Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో

7 August 2025

Tirumala Tirupati Devasthanams New Jobs,TTD Jobs: టీటీడీలో కొత్తగా ఉద్యోగాలు.. భారీగా పోస్టులు, ఈవో కీలక ఆదేశాలు – ttd eo j syamala rao review on various new jobs in different departments in tirumala tirupati devasthanams

7 August 2025

Uttarkashi Glacier Burst: ధరాలి విషాదం వెనుక అసలు కారణం ఇదే.. వాతావరణ శాస్త్రవేత్త ఏమి చెప్పారంటే

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Haj Pilgrims Rs 1 Lakh Deposited,ఏపీలో ఒక్కొక్కరి అకౌంట్‌లో ఉచితంగా రూ.లక్ష జమ చేశారు.. వారందరికి ప్రతి ఏటా ఇస్తారు – andhra pradesh government deposited financial assistance of rs 1 lakh each in bank accounts of haj pilgrims 2025
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Haj Pilgrims Rs 1 Lakh Deposited,ఏపీలో ఒక్కొక్కరి అకౌంట్‌లో ఉచితంగా రూ.లక్ష జమ చేశారు.. వారందరికి ప్రతి ఏటా ఇస్తారు – andhra pradesh government deposited financial assistance of rs 1 lakh each in bank accounts of haj pilgrims 2025

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Haj Pilgrims Rs 1 Lakh Deposited,ఏపీలో ఒక్కొక్కరి అకౌంట్‌లో ఉచితంగా రూ.లక్ష జమ చేశారు.. వారందరికి ప్రతి ఏటా ఇస్తారు – andhra pradesh government deposited financial assistance of rs 1 lakh each in bank accounts of haj pilgrims 2025
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Govt Rs 1 Lakh Deposited In Haj Pilgrims Accounts: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలకమైన హామీని ప్రభుత్వం నెరవేర్చింది. ఈ మేరకు ఒక్కో బ్యాంక్ అకౌంట్‌లో లక్ష రూపాయల చొప్పున జమ చేసింది. ఈ మేరకు విజయవాడ ఎంబార్కేషన్ ఎంచుకున్న 72 మంది హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం అందింది. 2025లో యాత్రికులు తక్కువగా ఉండటంతో రద్దయిన ఎంబార్కేషన్ పాయింట్‌ను సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం పునరుద్ధరించింది. మక్కాకు వెళ్లే యాత్రికులకు అదనపు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం చేస్తోంది.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంది
  • వారందరికి రూ.లక్ష చొప్పున జమ
  • 2026లో కూడా డబ్బులు ఇస్తారు
ఏపీ హజ్ యాత్రికులకు రూ.లక్ష జమ
ఏపీ హజ్ యాత్రికులకు రూ.లక్ష జమ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలకమైన హామీని అమలు చేసింది. ఈ మేరకు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.లక్ష చొప్పున జమ చేసింది. విజయవాడ నుంచి హజ్ యాత్రికులు 72 మంది బ్యాంక్ అకౌంట్‌లలో రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం జమ చేశారు. రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ హసన్ బాషా ఈ విషయాన్ని తెలిపారు. 2025లో విజయవాడ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే వారు ఎక్కువమంది లేరు.. ఈ క్రమంలో విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్‌ను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.. ఎంబార్కేషన్ పాయింంట్ కేటాయించాలని కోరారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్రం విజయవాడకు మళ్లీ ఎంబార్కేషన్ పాయింట్‌ను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం హజ్‌ యాత్రికులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయడంపై ఆంధ్రప్రదేశ్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్‌ షిబ్లీ స్వాగతించారు.. హర్షం వ్యక్తం చేశారు.

అయితే విజయవాడ నుంచి మక్కా వెళ్లే ముస్లిం యాత్రికులకు అదనంగా రూ.70 వేలు ఖర్చు అవుతోంది. ఈ క్రమంలో ఆ ఆర్థికసాయాన్ని ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఏపీ ప్రభుత్వం భరిస్తోంది. ఈ మేరకు మక్కాకు వెళ్లే యాత్రికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విజయవాడ నుంచే హజ్ యాత్రకు వెళ్లేందుకు ప్రయత్నించాలని.. రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ హసన్ బాషా సూచించారు. ఏపీ ప్రభుత్వం 72మందికి మంగళవారం నిధుల్ని విడుదల చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. మరుసటి రోజైన బుధవారం డబ్బులు వారి అకౌంట్‌లలో జమ చేశారు. అంతేకాదు హజ్‌-2026 యాత్రకు సంబంధించి.. విజయవాడ ఎంబార్కేషన్‌ కేంద్రం నుంచి వెళ్లే యాత్రికులకు కూడా ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం అందిస్తామని ఏపీ మంత్రి ఫరూక్ తెలిపారు. ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారు మొదటి ప్రాధాన్యంగా విజయవాడ ఎంబార్కేషన్‌ కేంద్రాన్ని ఎంచుకోవాలని సూచించారు.

పచ్చని పొలాల మధ్య.. మంచం మీద కూర్చుని.. రైతులతో మాట్లాడిన చంద్రబాబు

గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేశారు.. దేశవ్యాప్తంగా మొత్తంగా 17 అంతర్జాతీయ విమానశ్రయాల్లో ఎంబార్కేషన్‌ పాయింట్లు ఉన్నాయి. విజయవాడలో ఎంబార్కేషన్‌ పాయింట్‌ ఏర్పాటు చేయడంతో హజ్‌యాత్ర చేసే ముస్లింలకు ఉపయోగం కలుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటుపై కేంద్రానికి లేఖ రాశారు.. దీంతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లింలు విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇకపై హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు హజ్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. విజయవాడ లేదా గుంటూరు దగ్గరలో శాశ్వత హజ్ హౌస్ నిర్మాణం కోస స్థలం కేటాయించాలని కోరారు. అలాగే హజ్ యాత్ర-2026 కోసం విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి