Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral Video: నీటిలో తేలియాడుతూ కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్.!

7 August 2025

బాబా వంగా, నోస్ట్రాడమస్ 2.0 ఇక్కడ.. ముందే క్రికెట్‌ 2025 భవిష్యత్తు చెప్పేసిన అజ్ఞాత వ్యక్తి..

7 August 2025

Andhra Pradesh: వారెవ్వా.. ఏం ప్లాన్ గురూ..! చేపలు, రొయ్యలకు రక్షణగా చల్లటి పరదాలు..!

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Free Bus For Ladies In Ap Latest News,AP Cabinet: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు భారీ శుభవార్త… ఏపీ కేబినెట్ నిర్ణయాలివే.. – ap cabinet approved free bus travel scheme for women from august 15
ఆంధ్రప్రదేశ్

Free Bus For Ladies In Ap Latest News,AP Cabinet: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు భారీ శుభవార్త… ఏపీ కేబినెట్ నిర్ణయాలివే.. – ap cabinet approved free bus travel scheme for women from august 15

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Free Bus For Ladies In Ap Latest News,AP Cabinet: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు భారీ శుభవార్త… ఏపీ కేబినెట్ నిర్ణయాలివే.. – ap cabinet approved free bus travel scheme for women from august 15
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Cabinet Decisions: రాఖీ పౌర్ణమి వేళ రాష్ట్రంలోని మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూ్స్ చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించింది. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలనే ప్రతిపాదనలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమలు చేయనున్నారు. ఆగస్ట్ 9న సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.

రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు భారీ శుభవార్త... ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు భారీ శుభవార్త… ఏపీ కేబినెట్ నిర్ణయాలివే (ఫోటోలు– Samayam Telugu)

Andhra Pradesh Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం వేదికగా ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలపై ఏపీ కేబినెట్ చర్చించింది. అనంతరం పలు కీలక ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏపీ సమాచార, ప్రసారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో రాష్ట్రంలో కొత్త బార్‌ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే ఆగస్ట్ 15 నుంచి ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని వివరించారు.
మరోవైపు ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా.. అరకు, భవానీ ద్వీపంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వివరించారు. ఏపీ బీడీసీఎల్‌ రూ.900 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం హామీగా ఉండాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు వెల్లడించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్తానం (టీటీడీ)కి చెందిన 25 ఎకరాల భూమిని వైష్ణవి ఇన్‌ఫ్రా కంపెనీకి ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వివరించారు. నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులకు గౌరవ వేతనం పెంచినట్లు తెలిపిన మంత్రి పార్థసారథి.. 40వేల సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంట్ ఇస్తున్నట్లు వివరించారు.

టికెట్ తీసుకోమంటే.. చంద్రబాబు వీడియో చూపించారు.. ఇదేందమ్మా?

మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని మహిళలకు బహుమతిగా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. రాఖీ పౌర్ణమి రోజున దీనిపై చంద్రబాబు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇక మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. జిల్లాల పునర్విభజనలో లోపాలు, సరిహద్దుల సమస్యలపై చర్చించినట్లు సమాచారం. వీటిని సరిదిద్దాలని.. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. ఏపీలో జనగణన ప్రారంభమయ్యేలోపు ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి