వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయం వేడెక్కింది. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ టీడీపీ, వైసీపీ నేతల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై బుధవారం కొంతమంది దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ రమేష్, వేముల రాము వాహనాన్ని కారుతో ఢీకొట్టి కొంతమంది రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లా నల్లగొండువారిపల్లెలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో వేముల రాము తీవ్రంగా గాయపడ్డారు. దీంతో.. పోలీసులే ఆయనను చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైసీపీ నేతలపై దాడికి పాల్పడింది టీడీపీ నేతలేనని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపిస్తుండగా.. సొంతపార్టీ నేతలపై వారే దాడికి పాల్పడి తమపై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
.