Macherla Vijayawada 67228 Train Schedule Changed: ఆంధ్రప్రదేశ్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు వేళల్లో మార్పులు చేశారు అధికారులు. ప్రతి రోజూ మాచర్ల నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్ రైలు ఇకపై ఉదయం 5.30 గంటలకు బదులు 6 గంటలకు బయలుదేరుతుంది. అలాగే, చెంగల్పట్టు-కాకినాడ, పుదుచ్చేరి-కాకినాడ ఎక్స్ప్రెస్ రైళ్ల షెడ్యూల్లో కూడా మార్పులు చేశారు. తమిళనాడు వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాల సందర్భంగా గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి.
హైలైట్:
- ఏపీలో ఆ రైలు టైమింగ్స్ మారాయి
- అంతేకాదు రైలు వేగాన్ని పెంచారు
- కొత్త షెడ్యూల్ నేటి నుంచే అమలు

రెంటచింతల: 6:20 AM
గురజాల: 6:32 AM
నడికుడి: 6:48 AM
తుమ్మల చెరువు: 7:02 AM
పిడుగురాళ్ల: 7:13 AM
బెల్లంకొండ: 7:20 AM
రెడ్డిగూడెం: 7:27 AM
సత్తెనపల్లి: 7:40 AM
పెదకూరపాడు: 7:52 AM
సిరిపురం: 8:00 AM
బండారుపల్లి: 8:08 AM
నల్లపాడు: 8:18 AM
గుంటూరు: 8:30 AM
పెదకాకాని: 8:39 AM
నంబూరు: 8:52 AM
మంగళగిరి: 9:34 AM
కృష్ణ కెనాల్ జంక్షన్: 9:55 AM
విజయవాడ :10:55 ఉదయం AM
మరోవైపు రెండు రైళ్ల షెడ్యూల్లో మార్పులు చేశారు. అక్టోబరు 2 నుంచి చెంగల్పట్టు-కాకినాడ రైలు (17643/17644) అక్టోబరు 3 నుంచి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తుంది. పుదుచ్చేరి-కాకినాడ ఎక్స్ప్రెస్ (17656) ప్రతి సోమ, గురు, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (17655) అక్టోబరు 4 నుంచి అదే రోజులలో రానుంది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి.
ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..
మరోవైపు తమిళనాడులోని నాగపట్నంలో వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాల సందర్భంగా గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మినల్-వెలంకని ప్రత్యేక రైలు (09093).. బాంద్రా టెర్మినల్లో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుంది. ఈ రైలు (09094) తిరుగు ప్రయాణంలో వెలంకనిలో ఈ నెల 30, సెప్టెంబరు 9 తేదీల్లో అర్ధరాత్రి 12-30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదిన్నరకు బాంద్రా చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు ఏపీలోని మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంటలో ఆగుతుంది.