Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kitchen Hacks: వర్షాకాలంలో మహిళలు పనిని ఈజీ చేసే వంటింటి చిట్కాలు మీ కోసం..

7 August 2025

Andhra Pradesh Triple Its Akshaya Patra Food,ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.3,300.. కీలక నిర్ణయం – andhra pradesh government handed over responsibility of managing food and mess in triple its to akshaya patra

7 August 2025

Jio Plan: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.51లకే 5G డేటా.. నెలరోజుల వ్యాలిడిటీ!

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Bride First Night Suicide,సత్యసాయి జిల్లా: నవ వధువు కేసులో ట్విస్ట్.. ఆ సాయంత్రం తల్లిదండ్రులతో ఏం చెప్పిందంటే? – bride ends her life after marriage in somandepalli sri sathya sai district
ఆంధ్రప్రదేశ్

Bride First Night Suicide,సత్యసాయి జిల్లా: నవ వధువు కేసులో ట్విస్ట్.. ఆ సాయంత్రం తల్లిదండ్రులతో ఏం చెప్పిందంటే? – bride ends her life after marriage in somandepalli sri sathya sai district

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bride First Night Suicide,సత్యసాయి జిల్లా: నవ వధువు కేసులో ట్విస్ట్.. ఆ సాయంత్రం తల్లిదండ్రులతో ఏం చెప్పిందంటే? – bride ends her life after marriage in somandepalli sri sathya sai district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సత్యసాయి జిల్లాలో పెళ్లికూతురు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం పెళ్లి జరిగితే సాయంత్రానికి వధువు బలవన్మరణానికి పాల్పడటం సంచలనం రేపింది. సోమందేపల్లిలో ఈ ఘటన జరగ్గా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందనే వివరాలను ఎస్ఐ రమేష్ బాబు వెల్లడించారు. వధువు తల్లిదండ్రులు తెలియజేసిన వివరాలను వెల్లడించారు.

సత్యసాయి జిల్లా: నవ వధువు కేసులో ట్విస్ట్.. ఆ సాయంత్రం తల్లిదండ్రులతో ఏం చెప్పిందంటే?
సత్యసాయి జిల్లా: నవ వధువు కేసులో ట్విస్ట్.. ఆ సాయంత్రం తల్లిదండ్రులతో ఏం చెప్పిందంటే? (ఫోటోలు– Samayam Telugu)

శ్రీసత్యసాయి జిల్లా లో నవ వధువు కఠిన నిర్ణయం తీసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉదయం పెళ్లి జరిగి.. తొలిరాత్రి గడవకముందే పెళ్లి కూతురు తనువు చాలించటం సోమవారం సంచలనం రేపింది. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన కృష్ణమూర్తి, పద్మావతిల ఒక్కగానొక్క కుమార్తె హర్షిత హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా ఉద్యోగం చేస్తున్నారు. 22 ఏళ్ల హర్షితకు పెళ్లి చేయాలని ఆమె కుటుంబం నిర్ణయించింది. కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయించింది. రెండు నెలల కింద నాగేంద్ర, హర్షితలకు నిశ్చిత్తార్థం జరగ్గా.. సోమవారం ఉదయం (ఆగస్ట్ 4) బాగేపల్లిలో ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం శోభనం ఏర్పాట్ల కోసం నూతన వధూవరులను పెండ్లి కూతురు ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఏమైందో తెలియదు కానీ.. సోమవారం రాత్రి హర్షిత గది పైకప్పునకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హర్షిత కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం కీలక వివరాలను వెల్లడించారు. సోమవారం నాగేంద్ర, హర్షితలకు వివాహం జరిగిందని.. శోభనం ఏర్పాట్ల కోసం సోమవారం సాయంత్రానికి కొత్త జంట ఇద్దరూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి హర్షిత ఇంటికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సోమవారం సాయంత్రం ఈ పెళ్లి తనకు ఇష్టం లేదనే సంగతిని హర్షిత.. తన తల్లిదండ్రులకు తెలియజేసిందని ఎస్ఐ రమేష్ బాబు వివరించారు.

దీంతో ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు.. పెళ్లి జరిగిపోయిన తర్వాత ఈ విషయం చెప్తే అందరిలో పరువు పోతుందని హర్షితకు నచ్చజెప్పారు. అయితే తల్లిదండ్రుల పరువు పోతుందనే భయంతోనే పెళ్లికి అంగీకరించానని చెప్పిన హర్షిత.. కాసేపు రెస్ట్ తీసుకుంటానంటూ గదిలోకి వెళ్లింది. అయితే అరగంట గడిచినా బయటకు రాకపోవటంతో ఇంట్లోని వారు.. గడియ విరగ్గొట్టి చూస్తే చీరతో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్సులో పెనుకొండ ఆస్పత్రికి తరలించగా అప్పటికే హర్షిత చనిపోయినట్లు వైధ్యులు ధ్రువీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

రెండు నెలల కిందట జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటే తల్లిదండ్రుల పరువు పోతుందనే కారణంతోనే పెళ్లి చేసుకున్నట్లు హర్షిత సోమవారం సాయంత్రం తమకు చెప్పిందని హర్షిత తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. మరోవైపు ఉదయం పెళ్లి జరిగి.. కాళ్లపారాణి ఆరకముందే పెళ్లి కూతురు చనిపోవటం.. ఆ రెండు కుటుంబాలలో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. కొత్త జీవితం మొదలెడదామని అనుకున్న వరుడి కలలు. కొత్త కోడలు వస్తోందన్న ఆ కుటుంబం ఆశలు ఇలా విషాదమయం కావటం ఒకటైతే.. తల్లిదండ్రుల పరువు పోతుందనే భయంతో నచ్చని పెళ్లి చేసుకుని ఇలా సాయంత్రానికి విగతజీవిగా మారడం హర్షిత కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి