Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tech Tips: మీరు పగిలిన డిస్‌ప్లే ఫోన్‌ వాడుతున్నారా? ప్రమాదమేనట.. ఇవి తెలుసుకోవాల్సిందే!

6 August 2025

తేజ్‌ నేనెవరితో మాట్లాడలేదురా.. నా కొడుకును మంచిగా చూసుకో.. ఇల్లాలు బలవన్మరణం

6 August 2025

Karimnagar: భర్త కనిపించడం లేదంటూ.. భోరున ఏడ్చేసిన భార్య.. పోలీసులకు ఏదో తేడా కొట్టింది..!

6 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Gst Collections,Nara Lokesh: ఏపీ ఈజ్ బ్యాక్.. దక్షిణ భారతదేశంలోనే టాప్.. తెలంగాణ ఎక్కడుందంటే? – andhra pradesh new records in gst collections in july month minister nara lokesh tweets ap is back
ఆంధ్రప్రదేశ్

Ap Gst Collections,Nara Lokesh: ఏపీ ఈజ్ బ్యాక్.. దక్షిణ భారతదేశంలోనే టాప్.. తెలంగాణ ఎక్కడుందంటే? – andhra pradesh new records in gst collections in july month minister nara lokesh tweets ap is back

.By .5 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Gst Collections,Nara Lokesh: ఏపీ ఈజ్ బ్యాక్.. దక్షిణ భారతదేశంలోనే టాప్.. తెలంగాణ ఎక్కడుందంటే? – andhra pradesh new records in gst collections in july month minister nara lokesh tweets ap is back
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Nara Lokesh on AP July GST Collections: జూలై నెల జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ దుమ్మురేపింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో ఏపీలో రికార్డు స్థాయిలో జీఎస్టీ రాబడి వచ్చింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. జీఎస్టీ వార్షిక వృద్ధి రేటులో దక్షిణ భారతదేశంలోనే తొలిస్థానంలో ఉన్నామని.. ఏపీ ఈజ్ బ్యాక్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ఏపీ ఈజ్ బ్యాక్.. దక్షిణ భారతదేశంలోనే టాప్.. తెలంగాణ ఎక్కడుందంటే?
ఏపీ ఈజ్ బ్యాక్.. దక్షిణ భారతదేశంలోనే టాప్.. తెలంగాణ ఎక్కడుందంటే? (ఫోటోలు– Samayam Telugu)

Nara Lokesh on AP July GST Collections: ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ .. రాష్ట్రాభివృద్ధి దిశగా ప్రయాణం ఇప్పుడే మొదలైందంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లను ఉదహరిస్తూ నారా లోకేష్ ఈ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బలంగా పుంజుకుంటోందని.. ఏపీ బలమైన ఆర్థిక పునరుద్ధరణకు జులై నెల జీఎస్టీ వసూళ్లే కారణమంటున్నారు. “2025 జూలైలో ఆంధ్రప్రదేశ్ రూ.3,803 కోట్ల జీఎస్టీ వసూళ్లను సాధించింది. 2017లో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం. అలాగే ఏపీ వార్షిక వృద్ధి కూడా.. 14 శాతంగా ఉంది. ఇది దక్షిణ భారత రాష్ట్రాలలో అత్యధిక జీఎస్టీ వృద్ధి రేటు. అలాగే దేశంలోని పెద్ద రాష్ట్రాలలో మూడోవది. ఏపీ ఈజ్ బ్యాక్.. మేము ఇప్పుడే ప్రయాణాన్ని ప్రారంభించాం” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మరోవైపు జీఎస్టీ రాబడి విషయానికి వస్తే.. గతంలో ఏ జులైలోనూ లేనంత జీఎస్టీ వసూళ్లను ఏపీ గత నెలలో సాధించింది. అలాగే 2018 నుంచి 2025 వరకూ.. జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.3,803 కోట్లు రావటం ఇదే తొలిసారి. అలాగే నికర జీఎస్టీ వసూళ్లు కూడా రూ.2,930 కోట్లు సాధించడం కూడా ఓ రికార్డని అధికారులు చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే అత్యధికమని ఏపీ వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కమిషనర్‌ ఎ.కె.బాబు చెప్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎదురైన ప్రతికూల ఫలితాలతో పోలిస్తే ఇది చాలా మంచి పరిణామమని.. అలాగే 14 శాతం వృద్ధితో ఎగువకు దూసుకువెళ్లామని ఆయన వివరించారు.

మరోవైపు 2024 జూలై నెలతో పోలిస్తే.. 2025 జూలై నెలలో దక్షిణాది రాష్ట్రాలలో జీఎస్టీ అత్యధిక వృద్ధి రేటు ఏపీనే నమోదు చేసింది. 2024 జూలై నెలలో ఏపీ రూ.3346 కోట్లు జీఎస్టీ వసూలు చేయగా.. 2025 జూలై నాటికి జీఎస్టీ వసూళ్లు రూ.3.803 కోట్లకు చేరాయి. దీంతో వార్షిక వృద్ధి రేటు 14 శాతంగా నమోదైంది. అటు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే 2024 జూలై నెలలో రూ.4940 కోట్లు జీఎస్టీ వసూళ్లు సాధించగా.. 2025 జూలైలో రూ.5417 కోట్లు జీఎస్టీ రాబడి వచ్చింది. మొత్తంగా పది శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది.

తమిళనాడు రూ.10,490 కోట్లు నుంచి రూ.11,296 కోట్లకు పెరిగి 8 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. కర్ణాటక రాష్ట్రం విషయానికి వస్తే జీఎస్టీ వసూళ్లు 2024 జూలై నెలలో రూ.13,025 కోట్లుగా ఉంటే.. ఈ జూలై నెలలో మాత్రం రూ.13, 967 కోట్లకు చేరాయి. దీంతో కర్ణాటక 7 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించింది. దేశంలోని పెద్ద రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ 18 శాతం, బిహార్ 16 శాతం తర్వాత జీఎస్టీ వార్షిక వృద్ధిరేటులో ఏపీ 14 శాతంతో మూడో స్థానంలో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఏపీ ఈజ్ బ్యాక్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి