Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Rashid Khan: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. 650 వికెట్లతో ప్రపంచ రికార్డ్

6 August 2025

UPI పేమెంట్స్‌లో భారత్‌ సరికొత్త రికార్డు.. రోజుకు ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయో తెలుసా?

6 August 2025

Telangana: బర్త్ డే పార్టీలో రచ్చ రచ్చ.. కత్తులతో డ్యాన్సులు చేస్తూ యువకుల హంగామా.. వీడియో వైరల్

6 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Gvmc Standing Committee Election Results,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. టీడీపీ కూటమి గెలిచింది కానీ.! అదెలా? – gvmc standing committee election results and nda alliance wins
ఆంధ్రప్రదేశ్

Gvmc Standing Committee Election Results,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. టీడీపీ కూటమి గెలిచింది కానీ.! అదెలా? – gvmc standing committee election results and nda alliance wins

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gvmc Standing Committee Election Results,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. టీడీపీ కూటమి గెలిచింది కానీ.! అదెలా? – gvmc standing committee election results and nda alliance wins
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీలోని పది స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 9 స్థానాలలో విజయం సాధించగా.. వైసీపీ ఒక స్థానం దక్కించుకుంది. అయితే గతేడాది జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయగా.. ఈసారి ఒక స్థానంలో వైసీపీ గెలుపొందటం విశేషం.

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. టీడీపీ కూటమి గెలిచింది కానీ.! అదెలా?
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. టీడీపీ కూటమి గెలిచింది కానీ.! అదెలా? (ఫోటోలు– Samayam Telugu)

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఈసారి కాస్త ఆసక్తికరంగా సాగాయి. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు ఇప్పటికే కూటమి ఖాతాలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం పది స్థానాలకు ఎన్నికలు జరగా.. టీడీపీ నేతృత్వంలోని కూటమి 9 స్థానాలు గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో గెలుపొందింది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ 8, బీజేపీకి ఒక స్థానం దక్కింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతేడాది జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో.. ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. పదికి పది స్థానాలు దక్కించుకుంది. అయితే ఈసారి వైసీపీ ఓ స్థానం దక్కించుకోవడం విశేషం.

బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ ఓటింగ్ జరిగింది. మొత్తం 92 మంది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. అయితే క్రాస్ ఓటింగ్ జరగటంతో టీడీపీ కూటమి ఒకస్థానంలో ఓడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది పది స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయగా.. ఈసారి ఓ స్థానం కోల్పోవటంతో సమీక్షించుకుంటామని కూటమి నేతలు చెప్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందటంతో జీవీఎంసీ వద్ద కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

మరోవైపు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో ఎన్డీఏ కూటమికి 64 మంది కార్పొరేటర్ల మద్దతు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 31 మంది కార్పొరేటర్ల బలం ఉంది. వామపక్షాలకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో పది స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం కూటమి నుంచి 10 మంది, వైసీపీ నుంచి 10 మంది పోటీ చేశారు. అయితే కూటమి నుంచి 9 మంది, వైసీపీ నుంచి ఒకరు గెలుపొందారు. స్టాండింగ్ కమిటీ పదవీ కాలం ఏడాది పాటు ఉంటుంది. ఏడాది పాటు వీరంతా స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయితే జీవీఎంసీ పాలకవర్గం పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 12తో ముగియనుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి