Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips: దంతాలు పచ్చగా ఎందుకు మారుతాయి..? కారణాలు తెలిస్తే అవాక్కే..

9 August 2025

Shubman Gill: జెర్సీ వేలం.. గిల్ జెర్సీకి ఎంత ధర వచ్చిందో తెలుసా..?

9 August 2025

Health Tips: రాత్రి తిన్న వెంటనే నడిస్తే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాకే..

9 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Lingala Jaggayyapeta Bridge,ఏపీ తెలంగాణ మధ్య కీలకమైన కాజ్‌వే రెడీ.. ఈ రూట్‌లో రూ.1.90 కోట్లతో.. ఇక రైట్, రైట్ – all set to open lingala jaggayyapeta bridge today in ntr district andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Lingala Jaggayyapeta Bridge,ఏపీ తెలంగాణ మధ్య కీలకమైన కాజ్‌వే రెడీ.. ఈ రూట్‌లో రూ.1.90 కోట్లతో.. ఇక రైట్, రైట్ – all set to open lingala jaggayyapeta bridge today in ntr district andhra pradesh

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Lingala Jaggayyapeta Bridge,ఏపీ తెలంగాణ మధ్య కీలకమైన కాజ్‌వే రెడీ.. ఈ రూట్‌లో రూ.1.90 కోట్లతో.. ఇక రైట్, రైట్ – all set to open lingala jaggayyapeta bridge today in ntr district andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Lingala Jaggayyapeta Bridge Opening: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన కాజ్‌వే పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య చేతుల మీదుగా లింగాల బ్రిడ్జిని ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు. మున్నేరు వరదల కారణంగా కాజ్‌వే దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రూ.1.90 కోట్లతో శాశ్వత మరమ్మతులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు స్థానికులతో పాటుగా జగ్గయ్యపేటలోని సిమెంటు కంపెనీలకు చాలా కీలకమైనది.

హైలైట్:

  • తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన రోడ్డు
  • గతేడాది మున్నేరు వరదలతో దెబ్బతింది
  • రూ.1.90కోట్లతో మరమ్మతుల పనులు
ఏపీ తెలంగాన మధ్య రూ.1.90 కోట్లతో లింగాల కాజ్‌వే రెడీ
ఏపీ తెలంగాన మధ్య రూ.1.90 కోట్లతో లింగాల కాజ్‌వే రెడీ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య లింగాల కాజ్‌వే చాలా కీలకమైనది.. ఈ లింగాల కాజ్‌వే తెలుగు రాష్ట్రాలను కలుపుతుంది. అయితే నేటి నుంచి మళ్లీ కాజ్‌వే పై నుంచి వాహనాలు సాఫీగా ప్రయాణించనున్నాయి. ఈ కాజ్‌వేకు శాశ్వత మరమ్మతులు పూర్తి కావడంతో మొత్తం రూ.1.90 కోట్లతో ఈ మరమ్మతులు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కాజ్‌వే మరమ్మతుల సమస్య ఎన్నో ఏళ్లుగా ఉంది.. మొత్తానికి ఆ సమస్య తీరడంతో స్థానికంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.. ఈ క్రమంలో మున్నేరు వరదల కారణంగా లింగాల కాజ్‌వే దెబ్బతినిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.. స్థానికులు చాలా ఇబ్బందిపడ్డారు.. రవాణాకు ఇబ్బందులు తప్పలేదు. అంతేకాదు జగ్గయ్యపేటలో ఉన్న సిమెంటు కంపెనీలకు ముడి సరుకు చేర్చడం కష్టతరంగా మారింది. తెలంగాణ వైపుకు వెళ్లడం కూడా ఇబ్బందిగా మారింది. ఆ సమీపంలోని వత్సవాయి మండలంలోని కొన్ని ఊర్ల జనాలు జగ్గయ్యపేటకు వెళ్లలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ రోడ్డులో నుంచి ఆర్టీసీ బస్సులు కూడా తిరిగేవి.. స్థానికులు కాజ్‌వే మరమ్మతు పనులు చేపట్టాలని కోరారు.

ఈ సమస్యపై జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వెంటనే స్పందించారు.. సిమెంటు కంపెనీల యజమానులతో మాట్లాడి.. వారి సహాయంతో ఆ రోడ్డును తాత్కాలికంగా బాగు చేయించారు.. కాకపోతే చిన్న వాహనాలు వెళ్లేలా మాత్రమే ఆ రోడ్డును వేశారు. అయితే ఆ రోడ్డు కొంతకాలానికి మళ్లీ గుంతలమయంగా మారి పాడైపోవడంతో జనాలు మళ్లీ ఇబ్బందిపడ్డారు. అప్పుడు ఈ కాజ్‌వేకు శాశ్వతంగా మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య రంగంలోకి దిగారు.. ఈ సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించారు.

వీడియో: చీపురు పట్టి చెత్త ఊడ్చిన సీఎం చంద్రబాబు

ఆ వెంటనే ఈ రోడ్డుకు శాశ్వతంగా మరమ్మతులు చేయించారు.. ఏకంగా రూ.1.90 కోట్లు మంజూరు చేశారు. జూన్‌లో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించగా.. జులై నెలాఖరుకు పనులు ముగింపు దశకు వచ్చాయి. స్లాబ్ కల్వర్టుల నిర్మాణం కూడా పూర్తి కావడంతో ఇవాళ ప్రారంభిస్తున్నారు. జగ్గయ్యపేట సమీపంలో ఉన్న సిమెంటు పరిశ్రమల ముడిసరకు రవాణాకు ఈ రోడ్డు చాలా కీలకమని చెబుతారు. అంతేకాదు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ముఖ్యమైన రోడ్డు.. ఇంతకాలం వారంతా ఇబ్బందిపడ్డారు.. మొత్తానికి సమస్యను పరిష్కరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ సమీప గ్రామాలతో పాటుగా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి