Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Mayasabha: దేవా కట్ట “మయసభ”లో వంగవీటి రంగా పాత్ర ఎంత.? ఎవరిది.?

5 August 2025

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి తెలుగబ్బాయ్ ఔట్.. రంగంలోకి గంభీర్ ప్రియ శిష్యుడు ఎంట్రీ..

5 August 2025

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. మూడు రోజులు బ్యాంకులు బంద్‌!

5 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Discount On Lrs Scheme Fees,ఏపీ ప్రభుత్వం బంపరాఫర్.. ఆ ఫీజులపై రాయితీ ఇస్తున్నారు, త్వరపడండి – andhra pradesh government offers discount on lrs scheme fees
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Discount On Lrs Scheme Fees,ఏపీ ప్రభుత్వం బంపరాఫర్.. ఆ ఫీజులపై రాయితీ ఇస్తున్నారు, త్వరపడండి – andhra pradesh government offers discount on lrs scheme fees

.By .5 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Discount On Lrs Scheme Fees,ఏపీ ప్రభుత్వం బంపరాఫర్.. ఆ ఫీజులపై రాయితీ ఇస్తున్నారు, త్వరపడండి – andhra pradesh government offers discount on lrs scheme fees
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Lrs Scheme Fees Discount: ఏపీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది.. ఈ మేరకు లేఅవుట్ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. ఈ మేరకు 90 రోజుల గడువు కూడా ఇచ్చింది..ఈ మేరకు మరో కీలక ప్రకటన చేశారు. లేఅవుట్ క్రమబద్దీకరణకు సంబంధించి ఫీజులపై రాయితీ కూడా ప్రకటించింది. ఫీజుల్ని చెల్లించినవారికి ఏకంగా 10శాతం డిస్కైంట్ ప్రకటించారు. అయితే కొన్ని స్థలాలను మాత్రం క్రమబద్దీకరణకు అంగీకరించేది లేదని ప్రభుత్వం తెలిపింది.

హైలైట్:

  • ఏపీలో LRS పథకం అమలు
  • దరఖాస్తుకు 90 రోజుల గడువు
  • ఫీజులపైనా రాయితీ ఉంది
ఏపీలో గడువు లోపు ఎల్ఆర్ఎస్‌ చేస్కోండి
ఏపీలో గడువు లోపు ఎల్ఆర్ఎస్‌ చేస్కోండి (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్‌ఆర్ఎస్‌ (లేఅవుట్ క్రమబద్ధీకరణ)కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా (ఎల్‌ఆర్‌ఎస్‌) కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. జులై 26న నోటిఫికేషన్ జారీ కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి 90 రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువులోగా దరఖాస్తు చేసుకోకపోతే.. ఆ తర్వాత అనుమతించేది లేదని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2025 జూన్ 30కి ముందు రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లు మాత్రమే క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని తెలిపారు సురేష్ కుమార్. ప్లాట్ యజమానులు, కాలనీ సంక్షేమ సంఘాలు, డెవలపర్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.ఒక్క ప్లాట్ అయినా కటాఫ్ తేదీకి ముందు అమ్మితే.. లేఅవుట్ మొత్తం క్రమబద్ధీకరణకు అర్హత సాధిస్తుంది. అమరావతి రాజధాని ప్రాంతం మినహా మిగిలిన మున్సిపాల్టీలు, పట్టణాభివృద్ధి సంస్థలు, మాస్టర్‌ప్లాన్ గల గ్రామ పంచాయతీల్లో నిబంధనలకు లోబడి లేఔట్‌లు క్రమబద్ధీకరించుకోవచ్చు. కాబట్టి అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫీజులను కట్టడానికి ప్రభుత్వం కొంత సమయం ఇచ్చింది. ఈ ఫీజులను త్వరగా చెల్లిస్తే రాయితీ కూడా ఉంటుంది. 45 రోజుల్లో చెల్లిస్తే 10% రాయితీ, 90 రోజుల్లో చెల్లిస్తే 5% రాయితీ ఇస్తారు.

పచ్చని పొలాల మధ్య.. మంచం మీద కూర్చుని.. రైతులతో మాట్లాడిన చంద్రబాబు

అయితే కొన్ని స్థలాల్లో (ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్ల కోసం తీసుకున్న భూములు, గొడవలు ఉన్న స్థలాలు, వరద వచ్చే ప్రాంతాలు, గ్రీన్ బఫర్ జోన్లు, సీఆర్జడ్ పరిధిలో ఉన్న స్థలాలు) ఎల్ఆర్ఎస్ అనుమతులు ఉండవు. ప్రభుత్వం ప్రజల కోసం వసూలు చేసిన ఫీజులను మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తుంది. ప్రజలకు కావాల్సిన రోడ్లు, నీటి సదుపాయం ఏర్పాటు చేస్తారు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తు్న్నారు.. రాయితీ పొందే అద్భుతమైన అవకాశం కూడా ఉందంటున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి