Visakhapatnam Raipur National Highway: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు వేగవంతం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు హైవేల పనులకు నిధులు విడుదల చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో కీలకమైన గ్రీన్ఫీల్డ్ హైవేకు సంబంధించి పనులు కొంత ఆలస్యం అవుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది పనులు పూర్తవుతాయని భావించారు.. కానీ కష్టమనే అంటున్నారు. రెండు కిలోమీటర్ల మేర అసలు రోడ్డు పనులు ఇప్పటి వరకు ప్రారంభంకాలేదు..
హైలైట్:
- ఏపీలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే
- ఉత్తరాంధ్రకు కీలకమైన ప్రాజెక్ట్
- ఈ ఏడాది పనులు పూర్తి కావా?

గులివిందాడ, కొండడాబాలు ప్రాంతాల్లో నేషనల్ హైవే పనులు నిలిచిపోయాయి. గులివిందాడ దగ్గర టోల్ ప్లాజా నిర్మాణం ఆగిపోయింది. కొత్తవలస- కె.కోటపాడు రోడ్డులో కొండడాబాలు దగ్గర బ్రిడ్జి నిర్మాణం కూడా ఆగిపోయింది. విద్యుత్ లైన్ల మార్పు, భూసేకరణ సమస్యల కారణంగా ఆగింది. త్వరలోనే పనులు మొదలవుతాయంటున్నారు అధికారులు. గులివిందాడ దగ్గరలో 400 కేవీ విద్యుత్ లైను మార్చాల్సి ఉండగా.. దీనికి అనుమతులు రావడంతో త్వరలో పనులు మొదలు పెడతామంటున్నారు. కొండడాబాలు దగ్గర బ్రిడ్జి కోసం హైవేకు ఇరువైపులా పిల్లర్లు వేసి కాంక్రీట్ బ్లాక్లు సిద్ధం చేశారు. అయితే ఇక్కడ కూడా 400 కేవీ విద్యుత్తు లైన్ను మార్చాల్సి ఉంది.
జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు
ఈ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది. 12 గంటల కాకుండా 6 గంటల్లోనే వెళ్లొచ్చంటున్నారు. విశాఖపట్నం పోర్టు నుంచి సరుకులు ఇతర ప్రాంతాలకు త్వరగా చేరవేయడానికి ఈ హైవే ఉపయోగపడుతుంది. ఈ హైవే విశాఖపట్నం దగ్గరలోని సబ్బవరం వద్ద కోల్కతా-చెన్నై నేషనల్ హైవే 16కు కలుస్తుంది. ఈ పనుల్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరతున్నారు.