Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Telangana: ఊరెళ్లిన భార్య.. ఒంటరిగా ఉన్న అత్త.. విచక్షణ కోల్పోయిన అల్లుడు.. కట్ చేస్తే

6 August 2025

Gautam Adani: అదానీ పోర్ట్స్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆదానీ.. కారణం ఇదే

6 August 2025

రాఖీల తయారీకి కేర్ ఆఫ్ పెద్దపల్లి.. స్వదేశంతో పాటు విదేశాలకు పంపిణి.. ఆర్డర్ బట్టి తయారీ..

6 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Haj 2026 Rs 1 Lakh Help,ఏపీలో ముస్లింలకు ఒక్కరోజే ఛాన్స్.. ఉచితంగా రూ.లక్ష ఇస్తున్న ప్రభుత్వం, త్వరపడండి – andhra pradesh govt extended haj 2026 application deadline to august 7th 2025 and give rs 1 lakh
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Haj 2026 Rs 1 Lakh Help,ఏపీలో ముస్లింలకు ఒక్కరోజే ఛాన్స్.. ఉచితంగా రూ.లక్ష ఇస్తున్న ప్రభుత్వం, త్వరపడండి – andhra pradesh govt extended haj 2026 application deadline to august 7th 2025 and give rs 1 lakh

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Haj 2026 Rs 1 Lakh Help,ఏపీలో ముస్లింలకు ఒక్కరోజే ఛాన్స్.. ఉచితంగా రూ.లక్ష ఇస్తున్న ప్రభుత్వం, త్వరపడండి – andhra pradesh govt extended haj 2026 application deadline to august 7th 2025 and give rs 1 lakh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Haj 2026 Rs 1 Lakh Aid: ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రికులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2026 హజ్ యాత్రకు దరఖాస్తు గడువు పొడిగించింది. విజయవాడ నుండి వెళ్లే యాత్రికులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. తాజాగా గతంలో విజయవాడ ఎంబార్కేషన్ రద్దు కావడంతో ఇబ్బంది పడిన వారికి ప్రభుత్వం రూ.72 లక్షలు మంజూరు చేసింది. హజ్ యాత్ర 2026కు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ ఒక్కరోజే ఛాన్స్ ఉంది.

హైలైట్:

  • ఏపీలో హజ్ యాత్ర 2026
  • ఇవాళ ఒక్కరోజే ఛాన్స్ ఉంది
  • రూ.లక్ష అందిస్తున్న సర్కార్
ఏపీ హజ్ యాత్రకు ఆగస్టు 7 వరకు గడువు
ఏపీ హజ్ యాత్రకు ఆగస్టు 7 వరకు గడువు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి ముఖ్యమైన గమనిక.. హజ్-2026 యాత్ర కోసం దరఖాస్తు గడువును పొడిగించారని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. దరఖాస్తు చేసుకుందనేకు బుధవారం(ఈ నెల 7వ తేదీ) వరకు అవకాశం ఉంది. విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ ద్వారా వెళ్లే వారికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేవారు విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్‌ను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని మంత్రి సూచించారు. మరోవైపు హజ్‌-2025కు వెళ్లేందుకు విజయవాడ ఎంబార్కేషన్‌ కేంద్రం ఎంపిక చేసుకున్నవారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వారందరికి రూ.72 లక్షలు మంజూరు చేసిందని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌ఎండీ ఫరూక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హజ్‌-2025 యాత్రకు వెళ్లేందుకు కొందరు విజయవాడ ఎంబార్కేషన్‌ ఎంచుకున్నారు.. తగినంతమంది యాత్రికులు లేకపోవడంతో విమాన సర్వీసు రద్దు చేశారు. దీంతో వారంతా హైదరాబాద్‌ నుంచి హజ్‌యాత్రకు వెళ్లారు. వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తామని గతేడాది ప్రభుత్వం చెప్పింది. దీంతో విజయవాడ ఎంబార్కేషన్‌ కేంద్రం ఎంచుకున్న వారికి రూ.72 లక్షలు విడుదల చేశారు.

అంతేకాదు ఏపీ నుంచి 2026లో హజ్‌ యాత్రకు వెళ్లే వారికి కూడా శుభవార్త చెప్పారు. విజయవాడ ఎంబార్కేషన్‌ ఉంచుకుంటే రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామన్నారు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌. ఇవాళ సాయంత్రంలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరోవైపు అమరావతి సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. శాఖకు సంబంధించిన ఆస్తుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ఆ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ ఆస్తుల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. దీని ద్వారా ఆస్తులను సక్రమంగా వినియోగించవచ్చు

రాష్ట్ర హజ్ కమిటీ సీఎం చంద్రబాబును కలిసింది. శాశ్వత హజ్ హౌస్ కట్టడానికి విజయవాడ లేదా గుంటూరు దగ్గర నేషనల్ హైవే పక్కన 5 నుంచి 6 ఎకరాల స్థలం కావాలని కోరారు. సీఆర్‌డీఏ ద్వారా స్థలం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. 2026 హజ్ యాత్ర కోసం విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

గండికోటను సందర్శించిన సీఎం చంద్రబాబు.. అబ్బో ఇన్ని సమస్యలు ఉన్నాయా!

వారం క్రితం గన్నవరం విమానాశ్రయం ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. దీనికి స్పందిస్తూ విజయవాడను హజ్ ఎంబార్కేషన్ పాయింట్‌గా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ఇకపై హజ్ యాత్రకు వెళ్ళేవారికి ఎంబార్కేషన్ పాయింట్‌గా ఉంటుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి