Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Rashid Khan: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. 650 వికెట్లతో ప్రపంచ రికార్డ్

6 August 2025

UPI పేమెంట్స్‌లో భారత్‌ సరికొత్త రికార్డు.. రోజుకు ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయో తెలుసా?

6 August 2025

Telangana: బర్త్ డే పార్టీలో రచ్చ రచ్చ.. కత్తులతో డ్యాన్సులు చేస్తూ యువకుల హంగామా.. వీడియో వైరల్

6 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Ration Shops Gcc Products,ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై అవి తక్కువ ధరకే, మంత్రి కీలక ప్రకటన – ap minister nadendla manohar said that tribal gcc products will be made available to the people through ration shops
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Ration Shops Gcc Products,ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై అవి తక్కువ ధరకే, మంత్రి కీలక ప్రకటన – ap minister nadendla manohar said that tribal gcc products will be made available to the people through ration shops

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Ration Shops Gcc Products,ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై అవి తక్కువ ధరకే, మంత్రి కీలక ప్రకటన – ap minister nadendla manohar said that tribal gcc products will be made available to the people through ration shops
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Plans GCC Products In Ration Shops: రేషన్ పంపిణీతో పాటుగా రేషన్ కార్డుల విషయంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ఉత్పత్తులను రేషన్ షాపుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గిరిజన సహకార సంస్థలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు.ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయన్నారు. గిరిజన ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంటే గిరిజనులు తయారు చేసిన వస్తువులు ఇకపై రేషన్ షాపుల్లో కూడా దొరుకుతాయి.

హైలైట్:

  • ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
  • ఇకపై రేషన్ షాపుల్లో గిరిజన ఉత్పత్తులు
  • త్వరలోనే ఒప్పందం చేసుకుంటారట
ఏపీ రేషన్ షాపుల్లో జీసీసీ ఉత్పత్తులు
ఏపీ రేషన్ షాపుల్లో జీసీసీ ఉత్పత్తులు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.. రేషన్ షాపుల్లో గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గిరిజన సహకార సంస్థలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నామని.. త్వరలోనే గిరిజన ఉత్పత్తులు రేషన్ షాపుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. గిరిజనులు తయారు చేసిన వస్తువులు కూడా రేషన్ షాపుల్లో అమ్మకానికి పెడతామని.. దీనివల్ల గిరిజనులకు ఆదాయం వస్తుందని.. ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ సక్రమంగా అందడం లేదని చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ పంపిణీ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.. ఇందులో భాగంగా 69 సబ్ డిపోలను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రేషన్ పంపిణీ మరింత సులభం అవుతుందన్నారు.

ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ తీసుకుంటున్న వారితో పాటు కొత్తగా మంజూరైన వారికి కూడా స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన్ పంపిణీలో నగదు చెల్లింపు విధానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి డిజిటల్ వ్యాలెట్ విధానం ప్రవేశపెడతామని అన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్టు సైజులో ఉంటాయని..కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ప్రతి నెలలో 15 రోజులు పాటూ రేషన్ సరుకులు అందిస్తున్నారని..
ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీ వరకు 65 సంవత్సరాల వయస్సు దాటిన వృద్ధులకు, వికలాంగులకు ముందుగానే ఇంటివద్దకే సరకులు అందిస్తున్నామన్నారు.

గండికోటను సందర్శించిన సీఎం చంద్రబాబు.. అబ్బో ఇన్ని సమస్యలు ఉన్నాయా!

మరోవైపు ఏపీ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త చెప్పింది. చేనేత రంగానికి సహాయం చేయడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్‌ ఫండ్ ఏర్పాటు చేస్తారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారు. కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్‌ ఫండ్ ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత, జౌళి శాఖపై సమీక్ష నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవం అయిన ఆగస్టు 7 నుంచి కొత్త నిర్ణయాలు అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వ్యవసాయం తర్వాత చేనేత రంగం చాలా ముఖ్యమైనదన్నారు చంద్రబాబు. ఈ రంగంపై ఆధారపడిన వారికి అండగా నిలవాలన్నారు. ఇటీవల చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు వచ్చాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఒకే జిల్లా-ఒకే ఉత్పత్తి విభాగంలో మొదటిసారి అవార్డు వచ్చిందన్నారు.. సీఎం అధికారులను అభినందించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి