Andhra Pradesh Kumki Elephants Food Menu: ఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేస్తుండటంతో, వాటిని అడవిలోకి తరిమికొట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులతో తొలి ఆపరేషన్ విజయవంతమైంది. తదుపరి ఆపరేషన్ కుంకీని పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కుంకీ ఏనుగుల ఫుడ్ మెనూ ఎలా ఉంది.. ప్రతి రోజూ కొన్ని గంటల పాటూ ఆ ఏనుగులు తినే పనిలోనే ఉంటాయట..
హైలైట్:
- కర్ణాటక నుంచి వచ్చిన కుంకీలు
- రోజువారీ ఫుడ్ మెనూ ఇలా ఉంది
- రోజుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా

ఆ తర్వాత సాయంత్రం 4 గంటల వరకు అడవిలో నడక ఉంటుంది.. ఆ సమయంలో మేత కూడా ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు వాటికి స్నానం చేయిస్తారు.. సాయంత్రం 5.30 గంటలకు రాగి ముద్దలు తినిపించి నీళ్లు తాగిస్తారు. రాత్రి 6.30 నుంచి 12 గంటల వరకు వరి కంకులు, రావి ఆకులు, అరటి బోదెలు, గడ్డి తింటూ నిద్రపోతాయి. ఒక్కో ఏనుగు రోజుకు 17 నుంచి 18 గంటలు తింటూనే ఉంటుంది. మొత్తం 30మంది సిబ్బంది ఈ శిబిరంలో కుంకీలను పర్యవేక్షిస్తున్నారు.. శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఫలించాయి.. కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైంది. పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగులను కుంకీలు దారిమళ్లించాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తొలి ఆపరేషన్ను విజయవంతం చేసిన అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. చిత్తూరు జిల్లాలో అటవీ శాఖ అధికారులు ‘ఆపరేషన్ కుంకీ’ ప్రారంభించారు. బంగారుపాళ్యం మండలంలోని మొగిలి దగ్గర ఏనుగుల గుంపు మామిడి తోటలను నాశనం చేస్తుండటంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. కుంకీ ఏనుగుల సహాయంతో అటవీ శాఖ అధికారులు ఏనుగులను అడవిలోకి తరిమికొట్టారు. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీ ఏనుగులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగులు తిరుగుతున్నాయని సమాచారం అందింది. దీంతో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. శనివారం రాత్రి మొదలైన ఈ ఆపరేషన్ ఆదివారం ఉదయం వరకు కొనసాగింది.
AP Kumki Elephants: పలమనేరుకు చేరుకున్న కుంకీ ఏనుగులు
కర్ణాటక నుండి తెప్పించిన ఈ కుంకీ ఏనుగులతో చేపట్టిన మొదటి ఆపరేషన్ విజయవంతం కావడం సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. సరిహద్దు ప్రాంత ప్రజలకు, రైతులకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఏనుగుల నుండి ప్రజలను, పంటలను కాపాడేందుకు కృషి చేస్తోందని, ఇది అందులో మొదటి అడుగు అని ఆయన పేర్కొన్నారు. రెండు నెలల శిక్షణ తర్వాత ఈ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఏనుగుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం ఈ ఆపరేషన్ ఉపయోగపడుతుంది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న అటవీ అధికారులకు, మావటిలకు, కావడిలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కుంకీ ఏనుగులను ఇచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు, ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి ఆపరేషన్ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.