Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Rakhi Festival: మీ సోదరుడికి రాఖీకి బదులుగా రక్షణ కవచం కట్టండి.. నారద పురాణం ప్రకారం రక్షని ఎలా తయారు చేయాలంటే..

7 August 2025

Auto News: బైక్‌ల అమ్మకం ద్వారా డీలర్లు ఎంత సంపాదిస్తారో తెలుసా? వాస్తవాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

7 August 2025

చిక్కుల్లో రతి నిర్వేదం హీరోయిన్.. యువతను తప్పుదోవ పట్టిస్తోందని పోలీస్ కేసు

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»అన్నదాత సుఖీభవ పథకం,అన్నదాత సుఖీభవ: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా.. బీకేర్ పుల్! – cyber fraudsters sending apk files in the name of annadata sukhibhava and officials urge people to be vigilant
ఆంధ్రప్రదేశ్

అన్నదాత సుఖీభవ పథకం,అన్నదాత సుఖీభవ: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా.. బీకేర్ పుల్! – cyber fraudsters sending apk files in the name of annadata sukhibhava and officials urge people to be vigilant

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
అన్నదాత సుఖీభవ పథకం,అన్నదాత సుఖీభవ: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా.. బీకేర్ పుల్! – cyber fraudsters sending apk files in the name of annadata sukhibhava and officials urge people to be vigilant
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Cyber Frauds in the Name of Annadata Sukhibhava Scheme Registration: ఏపీ ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ రెండో తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు విడుదల చేశారు. సుమారుగా 46 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.7000 చొప్పున జమ చేశారు. అలాగే ఈ- కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ వంటి కారణాలతో రానివారికి ప్రక్రియ పూర్తి చేస్తే డబ్బులు జమ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో సైబర్ మోసాలకు తెరతీశారు కేటుగాళ్లు. దీనిపై పోలీసులు, అధికారులు రైతులను హెచ్చరిస్తు్న్నారు.

అన్నదాత సుఖీభవ: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా.. బీకేర్ పుల్!
అన్నదాత సుఖీభవ: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా.. బీకేర్ పుల్! (ఫోటోలు– Samayam Telugu)

Cyber Frauds in the Name of Annadata Sukhibhava Scheme Registration: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు పెట్టుబడి సాయంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద రూ.6000, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రం వాటా రూ.14000 వేలు కలిపి ఏటా మూడు విడతల్లో అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ తొలివిడత నిధులను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సుమారుగా 46 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో రూ.7000 చొప్పున జమ చేసింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులై ఉండి.. ఈ-కేవైసీ, ఎన్‌పీసీఐ లింకింగ్ కానీ రైతులకు మరో అవకాశం కల్పించింది. వెంటనే ఈ ప్రక్రియలను పూర్తి చేసుకుంటే వారి అకౌంట్లోకి కూడా డబ్బులు జమ అవుతాయి.

అయితే ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశమే కొంతమంది కేటుగాళ్లకు వరంగా మారింది. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏపీకే ఫైల్స్ పంపుతూ సైబర్ మోసాలకు తెరలేపారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులకు ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్తూ.. రైతుల ఫోన్లకు ఏపీకే ఫైళ్లను పంపి.. వాటి ద్వారా బ్యాంక్ అకౌంట్లోని నగదు మాయం చేస్తున్నారు.

ఎలా మోసం చేస్తున్నారంటే..

అన్నదాత సుఖీభవ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ వాట్సాప్ ద్వారా తొలుత సందేశం పంపిస్తారు. ఆ మెసేజ్‌లో ఏపీకే ఫైళ్లను పంపిస్తున్నారు. వీటిని క్లిక్ చేసి వివరాలను నమోదు చేస్తే మీ అకౌంట్లోకి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడతాయని నమ్మిస్తున్నారు. ఇది కచ్చితంగా చేయాల్సిన పని అని.. లేకపోతే మీకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడవని భయపెడుతున్నారు. దీంతో రైతులు ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేయగానే.. అవి మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ అవుతున్నాయి. ఆ తర్వాత మన ప్రమేయం లేకుండానే ఫోక్ హ్యాక్ అయ్యి.. సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దీంతో సెల్‌ఫోన్లలోని సమాచారం, పాస్‌వర్డులు వారికి తెలిసిపోయి బ్యాంక్ ఖాతాల్లోని నగదు కాజేస్తున్నారు.

జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు

ఈ నేపథ్యంలో అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమైనా సందేహాలు, అనుమానాలు ఉంటే నేరుగా సచివాలయం లేదా రైతు సేవా కేంద్రాలు, లేదా సదరు అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు పంపించే ఏపీకే ఫైళ్లన ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. అలాగే మొబైల్ ఫోన్‌ సెట్టింగ్‌లలో Install from Unknown Sources ఆప్షన్‌ డిజేబుల్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి