Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ప్రపంచంలోనే తోపు.. కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. కూతురి చేతిలో మాత్రం ఆటబొమ్మే

7 August 2025

Walking Benefits: మీరు రోజు 30 నిమిషాలు వాకింగ్‌ చేస్తున్నారా? శరీరంలో జరిగే కీలక మార్పులు ఇవే!

7 August 2025

Warangal: టీవీ రిపేర్ చేస్తామని ఇంట్లోకి వచ్చిన వ్యక్తి.. కాసేపటికే సీన్ సితార..!

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Government Illa Pattalu Pampini,Nara Lokesh: మరో హామీ అమలు.. వారందరికీ ఇళ్లపట్టాలు.. – ap government illa pattalu pampini to gudem kottala residents in kurnool on the initiative of nara lokesh
ఆంధ్రప్రదేశ్

Ap Government Illa Pattalu Pampini,Nara Lokesh: మరో హామీ అమలు.. వారందరికీ ఇళ్లపట్టాలు.. – ap government illa pattalu pampini to gudem kottala residents in kurnool on the initiative of nara lokesh

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Government Illa Pattalu Pampini,Nara Lokesh: మరో హామీ అమలు.. వారందరికీ ఇళ్లపట్టాలు.. – ap government illa pattalu pampini to gudem kottala residents in kurnool on the initiative of nara lokesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్నూలులోని గూడెం కొట్టాల వాసులు నారా లోకేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 40 ఏళ్ల నుంచి ఉంటున్నామని.. శాశ్వత ఇళ్లపట్టాలు ఇప్పించాలని కోరారు. దీంతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన లోకేష్.. తాజాగా 150 మందికి శాశ్వత ఇళ్లపట్టాలు పంపిణీ చేయించారు. మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.

మరో హామీ అమలు.. వారందరికీ ఇళ్లపట్టాలు..
మరో హామీ అమలు.. వారందరికీ ఇళ్లపట్టాలు.. (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరో హామీని నిలబెట్టుకున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా యువగళం పాదయాత్ర నిర్వహించిన నారా లోకేష్.. తాను పర్యటించిన ప్రాంతాలలోని సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ఆయా ప్రాంతాలవాసుల కష్టనష్టాలను తెలుసుకుని టీడీపీ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ విధంగానే కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా కర్నూలు అశోక్‌నగర్‌లోని గూడెం కొట్టాల వాసులకు నారా లోకేష్ అప్పట్లో హామీ ఇచ్చారు. అశోక్‌నగర్‌లోని పంప్ హౌస్ ప్రాంతంలో గూడెం కొట్టాల వాసులు సుమారుగా 40 ఏళ్ల నుంచి పూరిగుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే తమకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ గత కొన్నేళ్లుగా వీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ క్రమంలోనే నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా అప్పటి కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి టీజీ భరత్ నేతృత్వంలో గూడెం కొట్టాల వాసులు నారా లోకేష్‌ను కలిశారు. తమకు శాశ్వత ఇళ్లపట్టాలు ఇప్పించాలని కోరారు. దీంతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గూడెంకొట్టాల వాసుల సమస్యను పరిష్క,రిస్తామని నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు ఇక ఇచ్చిన హామీ ప్రకారం తాజాగా 150 మంది గూడెం కొట్టాల వాసులకు శాశ్వత ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. 2025 జనవరిలో టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.30 ద్వారా ఎకరా స్థలాన్ని 150 మంది పేదలకు ఇళ్లపట్టాల కింద పంపిణీ చేశారు. మంత్రి టీజీ భరత్‌ చేతుల మీదుగా బుధవారం శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం.. ఇళ్లపట్టాలు పంపిణీ చేసినట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. జనవరిలో జారీ చేసిన జీవో 30 కింద తొలిసారిగా మంగళగిరిలో ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తే, రెండోసారి కర్నూలులో ఇచ్చామని గుర్తు చేశారు. ఇంత వేగంగా పని పూర్తి చేసినందుకు అధికారులను టీజీ భరత్.. అభినందించారు.

సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న మంత్రి టీజీ భరత్.. ఈ క్రమంలోనే ఏడాది ఆఖరు నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రస్తుతం గూడెం కొట్టాలలోని 150 మందికి రెవెన్యూ పట్టాలు అందించామని.. త్వరలోనే రిజిస్టర్ట్ పట్టాలు ఇస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గూడెం కొట్టాల వాసులు హర్షం వ్యక్తం చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి