Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

TGSRTC: ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీ.. వారితో అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక..

9 August 2025

వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే మ్యాజిక్ చిట్కాలు మీకోసం..! ఇప్పుడే తెలుసుకుని ట్రై చేయండి..!

9 August 2025

పచ్చి ఉల్లి తినే అలవాటు మీకూ ఉందా? మీ ఒంట్లో జరిగే మార్పులివే..

9 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Tirupati Devasthanams New Jobs,TTD Jobs: టీటీడీలో కొత్తగా ఉద్యోగాలు.. భారీగా పోస్టులు, ఈవో కీలక ఆదేశాలు – ttd eo j syamala rao review on various new jobs in different departments in tirumala tirupati devasthanams
ఆంధ్రప్రదేశ్

Tirumala Tirupati Devasthanams New Jobs,TTD Jobs: టీటీడీలో కొత్తగా ఉద్యోగాలు.. భారీగా పోస్టులు, ఈవో కీలక ఆదేశాలు – ttd eo j syamala rao review on various new jobs in different departments in tirumala tirupati devasthanams

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Tirupati Devasthanams New Jobs,TTD Jobs: టీటీడీలో కొత్తగా ఉద్యోగాలు.. భారీగా పోస్టులు, ఈవో కీలక ఆదేశాలు – ttd eo j syamala rao review on various new jobs in different departments in tirumala tirupati devasthanams
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TTD New Jobs Notification: టీటీడీలో ఉద్యోగాల భర్తీపై ఈవో జే శ్యామలరావు దృష్టి సారించారు. ఈ మేరకు కీలక సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా స్విమ్స్‌లో పారామెడికల్ సిబ్బంది నియామకం, ఇంజినీరింగ్ విభాగంలో 57 ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహణపై అధికారులతో ఆయన చర్చించారు. దేవస్థానంలోని ఖాళీల భర్తీకి ఆయాస్కి సంస్థ సూచనలు చేసిన సంగత తెలిసిందే. ఇటు టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డిని ఐటీ ఇంఛార్జ్ పదవి నుంచి తొలగించి.. ఫణికుమార్ నాయుడును నియమించారు.

హైలైట్:

  • టీటీడీ ఈవో జే శ్యామలరావు సమీక్ష
  • టీటీడీలో మరికొన్ని ఉద్యోగాల భర్తీ
  • పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
టీటీడీలో ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్
టీటీడీలో ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్ (ఫోటోలు– Samayam Telugu)

టీటీడీలో ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టారు ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు ఐదు గంటలపాటు వివిధ విభాగాల అధికారులతో పెండింగ్‌లో ఉన్న పనులపై చర్చించారు. 12 ముఖ్యమైన విభాగాల గురించి మాట్లాడి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. స్విమ్స్‌ ఆసుపత్రిలో సిబ్బంది నియామకం, ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ, దేవస్థానంలో ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. స్విమ్స్‌ ఆసుపత్రిలో 128 మంది పారా మెడికల్ సిబ్బందితో పాటు రిజిస్ట్రార్ స్థాయి అధికారులను నియమించాలని గతంలో నిర్ణయించారు. ఈ నియామక ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చ జరిగింది.వీటితో పాటుగా ఇంజినీరింగ్ విభాగంలో 57 ఉద్యోగాల కోసం 37,121 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పరీక్ష నిర్వహించడానికి ప్రశ్నాపత్రం తయారు చేసి త్వరలో పరీక్ష నిర్వహిస్తారు. దేవస్థానంలోని ముఖ్యమైన విభాగాల్లో ఖాళీలను శాశ్వత, తాత్కాలిక పద్ధతుల్లో భర్తీ చేయడానికి హైదరాబాద్‌లోని ఆయాస్కి అనే సంస్థ కొన్ని సూచనలు చేసింది. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన రమేష్ కుమార్ ఈ అంశంలో టీటీడీకి సూచనలు చేస్తున్నారు. ఆరుగురు సభ్యుల కమిటీ దేవస్థానంలోని ఆయా విభాగాల్లో ఎలాంటి ఉద్యోగులు ఉండాలి, వారి పనితీరు ఎలా ఉండాలి అనే విషయాలపై నివేదికను సమర్పించినట్లు సమాచారం.

తిరుమల శ్రీవారి సేవలో సూర్య జ్యోతిక దంపతులు.. కూతుర్ని చూశారా..?

మరోవైపు టీటీడీ ఈవో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రవాణా విభాగం జీఎంగా పనిచేస్తున్న శేషారెడ్డిని ఐటీ ఇంఛార్జ్ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఫణికుమార్ నాయుడును నియమించారు.. ఆయన గతంలో అటవీశాఖలో డిప్యుటేషన్‌పై పనిచేశారు. గత ప్రభుత్వంలో నిబంధనలు పాటించకుండా ఐటీ జీఎంగా సందీప్‌రెడ్డిని తీసుకున్నారు. అర్హత లేకున్నా తీసుకున్నారని గుర్తించి ఆయనను తొలగించారు. కానీ ఆయనకు జీతం మాత్రం ఇంకా అందుతూనే ఉంది.. ఆయన ప్రస్తుతం బర్డ్‌ ఆసుపత్రిలో కంప్యూటర్‌ విభాగంలో పనిచేస్తున్నారు. సందీప్‌రెడ్డి భవితవ్యంపై నిర్ణయం తీసుకునేందుకు ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద టీటీడీ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి