Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

India Squad: భారత జట్టులో బ్యాడ్‌లక్ ప్లేయర్లు.. అన్యాయానికి బ్రాండ్ అంబాసిడర్లు ఈ ఇద్దరే..

7 August 2025

భర్తతో మనస్పర్థలు.. సీనియర్ హీరోయిన్ విడాకులు.. షాక్ లో ఫ్యాన్స్

7 August 2025

ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Districts Name Change,ఏపీలో జిల్లాల పేర్లు మార్పు, కొత్త పేర్లు.. కొత్త జిల్లాలు కూడా.. మెయిన్ లిస్ట్ ఇదే, బాలయ్య నుంచి ఓ డిమాండ్ – andhra pradesh cabinet discussed on name change of districts and new districts formation
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Districts Name Change,ఏపీలో జిల్లాల పేర్లు మార్పు, కొత్త పేర్లు.. కొత్త జిల్లాలు కూడా.. మెయిన్ లిస్ట్ ఇదే, బాలయ్య నుంచి ఓ డిమాండ్ – andhra pradesh cabinet discussed on name change of districts and new districts formation

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Districts Name Change,ఏపీలో జిల్లాల పేర్లు మార్పు, కొత్త పేర్లు.. కొత్త జిల్లాలు కూడా.. మెయిన్ లిస్ట్ ఇదే, బాలయ్య నుంచి ఓ డిమాండ్ – andhra pradesh cabinet discussed on name change of districts and new districts formation
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Districts Name Change: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేబినెట్‌లో కూడా చర్చించారు.. అయితే నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశంతో పాటుగా జిల్లా ప్రధాన కేంద్రాలను మార్చాలంటూ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్లు మార్పు
  • కేబినెట్‌లో చర్చించిన సీఎం చంద్రబాబు
  • నెలలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు
ఏపీ జిల్లాలు మండలాల పేర్లు సరిహద్దుల మార్పు
ఏపీ జిల్లాలు మండలాల పేర్లు సరిహద్దుల మార్పు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు.. జిల్లాలు సరిహద్దులు, పేర్లు మార్పు.. మండలాల మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తోంది. ఇటీవల ఏడుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌ యాదవ్‌, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. తాజాగా కేబినెట్ భేటీలో జిల్లాలకు సంబంధించిన అంశాలన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ మేరకు నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల పేర్ల మార్పు, ప్రధాన కేంద్రాలు, డివిజన్‌లు, సరిహద్దులు, మండలాల అంశంపై కమిటీ పరిశీలన ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారట. అలసు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారా అని అడిగారట. కొత్త జిల్లాల ఏర్పాటులో గత ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందన్న చంద్రబాబు.. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారట. ఈ నెల 12 తర్వాత ఉపసంఘం సమావేశం అవుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎంకు వివరించారట. అయితే డిసెంబర్ నాటికి ఈ సమస్యల్ని ఓ కొలిక్కి రావాలని ఆలస్యం చేయొద్దని సూచించారట. ఈ ఉప సంఘం జిల్లాల పేర్ల మార్పు, సరిహద్దుల మార్పు, ప్రధాన కార్యాలయాల మార్పు వంటి అంశాలను పరిశీలిస్తుంది. వీటితో పాటుగా డివిజన్లు, మండలాల అంశాలను కూడా పరిశీలిస్తుంది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా ఉపసంఘం పరిశీలించి నివేదికను తయారు చేయనుంది.

ఏపీలో పలు కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్లు మార్పు, జిల్లాలు, మండలాలకు సంబంధించిన డిమాండ్‌లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత ఐదేళ్లుగా వినిపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ అంశం కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చింది

అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి కాకుండా రాజంపేట ప్రధాన కేంద్రంగా ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురాన్ని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.. కానీ భీమవరాన్ని పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించారు. ఇటు శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు అడుగుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కేంద్రంగా పుట్టపర్తి ఉంది.

జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు

కొత్త 26 జిల్లాల్లో ఒక గిరిజన జిల్లా ఉంటుందని చెప్పిన గత ప్రభుత్వం.. రెండు జిల్లాలను ప్రకటించింది. పాడేరు ప్రధాన కేంద్రం అల్లూరి సీతారామరాజు.. పార్వతీపురం ప్రధాన కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటైంది. అయితే మన్యం జిల్లా పేరు మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. రెవెన్యూ డివిజన్ల విభజనపై కూడా వినతులు వస్తు్న్నాయి. వీటితో పాటుగా పలు రెవెన్యూ డివిజన్లు, మండలాల అంశాలు కూడా తెరపైకి వచ్చాయి.. వాటిని సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి