Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రక్షాబంధన్: మీ సోదరీమణులను ఆశ్చర్య పరచడానికి వెళ్ళాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!

5 August 2025

UPI లావాదేవీలపై ఛార్జీల వసూలు షురూ..! ఈ బ్యాంక్‌ ఎంత వసూలు చేస్తుంటే.. వసూలు షురూ..!

5 August 2025

వరలక్ష్మీ వత్రం.. కష్టాలు తొలగనున్న రాశుల వారు వీరే!

5 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Government Handlooms Gst,ఆగస్ట్ 7న ఏపీలోని చేనేతలకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్ మాత్రమే కాదు.. మరోటి కూడా! – ap government decides to bearing gst on handloom textiles for weavers from august 7
ఆంధ్రప్రదేశ్

Ap Government Handlooms Gst,ఆగస్ట్ 7న ఏపీలోని చేనేతలకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్ మాత్రమే కాదు.. మరోటి కూడా! – ap government decides to bearing gst on handloom textiles for weavers from august 7

.By .5 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Government Handlooms Gst,ఆగస్ట్ 7న ఏపీలోని చేనేతలకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్ మాత్రమే కాదు.. మరోటి కూడా! – ap government decides to bearing gst on handloom textiles for weavers from august 7
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త వినిపించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ ఏడో తేదీ నుంచి చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే చేనేత వస్త్రాలపై జీఎస్టీని భరించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే చేనేతల కోసం ఉద్దేశించిన థ్రిఫ్ట్ ఫండ్‌కు 5 కోట్లు కేటాయించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

ఆగస్ట్ 7న ఏపీలోని చేనేతలకు గుడ్ న్యూ్స్.. ఉచిత విద్యుత్ మాత్రమే కాదు.. మరోటి కూడా!
ఆగస్ట్ 7న ఏపీలోని చేనేతలకు గుడ్ న్యూ్స్.. ఉచిత విద్యుత్ మాత్రమే కాదు.. మరోటి కూడా! (ఫోటోలు– Samayam Telugu)

ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. చేనేత వస్త్రాలపై జీఎస్టీని భరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేనేతశాఖపై మంగళవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యాండ్‌లూమ్‌ వస్త్రాలపై జీఎస్టీని భరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆగస్ట్ ఏడో తేదీ నుంచి చేనేత మగ్గాలకు 200, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటుగా చేనేత కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్‌ ఫండ్‌ కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

మరోవైపు చేనేత కార్మికుల ఇళ్లకు ప్రతి నెలా 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందిస్తామని 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్ట్ 7 నుంచి మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు పర్యటనలో చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. మంగళవారం చేనేత శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. ఉచిత విద్యుత్ పథకంతో పాటుగా చేనేత వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్రమే భరించాలని నిర్ణయించారు.

మరోవైపు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 50 వేలకు పైగా చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. అలాగే 15 వేల వరకూ ఉన్న పవర్ లూమ్స్ యజమానులకు కూడా ఉపయోగం కలగనుంది. ఉచిత విద్యుత్ పథకం అమలుతో చేనేత మగ్గాలు ఉన్న కుటుంబాలకు నెలకు రూ.950 నుంచి రూ.1250 వరకూ.. అలాగే మర మగ్గాలు ఉన్న కుటుంబాలకు నెలకు రూ. 2500 వరకూ ప్రయోజనం చేకూరుతుంది. చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం రూ.125 కోట్ల వరకూ ఖర్చు చేయనుంది.

మరోవైపు థ్రిఫ్ట్ ఫండ్ పథకం.. చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించే పథకం. ఈ పథకం కింద చేనేత కార్మికులు తమ నెల ఆదాయంలో 8 శాతం పొదుపు చేస్తే, ప్రభుత్వం దీనికి అదనంగా మరో 16 శాతం మొత్తం చెల్లిస్తుంది. ఈ పొదుపు మొత్తం చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. మూడేళ్లు దాటిన తర్వాతచేనేత కార్మికులు కావాల్సిన మొత్తం విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి