్లికి వందనం డబ్బులు రాలేదా.. మీకో శుభవార్త, కీలకమైన అప్డేట్ – talliki vandanam scheme 2025 pending students problems will solve and payment likely release in september
ఆంధ్రప్రదేశ్

Talliki Vandanam Scheme 2025 Payment In September,ఏపీలో తల్లికి వందనం డబ్బులు రాలేదా.. మీకో శుభవార్త, కీలకమైన అప్డేట్ – talliki vandanam scheme 2025 pending students problems will solve and payment likely release in september

.By .5 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Talliki Vandanam Scheme 2025 Payment In September,ఏపీలో తల్లికి వందనం డబ్బులు రాలేదా.. మీకో శుభవార్త, కీలకమైన అప్డేట్ – talliki vandanam scheme 2025 pending students problems will solve and payment likely release in september
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Talliki Vandanam Scheme 2025 Payment Update: తల్లికి వందనం పథకం అందక రాష్ట్రవ్యాప్తంగా తల్లులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ మేరకు వారి నుంచి అధికారులు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. కొందరు విద్యార్థులకు అర్హుల జాబితాలో పేరు ఉన్నా డబ్బులు రాలేదు.. ఇలా అన్ని సమస్యల్ని పరిశీలించి పరిష్కరించే పనిలో ఉన్నారు. వివిధ కారణాలతో డబ్బులు రాని వాళ్ల అప్లికేషన్లను పరిశీలించి వచ్చే నెలలో డబ్బులు జమ చేస్తామని చెబుతున్నారు.

హైలైట్:

  • ఏపీలో తల్లికి వందనం పథకం
  • డబ్బులు రానివారికి అలర్ట్
  • దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు
ఏపీలో తల్లికి వందనం 2025
ఏపీలో తల్లికి వందనం 2025 (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెలలో తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. ఒక్కో విద్యార్థి అకౌంట్‌లో రూ.13వేల చొప్పున జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు విడతల్లో విద్యార్థులకు డబ్బులు జమ చేసినా.. ఇప్పటికీ చాలామందికి డబ్బులు అకౌంట్‌లలో జమ కాలేదు. ఉచిత విద్యా పథకం కింద ప్రైవేటు స్కూళ్లలో సీట్లు పొందిన విద్యార్థుల అన్న/తమ్ముడు/అక్క, చెల్లికి కూడా డబ్బులు అందలేదు. తల్లికి వందనం డబ్బులు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. నెలకి 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు రావడం, ఐటీ రిటర్న్స్ సమర్పించడం, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు అనుసంధానం కాకపోవడంవంటి కారణాలు ఉన్నాయి. కొందరికి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నా సరే డబ్బులు జమకాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా శాఖ కార్యాలయంతో పాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.అర్హులైన విద్యార్థులలకు విద్యుత్ మీటర్ల సమస్య కారణంగా డబ్బులు జమకాలేదని చెబుతున్నారు.. ఒకే మీటర్ ఉండటం వల్ల 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతోంది. దీనివల్ల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అర్హులైన విద్యార్థులకు డబ్బులు ఎందుకు జమ కాలేదని అధికారులు పరిశీలించారు. ఆన్‌లైన్‌లో స్టేటస్ చూస్తే కొన్ని కారణాలు కనిపించాయి. చాలా చోట్ల ఇళ్లల్లో అద్దెకు ఉండేవారు ఒకే విద్యుత్ మీటర్ వాడుతున్నారు. ఒకే మీటర్ ఉండటంతో విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతోంది. నెలకి 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నారు. దీనివల్ల పిల్లల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. వేర్వేరుగా విద్యుత్ మీటర్లు పెట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పాఠశాల విద్యా శాఖకు తెలియజేశారు.

ఉచిత విద్య కింద సీట్లు పొందిన విద్యార్థుల తోబుట్టువులకు పథకం రాకపోతే పాఠశాలలను తనిఖీ చేస్తామని అధికారులు తెలిపారు. ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలకు “తల్లికి వందనం” డబ్బులు జమ కావడం కష్టమే అంటున్నారు. ఇతర కారణాల వల్ల డబ్బులు జమ కాని తల్లుల సమస్యలను పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నామని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. సమస్యలు పరిష్కరించి.. అర్హత ఉన్నవారికి వచ్చే నెలలో డబ్బులు అందని వారికి జమ అవుతాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Thalliki vandanam status check: తల్లికి వందనం రాలేదా, అకౌంట్లో డబ్బులు పడలేదా, ఏం చేయాలంటే?

ఒకవేళ తల్లికి వందనానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు.. దరఖాస్తుల్ని పరిశీలించి సమస్యల్ని పరిష్కరిస్తామంటున్నారు. ఇప్పటికే పలువురు దరఖాస్తుల్ని అందజేశారు.. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం మీద తల్లికి వందనం పథకానికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తోంది ప్రభుత్వం. అలాగే కొంతమంది ఎస్సీ విద్యార్థులకు డబ్బులు పెండింగ్ ఉన్నాయి.. ఈ డబ్బులు కూడా ఈ నెలలోనే విడుదలవుతాయని చెబుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి