ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది ఈ చిన్నది. 18 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్లో కెరీర్ ప్రారంభించి 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’తో తన హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది.
ఆ తరువాత 2011 కెరటంలో సిద్ధార్థ్ రాజ్కుమార్ సరసన నటించింది, ఇది తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైంది. ఆ తరువాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
ఇదిలా ఉండగా ఇటీవలే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది. కానీ తెలుగులో సినిమాలు తగ్గించింది ఈ వయ్యారి భామ.
తెలుగులో రకుల్ నటించిన లాస్ట్ ఎనిమిది సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి. దాంతో ఈ చిన్నది సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే హిందీలోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.
ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాల పరంగా సైలెంట్ అయ్యింది. సినిమాల్లో బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంది రకుల్. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది ఈ వయ్యారి భామ.