Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రక్షాబంధన్: మీ సోదరీమణులను ఆశ్చర్య పరచడానికి వెళ్ళాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!

5 August 2025

UPI లావాదేవీలపై ఛార్జీల వసూలు షురూ..! ఈ బ్యాంక్‌ ఎంత వసూలు చేస్తుంటే.. వసూలు షురూ..!

5 August 2025

వరలక్ష్మీ వత్రం.. కష్టాలు తొలగనున్న రాశుల వారు వీరే!

5 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Rain,Weather Update: రేపు పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల్లోనే.. బీ అలర్ట్! – apsdma weather forecast light to moderate rains in andhra pradesh on wednesday
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Rain,Weather Update: రేపు పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల్లోనే.. బీ అలర్ట్! – apsdma weather forecast light to moderate rains in andhra pradesh on wednesday

.By .5 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Rain,Weather Update: రేపు పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల్లోనే.. బీ అలర్ట్! – apsdma weather forecast light to moderate rains in andhra pradesh on wednesday
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రేపు పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల్లోనే.. బీ అలర్ట్!
రేపు పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల్లోనే.. బీ అలర్ట్! (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ‌లో బుధవారం కూడా పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం రోజు పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గత రెండురోజుల నుంచి ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇంటిపై పడేందుకు అవకాశం ఉన్న చెట్లను తొలగించుకోవాలని సూచించింది. అలాగే మెరుపు కనబడిన తర్వాత 30 అంకెలు లెక్కపెట్టాలని.. ఈ లోపు ఉరుము శబ్దం కూడా వినిపిస్తే వెంటనే ఇంట్లోకి లేదా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించింది. అలాగే ఉరుము శబ్దం వినపడిన తర్వాత అరగంటపాటు బయట పనులు చేయకపోవటం మంచిదని సూచించింది.

అలాగే ఎలక్ట్రికల్ పరికరాలకు నష్టం కలగకుండా ఎర్తింగ్ ప్రక్రియ సరిగా చూసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇల్లు, ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలను సురక్షితంగా ఉంచుకునేందుకు సర్జ్ ప్రొటెక్టర్స్, మెరుపు రాడ్లు వంటివి ఏర్పాటు చేసుకోవటం మంచిదని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటే ఇంట్లోని కరెంట్ పరికరాలను అన్ ప్లగ్ చేయాలని సూచించింది. ఎలక్ట్రికల్ పరికరాలు, ఛార్జర్లు ఉపయోగించవద్దని సూచించింది. అలాగే ఉరుములు, మెరుపుల సమయంలో కిటికీలు, తలుపుల దగ్గరగా ఉండవద్దని.. దూరంగా ఉండాలని సూచించింది. ప్లంబింగ్, ఐరన్ పైపులను తాకవద్దని.. పారుతున్న నీటిని కూడా ఉపయోగించవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. చెట్ల కింద నిలబడకూదదని సూచించింది. కారు లేదా బస్సు లోపల ఉంటే డోర్లు మూసి ఉంచాలని సూచించింది. లోహపు వస్తువులను ఉపయోగించవద్దని.. విద్యుత్, టెలిఫోన్ వైర్ల నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేస్తోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి