Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Shubman Gill : సెలబ్రిటీ గర్ల్ ఫ్రెండ్, కోట్ల కొద్దీ సంపాదన.. బాగానే కూడబెట్టావయ్యా గిల్.. ఇంతేనా ఇంకేమైనా ఆస్తులున్నాయా ?

6 August 2025

థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్ట్‌లు.. కేసును పోలీసులు ఎలా ఛేదించారో తెలిస్తే!

6 August 2025

Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

6 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Raipur National Highway 130 Cd,ఏపీలో కొత్త నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లో 12 గంటలు కాదు జస్ట్ 6 గంటల్లో వెళ్లొచ్చు – visakhapatnam raipur national highway 130 cd works going on likely completed in 2026
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Raipur National Highway 130 Cd,ఏపీలో కొత్త నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లో 12 గంటలు కాదు జస్ట్ 6 గంటల్లో వెళ్లొచ్చు – visakhapatnam raipur national highway 130 cd works going on likely completed in 2026

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Raipur National Highway 130 Cd,ఏపీలో కొత్త నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లో 12 గంటలు కాదు జస్ట్ 6 గంటల్లో వెళ్లొచ్చు – visakhapatnam raipur national highway 130 cd works going on likely completed in 2026
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Visakhapatnam Raipur National Highway: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు వేగవంతం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు హైవేల పనులకు నిధులు విడుదల చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో కీలకమైన గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సంబంధించి పనులు కొంత ఆలస్యం అవుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది పనులు పూర్తవుతాయని భావించారు.. కానీ కష్టమనే అంటున్నారు. రెండు కిలోమీటర్ల మేర అసలు రోడ్డు పనులు ఇప్పటి వరకు ప్రారంభంకాలేదు..

హైలైట్:

  • ఏపీలో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే
  • ఉత్తరాంధ్రకు కీలకమైన ప్రాజెక్ట్
  • ఈ ఏడాది పనులు పూర్తి కావా?
విశాఖ టు రాయ్‌పూర్‌ 6 గంటల్లో దూసుకెళ్లొచ్చు
విశాఖ టు రాయ్‌పూర్‌ 6 గంటల్లో దూసుకెళ్లొచ్చు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌‌లో కీలకమైన విశాఖపట్నం-రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం పనులు వేగవంతం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2022 నవంబరులో ఈ 464 కిలోమీటర్ల రహదారికి శంకుస్థాపన చేశారు. 2024 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల గడువును ఈ ఏడాది డిసెంబరు వరకు పొడిగించారు. అయితే విశాఖపట్నం జిల్లాలో కంటకాపల్లి-సబ్బవరం మధ్య పనులు మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు.. వచ్చే ఏడాదికి ఈ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ రాయపూర్ నేషనల్ హైవేలో విశాఖపట్నం జిల్లాలో ప్యాకేజీ-4 కింద కంటకాపల్లి- సబ్బవరం మధ్య 19.562 కి.మీ. పొడవున పనులు జరుగుతున్నాయి. అయితే 2 కిలో మీటర్లు మినహా రోడ్డు పనులు ముగింపు దశకు వచ్చాయి. ఈ పనుల్ని రూ.638 కోట్లు అంచనా వ్యయంతో చేస్తుండగా.. ఉత్తరావల్లి- కంటకాపల్లి మధ్య 2కి.మీ హైవే పనులు ఇప్పటి వరకు మొదలుపెట్టలేదు. ఈ 2 కిలో మీటర్ల కోసం ప్రతిపాదనలు చేసిన భూమి జీఎంఆర్ సంస్థది కావడంతో.. పరిహారం పెంచాలని కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తక్కువగా ఉంది అంటున్నారు. అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా కోర్టులో పిల్ వేసింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో పనులు ప్రారంభంకాలేదు. విశాఖపట్నం- అరకు నేషనల్ హైవే పక్కన గాంధీనగర్‌ దగ్గర లింక్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. అలాగే ఈ హైవేలో.. రాయపురాజుపేట దగ్గర కొత్తవలస- కిరండూల్‌ రైల్వే లైన్‌పై ఫ్లై ఓవర్ నిర్మాణం చేస్తున్నారు.

గులివిందాడ, కొండడాబాలు ప్రాంతాల్లో నేషనల్ హైవే పనులు నిలిచిపోయాయి. గులివిందాడ దగ్గర టోల్ ప్లాజా నిర్మాణం ఆగిపోయింది. కొత్తవలస- కె.కోటపాడు రోడ్డులో కొండడాబాలు దగ్గర బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగిపోయింది. విద్యుత్ లైన్ల మార్పు, భూసేకరణ సమస్యల కారణంగా ఆగింది. త్వరలోనే పనులు మొదలవుతాయంటున్నారు అధికారులు. గులివిందాడ దగ్గరలో 400 కేవీ విద్యుత్ లైను మార్చాల్సి ఉండగా.. దీనికి అనుమతులు రావడంతో త్వరలో పనులు మొదలు పెడతామంటున్నారు. కొండడాబాలు దగ్గర బ్రిడ్జి కోసం హైవేకు ఇరువైపులా పిల్లర్లు వేసి కాంక్రీట్ బ్లాక్‌లు సిద్ధం చేశారు. అయితే ఇక్కడ కూడా 400 కేవీ విద్యుత్తు లైన్‌ను మార్చాల్సి ఉంది.

జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు

ఈ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది. 12 గంటల కాకుండా 6 గంటల్లోనే వెళ్లొచ్చంటున్నారు. విశాఖపట్నం పోర్టు నుంచి సరుకులు ఇతర ప్రాంతాలకు త్వరగా చేరవేయడానికి ఈ హైవే ఉపయోగపడుతుంది. ఈ హైవే విశాఖపట్నం దగ్గరలోని సబ్బవరం వద్ద కోల్‌కతా-చెన్నై నేషనల్ హైవే 16కు కలుస్తుంది. ఈ పనుల్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి