Anantapur To Guntur National Highway 544d,ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే.. ఈ రూట్లో రూ.రూ.4,200 కోట్లతో.. ఈ ఐదు జిల్లాలకు మహర్దశ – funds released for anantapur to guntur national highway 544d four lines extension
Anantapur To Guntur National Highway Works: రాయలసీమలో ఐదు జిల్లాలకు కీలకమైన నేషనల్ హైవే పనులు వేగవంతం చేశారు. తాజాగా నిధులు విడుదలకాగా.. త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు.ఈ హైవేను నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు. ఈ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే ఐదు జిల్లాల నుంచి రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ మేరకు పనుల్ని వేగవంతం చేస్తున్నారు. హైవేకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
ఏపీల ో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా
ఐదు జిల్లాలకు అమరావతితో కనెక్టివిటీ
నిధులు విడుదల.. త్వరలో పనులు షురూ
అనంతపురం గుంటూరు నేషనల్ హైవే 544డీ అప్డేట్ (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్లో మరో నేషనల్ హైవే పనులు ఊపందుకోనున్నాయి. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి 544డీని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అనంతపురం జిల్లాలోని బుగ్గ నుంచి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వరకు, అలాగే వినుకొండ నుంచి గుంటూరు వరకు రహదారి విస్తరణ జరగనుంది. దీనికి కేంద్రం రూ.4,200 కోట్లు ఖర్చు చేయనుంది. మొదటి ప్యాకేజీలో భాగంగా బుగ్గ నుండి గిద్దలూరు వరకు 135 కి.మీ మేర రహదారిని అభివృద్ధి చేస్తారు. ఇందులో అనంతపురం జిల్లాలో 100 కి.మీ రహదారి నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. రెండవ ప్యాకేజీలో వినుకొండ నుంచి గుంటూరు వరకు 84.80 కి.మీ రహదారిని విస్తరిస్తారు.నంద్యాల జిల్లాలో కొలిమిగుండ్ల మండలం, అవుకు మండలం, బనగానపల్లి మండలం, గోస్పాడు మండలం, మహానంది మండలాల్లో బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. బనగానపల్లి, కైప, అప్పలాపురం, టంగుటూరు, అంకిరెడ్డిపల్లె, రాఘవరాజుపల్లి-కనకాద్రిపల్లి, కొలిమిగుండ్ల, రామాపురం-అవుకు, రాయపాడు-తేళ్లపురి, పసురపాడు, ఎస్.నాగులవరం, దీబగుంట్ల, గాజులపల్లెలో బైపాస్లు రాబోతున్నాయి. ఈ హైవే విస్తరణతో రాయలసీమ ప్రజలకు రాజధాని అమరావతికి త్వరగా వెళ్లొచ్చు. ఈ నేషనల్ హైవేతో శ్రీసత్యసాయి, అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రజలకు కనెక్టివిటీ పెరుగుతుంది.
ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..
అనంతపురం-గుంటూరు హైవేను నాలుగు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో అనంతపురం నుంచి బుగ్గ వరకు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బుగ్గ-గిద్దలూరు మధ్య రెండో ప్యాకేజీ పనులకు, వినుకొండ-గుంటూరు మధ్య మరో ప్యాకేజీ పనులకు నిధులు ఇచ్చారు. బుగ్గ-గిద్దలూరు ప్యాకేజీకి త్వరలో భూసేకరణ ప్రారంభంకానుంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు మొదలు పెట్టడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల మీదుగా నాలుగు నేషనల్ హైవేలు వెళుతున్నాయి. కర్నూలు-చిత్తూరు మధ్య నేషనల్ 40, కల్వకుర్తి-జమ్మలమడుగు 167-కే, చెన్నై-సూరత్ 150సీ రహదారులు ఉన్నాయి. ఈ హైవేలు నంద్యాల శివారులోని అయ్యలూరుమెట్ట-దీబగుంట్ల మధ్యలో కలుస్తాయి. వాస్తవానికి 2016లో అనంతపురం-గుంటూరు రహదారి నిర్మాణం 2016లో మొదలైంది. కానీ నిధుల సమస్యల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ ఇప్పుడు ఈ నేషనల్ హైవే పనులు వేగవంతం అవుతున్నాయి.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి