Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kishan Reddy: రిజర్వేషన్ల పేరుతో ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు: కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

7 August 2025

జిడ్డుగా ఉందని దూరం చేయకండి.. ఇలా వాడితే ఆ 4 సమస్యలకు చెక్ పెట్టినట్లే..

7 August 2025

ఫ్లైఓవర్ పై స్కూటీ నడిపి కొత్త చిక్కుల్లో డీకే శివకుమార్.. స్కూటీపై 34 కేసులు, 18500 ట్రాఫిక్ జరిమానాలు

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»E Crop Registration Status Ap,ఏపీలో రైతులకు అలర్ట్.. కొత్త మార్గదర్శకాలు.. ఫోటో తప్పనిసరి.! – ap government issues guidelines for e panta digital crop survey for farmers
ఆంధ్రప్రదేశ్

E Crop Registration Status Ap,ఏపీలో రైతులకు అలర్ట్.. కొత్త మార్గదర్శకాలు.. ఫోటో తప్పనిసరి.! – ap government issues guidelines for e panta digital crop survey for farmers

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
E Crop Registration Status Ap,ఏపీలో రైతులకు అలర్ట్.. కొత్త మార్గదర్శకాలు.. ఫోటో తప్పనిసరి.! – ap government issues guidelines for e panta digital crop survey for farmers
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అన్నదాతలకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ పంట నమోదు సమయంలో టెక్నికల్ కారణాలతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా గతంలో ఈ పంట నమోదుకు ఉపయోగించిన యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యాప్ స్థానంలో.. కొత్తగా ఈ- పంట డిజిటల్ క్రాప్ సర్వే తీసుకువచ్చింది. దీనిపై మార్గదర్శకాలు జారీ చేసింది.

ఏపీలో రైతులకు అలర్ట్.. కొత్త మార్గదర్శకాలు.. ఫోటో తప్పనిసరి.!
ఏపీలో రైతులకు అలర్ట్.. కొత్త మార్గదర్శకాలు.. ఫోటో తప్పనిసరి.! (ఫోటోలు– Samayam Telugu)

దేశానికి వెన్నెముక రైతన్నలు. అలాంటి రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతూ ఉంటాయి. అలాగే పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖిభవ వంటి పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. వీటితో పాటుగా వాతావరణ ఆధారిత బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నాయి. అయితే ప్రభుత్వాలు అమలు చేసే ఏ సంక్షేమ పథకానికి అయినా పంట నమోదు అనేది తప్పనిసరి. వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ – పంట నమోదు చేస్తుంటారు. అర్హులైన రైతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోఈ – క్రాపింగ్ పద్ధతిని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

అయితే పంట నమోదులో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు.. రైతులకు ఒక్కోసారి ఇబ్బందులు తెప్పిస్తుంటాయి. ఈ సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వ ప్రయోజనాలు అందక కొన్నిసార్లు నష్టపోతుంటారు కూడా. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ-పంట డిజిటల్‌ క్రాప్‌ సర్వే యాప్‌లో మార్పులు చేస్తున్నారు. దీని ద్వారా అర్హులైన రైతులు అందరికీ మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గతంలో పంట నమోదు కోసం యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యాప్ ఉపయోగించేవారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ యాప్ వాడకాన్ని రద్దు చేసింది. దాని స్థానంలో 2025 ఖరీఫ్ సీజన్‌లో నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా ఈ-పంట డిజిటల్‌ క్రాప్‌ సర్వే పేరుతో మరో అప్లికేషన్ తెచ్చింది. ఈ- పంట డిజిటల్ క్రాప్ సర్వేలో సాగు భూముల వివరాలు కచ్చితంగా ఉండేలా చూడాలని ఏపీ ప్రభుత్వం తాజాగా గైడ్‌లైన్స్ జారీ చేసింది.

ఈ – పంట డిజిటల్ క్రాప్ సర్వేలో.. వ్యవసాయ పంటలకు ఏఓ, ఉద్యాన పంటలకు హార్టికల్చర్ ఆఫీసర్, ప్రభుత్వ, వ్యవసాయేతర భూములకు ఎమ్మార్వోలు బాధ్యులుగా ఉంటారు. వీరంతా ఆయా భూములను, పంటల సాగు, రికార్డులు వంటి వివరాలను పర్యవేక్షిస్తారు. ఈ రికార్డుల ఆధారంగా ఆర్ఎస్కేల సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సి ఉంటుంది. అలాగే సర్వే సమయంలో రైతుకు ఎకరా కంటే తక్కువ భూమి ఉన్నట్లయితే ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ భూమిలో పంట ఉన్నా, లేకపోయినా కూడా ఫోటో తీయాల్సి ఉంటుంది. అలాగే రైతు సేవా కేంద్రాల సిబ్బంది కూడా తమ పరిధిలోని రెవెన్యూ గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ భూములను మ్యాపింగ్‌ చేయాలి. ఇందుకు వీలుగా వారి ఫోన్లు సిద్ధం చేసుకుంటేనే యాప్ పనిచేస్తుందని అధికారులు చెప్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి