Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips: దంతాలు పచ్చగా ఎందుకు మారుతాయి..? కారణాలు తెలిస్తే అవాక్కే..

9 August 2025

Shubman Gill: జెర్సీ వేలం.. గిల్ జెర్సీకి ఎంత ధర వచ్చిందో తెలుసా..?

9 August 2025

Health Tips: రాత్రి తిన్న వెంటనే నడిస్తే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాకే..

9 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pithapuram Lorry Theft,ఏకంగా లారీనే ఎత్తుకెళ్లిన దొంగలు.. కొద్ది దూరంలో లారీ దొరికింది కానీ.. ఊహించని ట్విస్ట్ – sunflower oil packets load lorry theft near tuni national highway pithapuram
ఆంధ్రప్రదేశ్

Pithapuram Lorry Theft,ఏకంగా లారీనే ఎత్తుకెళ్లిన దొంగలు.. కొద్ది దూరంలో లారీ దొరికింది కానీ.. ఊహించని ట్విస్ట్ – sunflower oil packets load lorry theft near tuni national highway pithapuram

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pithapuram Lorry Theft,ఏకంగా లారీనే ఎత్తుకెళ్లిన దొంగలు.. కొద్ది దూరంలో లారీ దొరికింది కానీ.. ఊహించని ట్విస్ట్ – sunflower oil packets load lorry theft near tuni national highway pithapuram
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Pithapuram Sunflower Oil Lorry Theft: కాకినాడ జిల్లాలో లారీ చోరీ ఘటన కలకలం రేపింది. డెయిరీ ఫారమ్ సెంటర్‌కు చెందిన అప్పారావు లారీని భువనేశ్వర్‌కు పంపేందుకు పిఠాపురంలో పార్క్ చేసి తాళం డ్రైవర్ రమణకు ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం చూస్తే లారీ కనిపించకుండా పోయింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద గుర్తించారు. తుని వద్ద లారీని వదిలి ఆయిల్ ప్యాకెట్లు దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.

హైలైట్:

  • పిఠాపురం సమీపంలో లారీ
  • లారీ దగ్గరకు వెళ్లి చూస్తే ట్విస్ట్
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పిఠాపురంలో లారీ ఎత్తుకెళ్లారు
పిఠాపురంలో లారీ ఎత్తుకెళ్లారు (ఫోటోలు– Samayam Telugu)

కాకినాడలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు నింపిన లారీని చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. లారీలో దాదాపు రూ.28 లక్షల విలువైన నూనె ప్యాకెట్లు ఉన్నాయి. కాకినాడ డెయిరీ ఫారమ్‌ సెంటర్‌కు చెందిన లారీ యజమాని దగ్గు అప్పారావు ఒక ఆయిల్ కంపెనీ నుంచి సన్‌ఫ్లవర్ నూనె ప్యాకెట్లను లోడ్ చేయించారు. అక్కడి నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళ్లాలి.. ఆయన లారీని పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం దగ్గర పార్క్ చేసి.. డ్రైవర్ నాళం రమణకు లారీని అప్పగించిన తర్వాత అప్పారావు తిరిగి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం రమణ ఒడిశా వెళదామని లారీ దగ్గరకు వచ్చి చూసేసరికి లారీ అక్కడ లేదు.

లారీ కనిపించకపోవడంతో షాకైన రమణ.. వెంటనే యజమాని అప్పారావుకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఏం జరిగిందో ఆరా తీశారు.. లారీ యజమాని అప్పారావు జరిగిందంతా చెప్పారు. వెంటనే పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా.. గొల్లప్రోలు టోల్‌ప్లాజాను ఆ లారీ దాటుకుని వెళ్లినట్లు తేల్చారు. మంగళవారం అర్ధరాత్రి 1.27 గంటల సమయంలో టోల్‌ప్లాజాను దాటి వెళ్లడం కనిపించింది. కాకినాడ పోలీసులు వెంటనే విశాఖపట్నం వైపు పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు.

ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..

ఇంతలో తుని నేషనల్ హైవేపై లారీ ఉన్నట్లు పిఠాపురం పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు లారీ దగ్గరకు వెళ్లి చూస్తే.. ఆయిల్‌ ప్యాకెట్లు దోచేసినట్లు గుర్తించారు. రోడ్డు పక్కన ఖాళీ లారీని వదిలేసి వెళ్లిపోయారు. లారీ యజమాని అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. లారీలో ఏకంగా రూ.28 లక్షల విలువైన నూనె ప్యాకెట్లు ఉన్నాయని చెబుతున్నారు. పోలీసులు లారీని వదిలేసి వెళ్లిపోయిన ప్రాంతం నుంచి సీసీ ఫుటేజ్ పరిశీలించే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏపీలో గతంలో కొన్ని ముఠాలు హైవేలపై చోరీలు చేసిన ఘటనలు ఉన్నాయి. దోపిడీ ముఠానే ఇలా లారీని ఎత్తుకెళ్లి ఆయిల్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లిందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలో కూడా ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లడం కలకలం రేపింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి