Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Amit Shah: చరిత్ర సృష్టించిన అమిత్‌ షా.. అత్యధిక కాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు

6 August 2025

Vastu Tips: పావురం గూడు ఇంట్లో ఉండడం శుభమా? అశుభమా? పావురం కనిపిస్తే సంకేతం ఏమిటంటే..

6 August 2025

Khaidi 2: ఖైదీ 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన లోకేష్.. ఢిల్లీ మళ్లీ వస్తున్నాడు.. ఫ్యాన్స్‌కు పూనకాలే

6 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tdp Wins Two Sarpanchs,ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. రెండు సర్పంచ్‌లు టీడీపీ కైవసం, ఆ మూడుచోట్ల కూడా గెలుపు – tdp wins in kondapi kadiyapu lanka sarpanch and three mptcs andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Tdp Wins Two Sarpanchs,ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. రెండు సర్పంచ్‌లు టీడీపీ కైవసం, ఆ మూడుచోట్ల కూడా గెలుపు – tdp wins in kondapi kadiyapu lanka sarpanch and three mptcs andhra pradesh

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tdp Wins Two Sarpanchs,ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. రెండు సర్పంచ్‌లు టీడీపీ కైవసం, ఆ మూడుచోట్ల కూడా గెలుపు – tdp wins in kondapi kadiyapu lanka sarpanch and three mptcs andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TDP Two Sarpanchs Mptc Win: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కొండపి, కడియపులంక సర్పంచి స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఆ రెండు చోట్ల టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిపల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వేపకారిపల్లి ఎంపీటీసీ.. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు-1 ఎంపీటీసీ.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మణీంద్రం ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా టీడీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హైలైట్:

  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
  • రెండు సర్పంచ్‌లు టీడీపీకే
  • మూడు ఎంపీటీసీలు కూడా
టీడీపీకి రెండు సర్పంచ్‌లు
టీడీపీకి రెండు సర్పంచ్‌లు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియపులంక సర్పంచ్ స్థానాల్లో టీడీపీ గెలిచింది. కడియపులంక సర్పంచిగా ఎం పద్మావతి, కొండపి పంచాయతీ సర్పంచిగా కె.సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర్ల నియోజకవర్గంలో వేపకంపల్లి ఎంపీటీసీ, నెల్లూరు జిల్లా కోవూరులోని విడవలూరు-1 ఎంపీటీసీ, కుప్పం నియోజకవర్గంలో మణీంద్రం ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా కొండపి గ్రామ సర్పంచిగా కొమ్ము సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డులకు 39 మంది నామినేషన్లు దాఖలు చేశారు.. సర్పంచి పదవికి 15 మంది నామినేషన్లు సమర్పించారు. అయితే చివర్లో అందరూ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో కొమ్ము సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 14 వార్డులకు గానూ టీడీపీకి తొమ్మిది, వైఎస్సార్‌సీపీకి ఐదుగురు ఏకగ్రీవం అయ్యారు. కొండపి సర్పంచ్ ఎన్నికలు 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.. కోర్టులో లైన్ క్లియర్ అయ్యాక ఎన్నికలు జరిగాయి.

ఇటు రాజమహేంద్రవరం రూరల్ కడియపులంక సర్పంచ్‌గా మాదిశెట్టి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు.. అయితే చనిపోయిన సర్పంచ్ అమ్మాణీ కుమార్తె మాదిశెట్టి పద్మావతి నామినేషన్‌ దాఖలు చేశారు. మరో మహిళల నామినేషన్‌ దాఖలు చేయగా.. ఆమె చివర్లో నామినేషన్‌ ఉపసంహరించు కోవడంతో రేసులో ఒకరే ఉండటంతో.. మాదిశెట్టి పద్మావతి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల.. అలాగే ఒంటిమిట్టలో జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలకు ఈనెల 12న పోలింగ్ ఖాయమైంది. 2021లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి మరణించడం, ఒంటిమిట్ట జెడ్పీటీసీగా గెలిచిన ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి ఎమ్మెల్యే కావడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. పులివెందుల నుంచి మహేశ్వరరెడ్డి కుమారుడు హేమంత్‌ కుమార్‌, టీడీపీ నుంచి బీటెక్‌ రవి భార్య లతారెడ్డి పోటీ చేస్తున్నారు. ఒంటిమిట్టలో వైఎస్సార్‌సీపీ నుంచి సుబారెడ్డి, టీడీపీ నుంచి ముద్దుకృష్ణా రెడ్డి పోటీలో ఉన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి