Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

భర్తకు విడాకులిచ్చి.. 12 ఏళ్ల చిన్నవాడితో ఎఫైర్.. 48 వయసులో అదే హాట్‌నెస్

10 August 2025

Free Bus Travel Scheme: మరో 5 రోజుల్లోనే ఉచిత ప్రయాణం.. మొత్తం 8,458 RTC బస్సులు కేటాయించిన సర్కార్!

10 August 2025

Metro: మెట్రో విప్లవం.. దేశవ్యాప్తంగా రోజుకు ఎంత మంది ప్రయాణిస్తారో తెలుసా..?

10 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Farmers Drumstick Farming Rs 1 Lakh Help,ఏపీలో రైతులకు శుభవార్త.. ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.లక్ష ఉచితంగా ఇస్తారు.. దరఖాస్తు చేస్కోండిలా – andhra pradesh government provides rs 1 lakh for farmers to drumstick cultivation
ఆంధ్రప్రదేశ్

Ap Farmers Drumstick Farming Rs 1 Lakh Help,ఏపీలో రైతులకు శుభవార్త.. ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.లక్ష ఉచితంగా ఇస్తారు.. దరఖాస్తు చేస్కోండిలా – andhra pradesh government provides rs 1 lakh for farmers to drumstick cultivation

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Farmers Drumstick Farming Rs 1 Lakh Help,ఏపీలో రైతులకు శుభవార్త.. ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.లక్ష ఉచితంగా ఇస్తారు.. దరఖాస్తు చేస్కోండిలా – andhra pradesh government provides rs 1 lakh for farmers to drumstick cultivation
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Farmers Rs 1 Lakh Help: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. రాష్ట్రంలో మునగ సాగు చేసే రైతులకు ఆర్ధికంగా సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. డ్వామా ద్వారా ఎకరాకు రూ.1,00,828 వరకు ఉచితంగా ఇస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మునగ సాగుతో లాభాలు పొందండి. మరిన్ని వివరాల కోసం మీ మండలంలోని ఉపాధి హామీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు
  • ఆ పంట సాగు చేస్తే రూ.లక్ష వరకు ఇస్తారు
  • మంచి లాభాలు కూడా వస్తాయంటున్నారు
ఏపీలో మునుగసాగు చేసే రైతులకు శుభవార్త
ఏపీలో మునుగసాగు చేసే రైతులకు శుభవార్త (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తోంది. వ్యవసాయ పరికరాలతో పాటుగా పంటను బట్టి సాగుకు సాయం అందిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మునగ సాగు చేసే రైతులకు సాయం చేస్తోంది. ఆరోగ్యానికి మేలు చేసే పంట కావడంతో ఎక్కువ మంది రైతులు సాగు చేసేందుకు ప్రోత్సాహం అందిస్తోంది. డ్వామా ద్వారా తోటల పెంపకం, వాటిని కాపాడటానికి డబ్బులు ఇస్తోంది. ఇటీవల కాలంలో రైతులు మునగ సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. రెండేళ్ల పాటూ తోట నిర్వహణకు ఎకరాకు రూ.1,00,828 వరకు ఇస్తోంది.. ఈ డబ్బును ఉచితంగానే ఇస్తోంది.రైతులు తమ పొలంలో 25 సెంట్ల నుంచి ఒక ఎకరా, ఐదు ఎకరాల వరకు మునగను సాగు చేయొచ్చు. ఈ మేరకు డ్వామా ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇస్తుంది. రైతులు దీనిని పూర్తిస్థాయి పంటగా సాగు చేయాలి.. అలాగే ఒక ఎకరాకు 448 మునగ మొక్కలు నాటాలి. రైతులు పొలంలో మొక్కలు నాటడానికి గుంతలు తీయడంతో పాటుగా ఎరువులు వేయడానికి, మునగ తోటలో వేరే పంటలు వేయడానికి.. ఇలా రెండేళ్ల పాట తోటను చూసుకునేందకు ప్రభుత్వం సాయం చేస్తంది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు వారి పొలం భూమి పాస్ బుక్ జీరాక్స్, 1B, ఉపాధి హామీ జాబ్ కార్డు జీరాక్ తీసుకోని మండల ఉపాధి హామీ కార్యాలయం లేదా MPDO లేదా గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌కి అందజేస్తే ఈ ప్రొసెస్ మొత్తం చేస్తారని అధికారులు చెబుతున్నారు.

గండికోటను సందర్శించిన సీఎం చంద్రబాబు.. అబ్బో ఇన్ని సమస్యలు ఉన్నాయా!

గతంలో మునగ సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు మునగ సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. మునగ కాయలు, ఆకులు, ఆకు పొడిని ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. దీనితో మునగ సాగు లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. ఆకులు, విత్తనాలు, కాయలు అన్నీ ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు అని సూచిస్తున్నారు. పొడిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చు అంటున్నారు.. ఇలా రైతులు ఆదాయం పొందవచ్చంటున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి