Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood: కేవలం రూ. 60 లక్షలు పెట్టి తీస్తే.. అంతకు 15 రెట్లు వసూలు చేసిన తెలుగు బ్లాక్ బాస్టర్

6 August 2025

Shubman Gill : సెలబ్రిటీ గర్ల్ ఫ్రెండ్, కోట్ల కొద్దీ సంపాదన.. బాగానే కూడబెట్టావయ్యా గిల్.. ఇంతేనా ఇంకేమైనా ఆస్తులున్నాయా ?

6 August 2025

థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్ట్‌లు.. కేసును పోలీసులు ఎలా ఛేదించారో తెలిస్తే!

6 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Srivani Tickets Visakhapatnam Flight,తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విశాఖపట్నంవాసుల కొత్త డిమాండ్.. టైమ్ మారిస్తేనే! – tirumala srivani darshan tickets problem for visakhapatnam flight passengers
ఆంధ్రప్రదేశ్

Tirumala Srivani Tickets Visakhapatnam Flight,తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విశాఖపట్నంవాసుల కొత్త డిమాండ్.. టైమ్ మారిస్తేనే! – tirumala srivani darshan tickets problem for visakhapatnam flight passengers

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Srivani Tickets Visakhapatnam Flight,తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విశాఖపట్నంవాసుల కొత్త డిమాండ్.. టైమ్ మారిస్తేనే! – tirumala srivani darshan tickets problem for visakhapatnam flight passengers
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Srivani Tickets Visakhapatnam People: తిరుమల శ్రీవారి దర్శనం కోసం టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి విమానాశ్రయంలో కౌంటర్ ఏర్పాటు చేసి రోజుకు 200 టికెట్లు ఇస్తున్నారు. అయితే ఈ టికెట్ల విషయంలో విశాఖపట్నం వాసులు ఇబ్బందిపడుతున్నారట. విశాఖపట్నం నుంచి వెళ్లే విమానం మధ్యాహ్నానికి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటోంది. కానీ 200 దర్శన టికెట్లు ఉదయం 9లోపే ఖాళీ అవుతున్నాయి.. కౌంటర్ మూసివేవస్తున్నారని చెబుతున్నారు.

హైలైట్:

  • తిరుమల శ్రీవాణి దర్శన టికెట్లు
  • విశాఖపట్నంవాసులకు కష్టాలు
  • విమానం షెడ్యూల్‌తో సమస్య
విశాఖ వాసులకు దక్కని శ్రీవాణి టికెట్లు
విశాఖ వాసులకు దక్కని శ్రీవాణి టికెట్లు (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. టీటీడీ భక్తులకు శ్రీవాణి పేరుతో దర్శన టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖపట్నానికి చెందిన భక్తులకు ఓ సమస్య వచ్చింది.. సాగర తీర నగరం నుంచి వస్తున్న విమానం టైమింగ్‌తో ఇబ్బందిపడుతున్నారట. తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.. టీటీడీ ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయిస్తున్నారు. ప్రతిరోజు 200 టికెట్లు మాత్రమే ఇస్తారు.. ఉదయం 8 గంటలకు కౌంటర్ తెరుస్తారు.. విమానంలో వచ్చిన ప్రయాణికులకు మాత్రమే ఈ టికెట్లు ఇస్తారు. దర్శన టికెట్ కోసం బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు చూపించాలి. రూ.10 వేలు శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళంతో పాటుగా రూ.500 టికెట్ ధర చెల్లించాలి. తిరుమలలో గది కూడా కేటాయిస్తారు. తిరుమల శ్రీవారి శ్రీవాణి దర్శన టికెట్లు ఉదయం 9 గంటలకే అయిపోతున్నాయని చెబుతున్నారు. ఆ తర్వాత విమానాల్లో వచ్చిన వారికి టికెట్లు దొరకడం లేదు.ప్రతి రోజూ ఉదయం 8.30 గంటలలోపు హైదరాబాద్ నుంచి ఐదు విమానాలు వస్తున్నాయి.. వీటిలో ఢిల్లీ నుంచి ఒకటి, ముంబై నుంచి ఒకటి ఉదయం 10 గంటలలోపు వస్తాయి. దీంతో టీటీడీ జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్లు 200 కోటా పూర్తవుతోంది. అయితే విశాఖపట్నం నుంచి విమానం షెడ్యూల్ కారణంగా టికెట్లు పొందలేకపోతున్నామని భక్తులు చెబుతున్నారు. విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం బయలుదేరే విమానం తిరుపతికి మూడు గంటలకు చేరుకుంటుంది.. కానీ అప్పటికే శ్రీవాణి టికెట్ల కౌంటర్ మూసివేస్తున్నారు.

వీఐపీలు ఇలా చేయండి.. తిరుమల శ్రీవారి దర్శనంపై వెంకయ్య సలహా

విశాఖపట్నం నుంచి వచ్చే భక్తులకు టికెట్లు లభించడం లేదు. ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు ఈ విమాన వేళలు మార్చాలని.. లేని పక్షంలో విశాఖపట్నం ప్రయాణికులకు శ్రీవాణి టికెట్లు కేటాయించాలని కోరుతున్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దర్శన టికెట్లు కేటాయించేలా ప్లాన్ చేయాలంటున్నారు. శ్రీవాణి టికెట్ల కేటాయింపు విధానంపై భక్తులు, ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కొన్ని సూచనలు చేస్తున్నారు. “ఎవరు ముందు వస్తే వారికే” అనే పద్ధతి కాకుండా, విమానానికి టికెట్లు కేటాయించాలని కోరుతున్నారు. దేశంలోని ప్రతి విమానాశ్రయానికి శ్రీవాణి టికెట్లు కేటాయించి, స్థానికంగానే అందించాలని చెబుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి